Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Andhra Pradesh: నో టెన్షన్.. ఇకపై ఆ ప్రాంతాల్లోనూ ఓయో రూమ్స్..

10 August 2025

లక్ష అకౌంట్‌లో వేస్తే.. 6లక్షలు పంపిస్తాం.. లోన్ యాప్ మోసం తట్టుకోలేక..

10 August 2025

భర్తకు విడాకులిచ్చి.. 12 ఏళ్ల చిన్నవాడితో ఎఫైర్.. 48 వయసులో అదే హాట్‌నెస్

10 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Free Current To Weavers,National Handloom Day: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఈనెల నుంచి వారందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ – andhra pradesh cm nara chandrababu naidu announces free current to weavers on national handloom day
ఆంధ్రప్రదేశ్

Free Current To Weavers,National Handloom Day: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఈనెల నుంచి వారందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ – andhra pradesh cm nara chandrababu naidu announces free current to weavers on national handloom day

.By .7 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Free Current To Weavers,National Handloom Day: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఈనెల నుంచి వారందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ – andhra pradesh cm nara chandrababu naidu announces free current to weavers on national handloom day
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


National Handloom Day: ఏపీలో ఉన్న చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు. ఈనెల నుంచే వారందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని చేనేతలను ప్రోత్సహించి.. వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని తేల్చి చెప్పారు. ఇక అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చేనేత వైభవానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఈనెల నుంచి వారందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంట్
గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. ఈనెల నుంచి వారందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ (ఫోటోలు– Samayam Telugu)

National Handloom Day : 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా.. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని.. చేనేత కార్మికులపై వరాల జల్లు కురిపించారు. చేనేత కార్మికుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చూసే బాధ్యత తనదేనని వెల్లడించారు. చేనేత మగ్గాలు ఉన్నవారికి, పవర్ లూమ్‌లకు ఉచితంగా విద్యుత్ అందింస్తామని తేల్చి చెప్పారు. కొత్త డిజైన్లపై చేనేత కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చి.. వారి ఆదాయాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. చేనేతపై జీఎస్టీని కూడా రీయంబర్స్ చేస్తామని.. చేనేత కార్మికులకు పెన్షన్లు ఇస్తామని వెల్లడించారు. జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో అక్కడికి వచ్చిన చేనేత కార్మికులతో సీఎం చంద్రబాబు.. నేరుగా మాట్లాడి వారి సమస్యలు, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన మార్గాలపై చర్చించారు.

ఈ నెల నుంచే చేనేత మగ్గాలు ఉన్నవారికి నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటును సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒకవేళ పవర్ లూమ్ ఉన్నవారికి నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా చేనేత కార్మికులకు జీఎస్టీలో 5 శాతాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 50 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు నెల నెలా పెన్షన్లు అందిస్తామని చంద్రబాబు తెలిపారు. వీటన్నింటితోపాటు రాజధాని అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా చేనేత వైభవానికి పుట్టినిల్లు తెలుగు నేల అని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేనేత ఒక సంపద అని చంద్రబాబు కొనియాడారు. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖద్దరును మహాత్మాగాంధీ మెచ్చుకున్నారని గుర్తు చేశారు. హరప్పా కాలం నుంచి చేనేత అభివృద్ధి చెందుతూ వస్తోందని.. నాగరికతకు మూలం నేతన్ననే అంటూ ప్రశంసలు కురిపించారు. కాకతీయులు పాలించిన కాలంలో.. నాణేలపైన చేనేతల ముద్రలు కనిపిస్తాయని పేర్కొన్నారు.

వ్యాపారం కోసం భారత్‌కు వచ్చిన బ్రిటిష్ వారు.. మన దేశంలోని చేనేతలపై ప్రభావం చూపారని తెలిపారు. అందుకే స్వాతంత్య్ర పోరాటంలో విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని.. మన దేశంలో నేసిన బట్టలను మాత్రమే ఉపయోగించాలని గాంధీజీ చెప్పారని చెప్పారు. తెలుగుదేశం పార్టీతో చేనేతలకు అవినాభావ సంబంధం ఉందన్న చంద్రబాబు.. వారికి మొట్టమొదట ఉపాధి కల్పించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో చేనేతల కోసం రాజీ లేని పోరాటం చేసినట్లు చంద్రబాబు చెప్పారు.

మన దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం వస్త్ర పరిశ్రమ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 55,500 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.27 కోట్ల రుణాలు ఇచ్చినట్లు చంద్రబాబు వెల్లడించారు. మొత్తం 90,765 కుటుంబాలకు 100 యూనిట్లు ఉచిత కరెంటును సరఫరా చేసినట్లు తెలిపారు. చేనేత కార్మికులు చిన్న వయసులోనే అనారోగ్యం పాలవుతుండటంతో వారికి 50 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 50 శాతం సబ్సిడీతో మర మగ్గాలు ఇచ్చేందుకు రూ.80 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ట్రెండింగ్ టాపిక్స్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలను శివరామచారి అందిస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై ఫ్యాక్ట్‌చెక్‌ వార్తలు రాసిన అనుభవం ఉంది. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV సంస్థలో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి