Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వయ్యారాలతో వల వేస్తున్న విశ్వంభర బ్యూటీ.. ఆషికా అందాలు అదుర్స్

8 August 2025

Mohammed Siraj : ఇంగ్లాండ్ సిరీసులో పిచ్చి పట్టినట్లే 31కిమీ పరిగెత్తిన మహమ్మద్ సిరాజ్.. కష్టానికి తగ్గ ఫలితం దక్కింది బ్రో

8 August 2025

Rakhi Festival: రాఖీ పండగ రోజున రాళ్ల వర్షం కురిపించుకునే గ్రామస్తులు.. వింత సంప్రదాయం వెనుక నమ్మకం ఏమిటంటే..

8 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Guntur Traffic Diversions,గుంటూరులో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. ఈ రూట్లలోనే వెళ్లండి.. పోలీసుల అలర్ట్ – traffic diversions in guntur from august 9th due to sankar vilas flyover demolition
ఆంధ్రప్రదేశ్

Guntur Traffic Diversions,గుంటూరులో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. ఈ రూట్లలోనే వెళ్లండి.. పోలీసుల అలర్ట్ – traffic diversions in guntur from august 9th due to sankar vilas flyover demolition

.By .8 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Guntur Traffic Diversions,గుంటూరులో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. ఈ రూట్లలోనే వెళ్లండి.. పోలీసుల అలర్ట్ – traffic diversions in guntur from august 9th due to sankar vilas flyover demolition
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Guntur Traffic Diversions Flyover Razing: గుంటూరు నగరంలో శంకర్ విలాస్ వంతెన కూల్చివేత పనులు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. భారీ వాహనాలను దారి మళ్లించడంతో పాటు, మిగిలిన వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనదారులు సహకరించాలని ఎస్పీ సతీష్ కుమార్ కోరారు. ప్రయాణికులు సూచనలు అనుసరించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని గుంటూరు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

హైలైట్:

  • గుంటూరులో ట్రాఫిక్ మళ్లింపులు
  • ప్రజల్ని అలర్ట్ చేసిన పోలీసులు
  • ఆ రూట్లలో వెళ్లాలని సూచనలు
గుంటూరు ట్రాఫిక్ మళ్లింపులు అమలు
గుంటూరు ట్రాఫిక్ మళ్లింపులు అమలు (ఫోటోలు– Samayam Telugu)
గుంటూరువాసుల్ని పోలీసులు అలర్ట్ చేశారు.. నగరంలో శంకర్ విలాస్ వంతెన కూల్చివేత పనులు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో శంకర్ విలాస్ వంతెనపై భారీ వాహనాల రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు.. మిగిలిన వాహనాల రాకపోకలకు 9వ తేదీ నుంచి మళ్లింపులు ఉంటాయని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వంతెన కూల్చివేత కారణంగా ట్రాఫిక్ సమస్యలు రాకుండా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఈ మేరకు ఆ సూచనలు ఇలా ఉన్నాయి.1) అమరావతి రోడ్ → MTB సెంటర్ వైపు వెళ్లే హెవీ వెహికల్స్ :- చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ మార్గంలో ప్రయాణించాలి.

2) లాడ్జి Lodge సెంటర్ → MTB సెంటర్ వైపు కార్లు, ఆటోలు, టూ వీలర్లు :- అరండల్ పేట → పొట్టి శ్రీరాములు నగర్ → డొంక రోడ్డు → మూడు వంతెనలు (లేదా) బ్రాడీపేట → కంకరగుంట ఫ్లైఓవర్ మార్గంగా ప్రయాణించాలి. తిరుగు ప్రయాణం కూడా ఇదే మార్గంలో చేయాలి.

3) MTB సెంటర్ → Lodge సెంటర్ వైపు వెళ్లే హెవీ వెహికల్స్ (స్కూల్, కాలేజ్ బస్సులు సహా) :- రమేష్ హాస్పిటల్ నుండి → కంకరగుంట ఫ్లైఓవర్ మార్గాన్ని వినియోగించాలి.

4) కోబాల్ట్ పేట, కృష్ణానగర్, చంద్రమౌళినగర్, బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం ప్రాంతాల నుంచి మార్కెట్ వైపు వచ్చే వాహనాలు :- పట్టాభిపురం పోలీస్ స్టేషన్ రోడ్ (లేదా)బ్రాడీపేట 18 లైన్ → కంకరగుంట అండర్‌పాస్ → కలెక్టర్ ఆఫీస్ రోడ్ → రమేష్ హాస్పిటల్ మార్గం.

5) పట్టాభిపురం నుండి GGH వైపు వెళ్లేవారు :- కంకరగుంట ఫ్లైఓవర్ → MTB సెంటర్ → వుమెన్స్ కాలేజ్ → పల్లవి థియేటర్ మార్గాన్ని వినియోగించాలి.

బెయిల్‌పై విడుదలైన తురకా కిషోర్.. వెంటనే అరెస్టు..

6) Lodge సెంటర్ → MTB సెంటర్ వైపు వెళ్లే హెవీ వెహికల్స్ :- చిల్లీస్ → ఇన్నర్ రింగ్ రోడ్ → ఆటోనగర్ → బస్టాండ్ (లేదా) కంకరగుంట ఫ్లైఓవర్ మార్గాలను ఉపయోగించుకోవాలి. ఈ మేరకు వాహనదారులు పై విధంగా వివిధ మార్గాల్లో మార్గదర్శకాలను అనుసరించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్ కోరారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి