Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood : 32 ఏళ్ల వయసులో 19 ఏళ్ల హీరోయిన్‏తో పెళ్లి.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా క్రేజ్.. ఆస్తులు తెలిస్తే..

8 August 2025

గుడ్‌న్యూస్‌.. వచ్చే నెలనుంచే వందేభారత్ తొలి స్లీపర్ రైలు

8 August 2025

Vastu Tips: ఏ దిశలో తల పెట్టి నిద్రించడం మంచిది? ఈ దిక్కు మీ సంపదను రెట్టింపు చేస్తుంది..!

8 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Demolition Unauthorized Buildings Guntur,Buildings Demolition: ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత.. నోటీసులు జారీ.. – guntur municipal corporation launched a special drive to bulldoze illegal structures
ఆంధ్రప్రదేశ్

Demolition Unauthorized Buildings Guntur,Buildings Demolition: ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత.. నోటీసులు జారీ.. – guntur municipal corporation launched a special drive to bulldoze illegal structures

.By .8 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Demolition Unauthorized Buildings Guntur,Buildings Demolition: ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత.. నోటీసులు జారీ.. – guntur municipal corporation launched a special drive to bulldoze illegal structures
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Guntur Illegal structures demolition: గుంటూరులో అక్రమ కట్టడాల మీద అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అలాంటి వాటికి నోటీసులు జారీ చేసి కూల్చివేతలు చేపడుతోంది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. గత మూడురోజులుగా ఈ స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ఇందుకోసం టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటుచేశారు. శుక్రవారం నుంచి అనధికారిక లేఅవుట్ల తొలగింపు కూడా చేపట్టనున్నట్లు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.

ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత.. నోటీసులు జారీ..
ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత.. నోటీసులు జారీ.. (ఫోటోలు– Samayam Telugu)
Guntur Illegal structures demolition : అక్రమ నిర్మాణాలు.. ప్రభుత్వాలను వేధిస్తున్న ప్రధాన సమస్య. అనుమతులు లేకుండా భవనాల నిర్మాణాలతో ప్రజల ప్రాణాలకు ప్రమాదంతో పాటు.. వరదలు వంటివి కూడా సంభవించే అవకాశం ఉంది. నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే.. వర్షాకాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో హైదరాబాద్ పరిస్థితులు గమనిస్తే తెలుస్తుంది. అలాగే చెరువులు, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఏమవుతుందో బుడమేర వాగు ఉద్ధృతి తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కన్నెర్ర జేస్తున్నారు. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలపై గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేత కోసం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. జీఎంసీలోని టౌన్ ప్లానింగ్ విభాగం ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల కూల్చివేతలను ఈ బృందాలకు అప్పగించింది.

జీఎంసీ అధికారులు ఇప్పటికే ఇలాంటి నిర్మాణాలను చాలా వాటిని గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు, భవన నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు తేలితే అలాంటి వాటిని కూల్చివేస్తామని గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గత మూడు రోజులుగా పలు కాలనీలలో ఇలా చేపట్టిన నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కూల్చివేసినట్లు తెలిపారు. అలాంటి నిర్మాణాలను ఎలాంటి జాప్యం లేకుండా కూల్చివేయాలని సూచించినట్లు తెలిపారు. భవానీ నగర్, శ్రీరామనగర్ ఏడో లైన్, బొంగరాల బీడు, అరండల్ పేట్ వంటి ప్రాంతాలలో ఇప్పటికే భవనాల కూల్చివేతను మొదలుపెట్టినట్లు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.

వీటితో పాటుగా మరో 25 అనధికారిక భవనాలను గుర్తించామని..వాటికి తుది నోటీసులు జారీ చేసినట్లు జీఎంసీ కమిషనర్ వివరించారు. శుక్రవారం నుంచి అనధికారిక లేఅవుట్లను తొలగించే కార్యక్రమం మొదలుపెట్టనున్నట్లు వివరించారు. అలాగే జీఎంసీ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. జీఎంసీకి నిర్దేశిత మొత్తంలో ఫీజు చెల్లించని హోర్డింగులను కూడా తొలగించాలని ఆదేశించారు. వార్డు ప్లానింగ్ అధికారులు వారికి సంబంధించిన ప్రాంతాలలో పర్యటించి.. అక్రమ నిర్మాణాలను గుర్తించాలని.. వాటికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే ఫీజు చెల్లించని హోర్డింగులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్ల మీద భవన నిర్మాణాల మెటీరియల్ ఉంచిన వారికి పెనాల్టీ విధించాలని స్పష్టం చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి