Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Jan Dhan Yojana: మీకు జన్ ధన్ అకౌంట్ ఉందా..? రీ కేవైసీ చేయించకపోతే ఏమవుతుందో తెలుసా..?

8 August 2025

ఫుల్‌గా మందు కొట్టాడ.. కారును రైల్వే ప్లాట్‌ఫామ్ పై పార్క్ చేసాడు.. అదే కదా మ్యాజిక్కు

8 August 2025

Actress: చేసిందే మూడు సినిమాలు.. ఒకటి బ్లాక్ బస్టర్.. రెండు డిజాస్టర్స్.. అయినా తగ్గని క్రేజ్..

8 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Current Bill Pay,కరెంట్ వినియోగదారులకు మంచి ఛాన్స్.. 50 శాతం రాయితీ.. ఎప్పటి వరకూ గడువుందంటే? – aperc extends deadline for household electricity consumers to regularize excess load till december 31
ఆంధ్రప్రదేశ్

Ap Current Bill Pay,కరెంట్ వినియోగదారులకు మంచి ఛాన్స్.. 50 శాతం రాయితీ.. ఎప్పటి వరకూ గడువుందంటే? – aperc extends deadline for household electricity consumers to regularize excess load till december 31

.By .8 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Current Bill Pay,కరెంట్ వినియోగదారులకు మంచి ఛాన్స్.. 50 శాతం రాయితీ.. ఎప్పటి వరకూ గడువుందంటే? – aperc extends deadline for household electricity consumers to regularize excess load till december 31
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


APERC Voluntary Additional Load Scheme Offer: గృహ విద్యుత్ వినియోగదారులకు ఏపీఈఆర్‌సీ మంచి అవకాశం కల్పిస్తోంది. అదనపు విద్యుత్ క్రమబద్ధీకరణ గడువు జూన్ 30తో ముగియగా.. తాజాగా దానిని డిసెంబర్ 31వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సరైన ప్రచారం లేక ఎక్కువ మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారనే కారణంతో స్వచ్ఛందంగా అదనపు లోడ్ క్రమబద్ధీకరణ కోసం డిసెంబర్ 31వ తేదీ వరకూ ఛాన్స్ ఇచ్చింది. ఆలోపు చేసుకుంటే 50 శాతం వరకూ రాయితీ అందించనుంది.

కరెంట్ వినియోగదారులకు మంచి ఛాన్స్.. 50 శాతం రాయితీ.. ఎప్పటి వరకూ గడువుందంటే?
కరెంట్ వినియోగదారులకు మంచి ఛాన్స్.. 50 శాతం రాయితీ.. ఎప్పటి వరకూ గడువుందంటే? (ఫోటోలు– Samayam Telugu)
APERC Voluntary Additional Load Scheme Offer: కరెంట్ వినియోగదారులకు ఏపీఈఆర్‌సీ మరోసారి అద్భుత అవకాశం కల్పించింది. అదనపు లోడును క్రమబద్ధీకరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) గడువు పొడిగించింది. గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించి విద్యుత్ అదనపు లోడును క్రమబద్ధీకరించుకునేందుకు తొలుత జూన్ 30 వరకూ సమయం ఇచ్చారు. అయితే ఈ పథకంపై సరైన అవగాహన లేకపోవటంతో చాలా మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో విద్యుత్ అదనపు లోడు స్వచ్ఛందంగా క్రమబద్ధీకరించుకునేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. ఈలోపు అదనపు లోడ్ క్రమబద్ధీకరించుకున్నవారికి కరెంట్ ఛార్జీలలో 50 శాతం వరకూ రాయితీ అందించునున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే విద్యుత్ అదనపు లోడ్ క్రమబద్ధీకరణ పథకంపై ప్రచారం, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఏంటీ అదనపు లోడ్..

సాధారణంగా మనందరం ఇళ్లల్లో కరెంట్ బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు, కూలర్లు, ఫ్రిజ్‌లు వంటివి ఉపయోగిస్తూ ఉంటాం. దీంతో ఇళ్లల్లో కరెంట్ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో విద్యుత్ కనెక్షన్ కోసం అప్లై చేసుకున్న సమయంలో నమోదు చేసిన కరెంట్ లోడ్ కంటే ఈ మొత్తం దాటిపోతోంది. దీంతో ఈ అదనపు భారం రెగ్యులేటరీల మీద పడుతోంది. దీంతో విద్యుత్ సరఫరాలో సమస్యలు, లోఓల్టేజ్ ఇష్యూలు వస్తున్నాయి. దీంతో అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. అయితే సాధారణంగా గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించి.. అదనపు లోడ్ కిలోవాట్‌కు డెవలప్‌మెంట్‌ ఛార్జీ కింద రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్‌గా రెండు వందల రూపాయలు.. దీనికి తోడు దరఖాస్తుకు రూ.50 కలిపి మొత్తంగా రూ.2,500 వరకూ వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. అదనపు ఖర్చుల కింద మరో రూ.250 అధికం. అయితే అదే ఇప్పుడు ఉన్న పథకం ప్రకారం స్వచ్ఛందంగా విద్యుత్ అదనపు లోడ్ క్రమబద్ధీకరించుకునే వారు రూ.1,250 చెల్లిస్తే చాలు. అదనపు లోడ్ క్రమబద్ధీకరణకు తొలుత జూన్ 30 వరకూ సమయం ఇచ్చారు. ఆ గడువు ముగిసిపోగా.. తాజాగా ఈ గడువును డిసెంబర్ 31 వరకూ పొడగించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి