కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వరమహాలక్ష్మి పండుగను ఘనంగా జరుపుకున్నారు. దేవి ఆలయాలలో ప్రత్యేక కార్యక్రమాలను , పూజలను నిర్వహించారు. మాండ్య జిల్లా శ్రీరంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారు ధన లక్ష్మి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చింది. ఈ ఆలయంలోని దేవతను ప్రత్యేక ధనలక్ష్మి అలంకరణలో రూ.4.5 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. కళాకారుడు సందేశ్ కళావిడ , బృందం అలంకరణ కోసం రూ.10 నుండి రూ.500 వరకు కరెన్సీ నోట్లను ఉపయోగించారు. ఈ అలంకరణ ధనలక్ష్మి రూపంలో ఉన్న లక్ష్మిదేవికి చిహ్నమని ఆలయ పూజారులు చెప్పారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా తెల్లవారుజాము నుండే అమ్మవారి ఆలయంలో భక్తులు రద్దీ నెలకొంది. శ్రీరంగపట్నం కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని ఒక చారిత్రాత్మక పట్టణం.
ఈ ఆలయం దుర్గాదేవి రూపమైన చాముండేశ్వరి దేవికి అంకితం చేయబడింది. శ్రీ చాముండేశ్వరి ఆలయం చారిత్రాత్మకంగా ముఖ్యమైనది. స్కంద పురాణం వంటి పురాతన గ్రంథాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉంది. ఈ ఆలయం మైసూర్ వడయార్ రాజవంశంతో అనుబంధంతో ప్రసిద్ధి చెందింది, మహారాజులు ఈ ఆలయాన్ని పోషించారు. రాజ గోపురంతో సహా పలు నిర్మాణాలు చేపట్టారు. అంతేకాదు ఈమె మైసూర్ రాజకుటుంబానికి సంరక్షక దేవత. ఈ ఆలయాన్ని శక్తి పీఠంగా పరిగణిస్తారు. కొన్ని సంప్రదాయాల ప్రకారం ఇది సతీదేవి వెంట్రుకలు పడిపోయిన ప్రదేశం పేర్కొన్నారు .
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..