Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

నెయ్యితో ఇలా చేస్తే.. జుట్టు సమస్యలు తోకముడిచి పరార్..

9 August 2025

Seethakka: రాఖీ కట్టిన సీతక్క.. ‘మంచి చీర కొనుక్కో’ అంటూ కోమటిరెడ్డి ఎంతిచ్చారో తెలుసా..?

9 August 2025

10 క్లాస్ ఫెయిల్ .. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోప్.. రూ.200కోట్లకు మహారాణి ఈ భామ

9 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Fish Andhra Shops Used For Salons,జగన్ సర్కార్ ఫిష్ ఆంధ్ర షాపుల్ని ఇలా వాడేస్తున్నారు.. వామ్మో వీళ్ల తెలివికి, కొత్త ఐడియా – fish andhra shops changed as salons and tea hotels in kakinada district
ఆంధ్రప్రదేశ్

Ap Fish Andhra Shops Used For Salons,జగన్ సర్కార్ ఫిష్ ఆంధ్ర షాపుల్ని ఇలా వాడేస్తున్నారు.. వామ్మో వీళ్ల తెలివికి, కొత్త ఐడియా – fish andhra shops changed as salons and tea hotels in kakinada district

.By .9 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Fish Andhra Shops Used For Salons,జగన్ సర్కార్ ఫిష్ ఆంధ్ర షాపుల్ని ఇలా వాడేస్తున్నారు.. వామ్మో వీళ్ల తెలివికి, కొత్త ఐడియా – fish andhra shops changed as salons and tea hotels in kakinada district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


AP Fish Andhra Shops Salons: గత ప్రభుత్వ హయాంలో కాకినాడ జిల్లాలో ‘ఫిష్‌ ఆంధ్ర’ పేరుతో సముద్ర ఉత్పత్తుల అమ్మకాల కోసం షాపులు ఏర్పాటు చేశారు. రాయితీపై ఇచ్చిన ఈ షాపులను కొందరు ఇతర వ్యాపారాలకు మార్చేశారు. ప్రస్తుతం చాలా దుకాణాల్లో టీ కొట్టులు, సెలూన్లు, జిరాక్స్ సెంటర్లు వెలిశాయి. రాయితీ పొందిన తర్వాత షాపుల్ని నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

హైలైట్:

  • ఏపీలో ఫిష్ ఆంధ్ర షాపులు
  • ఆ షాపుల్ని పూర్తిగా మార్చేశారు
  • టి కోట్లు, సెలూన్లుగా మార్పు
ఏపీలో ఫిష్ ఆంధ్ర షాపులు సెలూన్లుగా
ఏపీలో ఫిష్ ఆంధ్ర షాపులు సెలూన్లుగా (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఫిష్‌ ఆంధ్ర పేరుతో షాపులు ప్రారంభించింది. ఆ షాపుల్లో చేపలు, రొయ్యలు, పీతలు వంటివి విక్రయించారు. గత ప్రభుత్వ హయాంనాటి ఈ షాపులు ప్రస్తుతం టీ కొట్టులుగా, జిరాక్స్ సెంటర్లుతో పాటూ సెలూన్లు, చిన్న హోటల్స్‌గా మారాయి. ఫిష్ ఆంధ్ర పథకం ద్వారా సముద్ర ఉత్పత్తులను అమ్మేందుకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల విలువైన యూనిట్లు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం, ఇతరులకు 40 శాతం రాయితీ ఇచ్చారు. అయితే కాకినాడ జిల్లాలో ఈ షాపుల్ని మార్చేసి వేరే వ్యాపారాలు చేస్తున్నారట.చేపల అమ్మకాలతో సంబంధం లేని వారికి యూనిట్లు కేటాయించడంతో రాయితీ పొందిన తర్వాత వాటిని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం 90 శాతం దుకాణాల్లో చేపల ఉత్పత్తులు అమ్మడం లేదని చెబుతున్నారు. చాలా మంది ఇతర వ్యాపారాలు చేస్తున్నారట.. ప్రజలు చేపల కోసం దూరం వెళ్లాల్సి వస్తోంది అన్నారు. కాకినాడ జిల్లాలో కొన్నిచోట్ల ఫిష్‌ ఆంధ్ర షాపును ఇప్పుడు సెలూన్ షాపు ఉందట. మరో చోట ఫిష్ ఆంధ్ర షాపులో టీ కేఫ్ నడుస్తోందట.

కొన్ని చోట్ల టీటైం, ఐస్‌ పార్లర్‌గా మార్చారట. మరో చోట ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌గా మార్చేశారట. కొన్ని షాపుల్ని జిరాక్స్ సెంటర్ ఏర్పాటు చేశారట. కాకినాడలో ‘ఫిష్‌ ఆంధ్ర’ షాపుల్ని యువతకు స్వయం ఉపాధి కోసం కేటాయించారు. అయితే వాటిని కొందరు సరిగా నిర్వహించడం లేదని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. రాయితీ పొందిన తరువాత షాపుల్ని నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తామన్నారు.

గండికోటను సందర్శించిన సీఎం చంద్రబాబు.. అబ్బో ఇన్ని సమస్యలు ఉన్నాయా!

గత ప్రభుత్వ హయాంలో కేటాయించి ఈ ఫిష్ ఆంధ్ర షాపుల్ని కొంతకాలం నిర్వహించారు.. తర్వాత వాటిని మూసివేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ షాపుల్లో వేరే, వేరే వ్యాపారాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం రాయితీ ఇచ్చిన ఈ షాపుల్లో వేరే వ్యాపారాలు చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి