Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Baps: రక్షాబంధన్ ఆశీస్సులు అందించిన పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్.. ఏం చెప్పారంటే..?

9 August 2025

Tollywood : రచ్చ లేపిన రుక్సార్ ధిల్లన్.. ఫోటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

9 August 2025

Hyderabad: రాఖీ అనుబంధానికి కొత్త అర్థం చెప్పిన ట్రాఫిక్‌ పోలీసులు.. రాఖీలతో రోడ్లపైకి వచ్చి..

9 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pawan Kalyan Rakhi Pournami Gift,రాఖీ పండగ వేళ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. ఆ మహిళలు అందరికీ కానుకలు.. – ap deputy cm pawan kalyan gift saree to widow in pithapuram on the occasion of rakhi pournami
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan Rakhi Pournami Gift,రాఖీ పండగ వేళ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. ఆ మహిళలు అందరికీ కానుకలు.. – ap deputy cm pawan kalyan gift saree to widow in pithapuram on the occasion of rakhi pournami

.By .9 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pawan Kalyan Rakhi Pournami Gift,రాఖీ పండగ వేళ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. ఆ మహిళలు అందరికీ కానుకలు.. – ap deputy cm pawan kalyan gift saree to widow in pithapuram on the occasion of rakhi pournami
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


రాఖీ పండగ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పిఠాపురంలోని వితంతు మహిళలకు చీరలను కానుకగా పంపించారు. సుమారుగా 1500 వితంతు మహిళలకు పవన్ కళ్యాణ్ తరుఫున స్థానిక జనసేన నేతలు చీరలను పంపిణీ చేశారు. భర్తలు దూరమైన మహిళలకు అన్నగా అండగా ఉంటాననే భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాఖీ పండగ వేళ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. ఆ మహిళలు అందరికీ కానుకలు..
రాఖీ పండగ వేళ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. ఆ మహిళలు అందరికీ కానుకలు.. (ఫోటోలు– Samayam Telugu)
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని పిఠాపురం ఆడపడుచులకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానుకలు పంపించారు. పిఠాపురానికి చెందిన 1,500 మంది వితంతు మహిళలకు చీరలు పంపించారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసైనికుల ద్వారా పవన్ కళ్యాణ్ ఈ కానుకలు పంపారు. వివిధ కారణాలతో భర్తను కోల్పోయిన వితంతువులకు.. సోదరుడిగా నేనున్నాననే భరోసా కల్పించడంతో పాటుగా వారందరిలో ఆత్మస్థైర్యం నింపేలా పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రతి ఆడపడుచునూ గౌరవిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాలని జనసేన నేతలను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రాఖీ పండుగ కానుకగా పిఠాపురం నియోజకవర్గానికి చీరలను పంపించారు.

ఈ చీరలను పిఠాపురం నియోజకవర్గం జనసేన నేతలు ఇంటింటికి వెళ్లి పవన్ కళ్యాణ్ తరుఫున రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపి అందజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం శాసన సభ్యుడిగా మాత్రమే కాకుండా, సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా ఈ కానుకలు పంపినట్లు పవన్ కళ్యాణ్ సందేశాన్ని వారికి తెలియజేశారు. ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన రాఖీ పండుగ కానుకతో మహిళలు ఉద్వేగానికి గురయ్యారు. తమను అక్కాచెల్లెళ్లుగా స్వీకరించి చీరలు పంపించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన నేతలు కూడా పలుచోట్ల రాఖీ పండగ కానుకలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో వితంతు మహిళలకు రక్షా బంధన్ కానుకలు పంపిణీ చేశారు. వారికి ఎలాంటి సమస్య వచ్చినా జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు పిఠాపురంలోని అనాథ పిల్లల కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన నెల జీతం విరాళంగా అందిస్తున్నారు. అలాగే పిఠాపురంలోని ప్రైవేట్ ఎలక్ర్టీషియన్ల భద్రత కోసం కిట్లను కూడా ఇటీవల పంపిణీ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏడాది కాలంలో సుమారుగా రూ.300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయి మెజారిటీతో పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి