Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Health Tips: దంతాలు పచ్చగా ఎందుకు మారుతాయి..? కారణాలు తెలిస్తే అవాక్కే..

9 August 2025

Shubman Gill: జెర్సీ వేలం.. గిల్ జెర్సీకి ఎంత ధర వచ్చిందో తెలుసా..?

9 August 2025

Health Tips: రాత్రి తిన్న వెంటనే నడిస్తే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాకే..

9 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Guntur Shankar Vilas Bridge,70 ఏళ్ల బంధానికి బై బై.. ఎమోషనల్ అవుతున్న జనం.. ఇక చరిత్రలో జ్ఞాపకమే! – guntur shankar vilas bridge demolition work begins
ఆంధ్రప్రదేశ్

Guntur Shankar Vilas Bridge,70 ఏళ్ల బంధానికి బై బై.. ఎమోషనల్ అవుతున్న జనం.. ఇక చరిత్రలో జ్ఞాపకమే! – guntur shankar vilas bridge demolition work begins

.By .9 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Guntur Shankar Vilas Bridge,70 ఏళ్ల బంధానికి బై బై.. ఎమోషనల్ అవుతున్న జనం.. ఇక చరిత్రలో జ్ఞాపకమే! – guntur shankar vilas bridge demolition work begins
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


గుంటూరులో శంకర్ విలాస్ వంతెన కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. సుమారుగా 70 ఏళ్ల పాటు ఈ వంతెన మీదుగా నగరవాసులు రాకపోకలు సాగించారు. అయితే నగరం విస్తరించడం. ట్రాఫిక్ రద్దీ కారణంగా పాత వంతెన స్థానంలో నాలుగు వరుసల ఆర్వోబీ నిర్మించనున్నారు. రూ.98 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి కూల్చివేతలు ప్రారంభం కాగా.. స్థానికులు పాత వంతెనతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

70 ఏళ్ల బంధానికి బై బై.. ఎమోషనల్ అవుతున్న జనం.. ఇక చరిత్రలో జ్ఞాపకమే!
70 ఏళ్ల బంధానికి బై బై.. ఎమోషనల్ అవుతున్న జనం.. ఇక చరిత్రలో జ్ఞాపకమే! (ఫోటోలు– Samayam Telugu)
దశాబ్దాల పాటు గుంటూరువాసులకు సేవలు అందించిన శంకర్ విలాస్ పాత బ్రిడ్జి చరిత్రలో కలిసిపోతోంది. శంకర్ విలాస్ పాత వంతెన కూల్చివేత పనులను అధికారులు ప్రారంభించారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ‌ను గుంటూరులో సుమారుగా 70 ఏళ్ల కిందట నిర్మించారు. 1958లో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మించారు. గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలను అనుసంధానిస్తూ ఉంటుందీ ఫ్లైఓవర్. అయితే పెరుగుతున్న వాహనాల రాకపోకలు, గుంటూరు నగరం విస్తరణ కారణంగా శంకర్ విలాస్ వంతెనను కూల్చివేస్తున్నారు. దీని స్థానంలో.. రూ. 98 కోట్లతో కొత్తగా నాలుగు వరుసల ఆర్వోబీని నిర్మించనున్నారు. ఏళ్ల తరబడిగా ఉన్న ఈ డిమాండ్‌ ఇటీవల సాకారమైంది. గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జోక్యంతో ఈ కల సాకరమైంది.

శంకర్ విలాస్ ఫ్లైఓవర్ విషయానికి వస్తే.. 1958లో అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. 50 ఏళ్ల అవసరాలను తీర్చేలా దీనిని నిర్మించారు. అయితే ఈ వంతెన సుమారుగా 67 ఏళ్లపాటు సేవలు అందించింది. దీనిపై నిత్యం 50 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగించేవి. శంకర్ విలాస్ వంతెన నిర్మాణం తర్వాత పశ్చిమం వైపు గుంటూరు భారీగా విస్తరించింది.

అలాగే వంతెనకు రెండు వైపులా ఆర్థికంగా గుంటూరు వృద్ది చెందింది. ఇదే సమయంలో శంకర్ విలాస్ వంతెన శిథిలస్థితికి చేరుకుంది. దీనికి తోడు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ కావటంతో నూతన ఆర్వోబీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 98 కోట్లతో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఇందుకోసం 134 మంది నుంచి స్థలాలు కూడా సేకరించారు. స్థలం విలువకు నాలుగు రెట్లు చేసే టీడీఆర్ బాండ్లు అందించారు.

మరోవైపు శంకర్ విలాస్ ఫ్లైఓవర్‌ను తొలుత ఆరు లేన్లుగా నిర్మించాలని భావించారు. ఆ తర్వాత నాలుగు వరుసల ఆర్వోబీగా ఖరార చేశారు. ఫ్లైఓవర్ ఎత్తు 11.5 మీటర్లు, పొడవు 930 మీటర్లతో దీనిని నిర్మించనున్నారు, మొదట ఆర్వోబీ, ఆ తరువాత రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. రెండేళ్లలోగా ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే శంకర్ విలాస్ పాత వంతెన కూల్చివేత పనులు శనివారం ప్రారంభించారు.

అయితే గుంటూరులో ఒక ఐకానిక్ నిర్మాణంగా ఉన్న శంకర్ విలాస్ వంతెన కూల్చివేతతో, స్థానికులు కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. గుంటూరు నగరాభివృద్ధిలో చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిన శంకర్ విలాస్ వంతెన వద్ద తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి