Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆయుర్వేద రారాజు అశ్వగంధతో సర్వరోగాలకు చెక్‌ పెట్టొచ్చు..! ఆరోగ్య లాభాలు అనంతం..

10 August 2025

Gas Safety Precautions: గ్యాస్ సిలిండర్‌లోని గడువు తేదీ.. ప్రమాదాలు జరగకుండా ఎలా తెలుసుకోవాలి?

10 August 2025

Jagananna house: అమ్మకానికి జగనన్న ఇళ్లు.. ఏకంగా ఓఎల్ఎక్స్‌లో బేరం పెట్టిన లబ్ధిదారుడు!

10 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Araku Coffee,అంతర్జాతీయంగా అరకు కాఫీ ఘుమఘుమలు.. రంగంలోకి దిగిన టాటా గ్రూప్ – tata group mou with ap govt for araku coffee branding and marketing
ఆంధ్రప్రదేశ్

Araku Coffee,అంతర్జాతీయంగా అరకు కాఫీ ఘుమఘుమలు.. రంగంలోకి దిగిన టాటా గ్రూప్ – tata group mou with ap govt for araku coffee branding and marketing

.By .10 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Araku Coffee,అంతర్జాతీయంగా అరకు కాఫీ ఘుమఘుమలు.. రంగంలోకి దిగిన టాటా గ్రూప్ – tata group mou with ap govt for araku coffee branding and marketing
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ప్రపంచ ప్రఖ్యాత అరకు కాఫీకి మరింత ఇమేజ్ తీసుకొచ్చేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కాఫీ ఘుమఘుమలను అంతర్జాతీయ స్థాయిలో ప్రతి ఒక్కరికీ చేరువ చేయడమే కాకుండా.. ఆదివాసీల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కల్పించే దిశగా పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఎంఓయూలు చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో శనివారం ఈ అవగాహన ఒప్పందాలు జరిగాయి. గిరిజన , అటవీ ఉత్పత్తుల విక్రయానికి ఈ అవగాహన ఒప్పందాలు సహకరిస్తాయి.

హైలైట్:

  • అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన అరకు కాఫీ
  • ఏజెన్సీలోని 2.50 లక్షల ఎకరాల్లో సాగు
  • పలు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు
అరకు కాఫీ
అరకు కాఫీ (ఫోటోలు– Samayam Telugu)
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగిలో జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా గిరిజనుల జీవనోపాధి, అటవీ ఉత్పత్తుల అమ్మకం, పర్యాటక రంగాన్ని పెద్దఎత్తు ప్రోత్సహించడం వంటి 21 అంశాల్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలతో కూటమి సర్కారు ఒప్పందాలు ఒప్పందం చేసుకుంది. వీటిలో ముఖ్యమైంది మన్యంలో పండే అరకు కాఫీ మార్కెటింగ్ కూడా ఉంది. రంపచోడవరం ప్రాంతంలో రబ్బరు సాగు ప్రోత్సాహం కోసం కేంద్రీయ రబ్బరు బోర్డు, ఐటీడీఏ మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే, డ్వాక్రా సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల విక్రయాలు, అరకు కాఫీకి ప్రోత్సాహించేలా జీసీసీతో ఒప్పందం కుదిరింది. మెప్మా ద్వారా అరకు కాఫీ కియోస్క్‌ల ఏర్పాటుకు ఓ ఒప్పందం, జీసీసీ ఉత్పత్తులను విదేశాల్లో విక్రయించేందుకు హాతీ సర్వీసెస్‌ ఎల్‌ఎల్‌సీ సంస్థ, జీసీసీ మధ్య ఇంకో ఒప్పందం జరిగింది. అలాగే, దేశవ్యాప్తంగా గిరిజన ఉత్పత్తుల అమ్మకం కోసం సంయుక్తంగా రీటైల్‌ షోరూమ్‌ల ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం ట్రైఫెడ్‌ ఏపీ, జీసీసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అరకు కాఫీ బ్రాండింగ్, మార్కెట్‌ కోసం దిగ్గజ సంస్థ టాటా జీసీసీతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే అరకు కాఫీ ఐక్యరాజ్యసమితి నుంచి ప్రశంసలు అందుకుంది. చింతపల్లి ప్రాంతంలో రెడ్‌చెర్రీ రైఫైనింగ్, ప్రాసెసింగ్‌ యూనిట్‌ నెలకొల్పడానికి సబ్‌కో సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది.

విశాఖ మన్యంలో కాఫీ తోటల విస్తరణకు సంబంధించి ఐటీసీ.. ఐటీడీఏ పాడేరుతో ఒప్పందం చేసుకుంది. గిరిజన మహిళల ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయం కోసం ఫ్రాంటియర్‌ మార్కెటింగ్, ఈజీమార్ట్‌‌లు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నాయి. పసుపు మార్కెటింగ్‌, ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ఎక్విన్‌,ఐటీడీఏ మధ్య ఎంఓయూ కుదిరినట్టు అధికారులు తెలిపారు. గిరిజన మహిళా సంఘాల ద్వారా అటవీ ఉత్పత్తులు అమ్మకానికి అవగాహన కల్పించేందుకు ఐఎస్‌బీ కంపెనీ మరో ఒప్పందం చేసుకుంది.

అరకు కాఫీ

అటవీ ప్రాంతాల్లో హోంస్టేల కోసం ఓయో, హూమీ హట్స్‌ సంస్థలు అంగీకరించాయి. గిరిజన యువతలో నైతిక విలువల పెంపు కోసం మార్పు సొసైటీ, గిరిజన పర్యాటకం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఏపీ టూరిజం ఫోరం ముందుకొచ్చాయి.

అరకు కాఫీని ప్రస్తుతం పాడేరు ఏజెన్సీలో 11 మండలాల్లోని 2.58 లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. దీనిపై ప్రత్యక్షంగా 2.46 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికే అరకు కాఫీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పార్లమెంట్‌లోనూ అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కాఫీని అంతర్జాతీయ విపణికి తీసుకెళ్లేలా ప్రైవేటు సంస్థలతో కలిసి జీసీసీ అవగాహన ఒప్పందం చేసుకుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే గిరిపుత్రుల ఆదాయం మూడు రెట్లు పెరుగుతుంది.

అప్పారావు జివిఎన్

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కథనాలు, రాజకీయాలతో పాటు ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.గతంలో ప్రముఖ మీడియా సంస్థలో ఎడ్యుకేషన్ డెస్క్‌లో పనిచేశారు. ముఖ్యమైన సందర్భాల్లో లైవ్ బ్లాగ్, లైవ్ పేజీల ద్వారా పాఠకులకు నిరంతరాయంగా సమాచారం అందించిన అనుభవం ఆయనకు ఉంది. లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు టర్మ్‌లు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. గతంలో రాశి ఫలాలు, ఆధ్యాత్యిక వార్తలు, పండుగలకు సంబంధించిన ప్రత్యేక కథనాలను ఆయన అందించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జీవీఎన్ అప్పారావు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు.… ఇంకా చదవండి