Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

న్యూ మామ్స్ మీకోసమే ఇది.. వర్క్ టెన్షన్ తగ్గించుకోవాలంటే జస్ట్ ఇలా చేయండి చాలు..! అంతా సెట్ అయిపోద్ది..!

10 August 2025

War 2 Pre Release Event Live : గ్రాండ్‌గా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీగా తరలి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు

10 August 2025

Gender Height Difference: స్త్రీ పురుషుల మధ్య ఎత్తులో తేడాలెందుకు.. కారణాలేంటి?

10 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pulivendula Zptc By Elections,పాతికేళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక.. ఓటుకు రూ.10 వేలు? – pulivendula rural and vontimitta zptc by election high stakes fight between tdp and ysrcp
ఆంధ్రప్రదేశ్

Pulivendula Zptc By Elections,పాతికేళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక.. ఓటుకు రూ.10 వేలు? – pulivendula rural and vontimitta zptc by election high stakes fight between tdp and ysrcp

.By .10 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pulivendula Zptc By Elections,పాతికేళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక.. ఓటుకు రూ.10 వేలు? – pulivendula rural and vontimitta zptc by election high stakes fight between tdp and ysrcp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


వైఎస్ఆర్ కడప జిల్లా.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాకాలో జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ప్రచార పర్వానికి తెరపడనుండటంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అటు, ఎన్నికల వేడి రాజుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. రాజకీయాలు ఊపందుకున్నాయి, ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి!

హైలైట్:

  • కడప జిల్లాలో రెండు జడ్సీటీసీ స్థానాలకు ఉప-ఎన్నికలు
  • చివరిసారిగా పులివెందుల సీటుకు 2001లో ఎన్నిక
  • అధికార టీడీపీపై వైసీపీ నేతలు ఆరోపణలు
టీడీపీ, వైసీపీ
టీడీపీ, వైసీపీ (ఫోటోలు– Samayam Telugu)
వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని పులివెందుల గ్రామీణ, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు అసెంబ్లీని తలపిస్తున్నాయి. అధికార టీడీపీ , వైఎస్ఆర్సీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో హైటెన్షన్ నెలకుంది. ఆగస్టు 12న పోలింగ్ జరగనుండగా.. ఆదివారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది. దీంతో తెరవెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. గడచిన మూడు దశాబ్దాల్లో పులివెందుల జెడ్పీటీసీ సీటుకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. 1995, 2006, 2013, 2021లో ఎన్నిక ఏకగ్రీవమైంది. చివరిగా 2001లో మాత్రమే ఎన్నిక జరగడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికలతో ఏకగ్రీవాలకు తెరపడింది. ఈ స్థానం వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతగడ్డ కావడంతో ఆ పార్టీకి సవాల్‌గా మారింది. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రలోభాలకు తెరలేచింది. ఇరు పార్టీలూ బేరసారాలకు తెరతీసినట్టు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇవ్వడానికి సిద్దమైనట్లు సమాచారం. పులివెందుల, ఒంటిమిట్ట సిట్టింగ్ స్థానాలు గతంలో వైఎస్ఆర్సీసీపీవే. అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ ప్రచారాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. భారీ ఎత్తున భద్రతను ఏర్పాటుచేసి.. నిరంతరం డేగ కళ్లతో నిఘా ఉంచారు.

ముఖ్యంగా పులివెందులలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. పులివెందుల మున్సిపాల్టీలో కలిసిన గ్రామాలు మినహా మిగతా ఐదు ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఉప-ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా లతా రెడ్డి.. వైఎస్ఆర్సీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి బరిలో ఉండగా.. 10,601 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక, ఒంటిమిట్టలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాల పరిధిలోని 24,606 మంది ఓటేయనున్నారు. ఈ ఉప-ఎన్నికలో పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి భద్రతపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారు.

కాగా, అధికార పార్టీకి పోలీసులు, అధికారులు కొమ్ముకాస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలింగ్‌ బూత్‌లను మార్చేశారని, గ్రామాల్లో ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేయలేదని ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఆ పార్టీకి చెందిన నేతలు విజయవాడలో ఆందోళనకు దిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే, డీజీపీ కార్యాలయానికి కూడా వెళ్లి దీనిపై ఫిర్యాదు చేశారు.

అప్పారావు జివిఎన్

రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కథనాలు, రాజకీయాలతో పాటు ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.గతంలో ప్రముఖ మీడియా సంస్థలో ఎడ్యుకేషన్ డెస్క్‌లో పనిచేశారు. ముఖ్యమైన సందర్భాల్లో లైవ్ బ్లాగ్, లైవ్ పేజీల ద్వారా పాఠకులకు నిరంతరాయంగా సమాచారం అందించిన అనుభవం ఆయనకు ఉంది. లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు టర్మ్‌లు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. గతంలో రాశి ఫలాలు, ఆధ్యాత్యిక వార్తలు, పండుగలకు సంబంధించిన ప్రత్యేక కథనాలను ఆయన అందించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జీవీఎన్ అప్పారావు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు.… ఇంకా చదవండి