Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

సొగసు చూడతరమా.. పూల చీరలో అందంగా జాన్వీ!

10 August 2025

Anakapalli 500 kg Shark: అయ్ బాబోయ్ ఎంత పొడవో.. అమ్మ బాబోయ్ ఎంత పెద్దదో!

10 August 2025

కీర్తి అందం చూస్తే ఫిదా అవ్వాల్సిందే..చీరలో ఎంతబాగుందో..

10 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Annadata Sukhibhava Payment Status 2025,పీఎం కిసాన్ సాయం వచ్చి, అన్నదాత సుఖీభవ రాలేదా.. ఈ పని చేస్తే అకౌంట్లోకి డబ్బులు! – ap government give an opportunity to apply for farmers who did not get annadata sukhibhava scheme funds
ఆంధ్రప్రదేశ్

Annadata Sukhibhava Payment Status 2025,పీఎం కిసాన్ సాయం వచ్చి, అన్నదాత సుఖీభవ రాలేదా.. ఈ పని చేస్తే అకౌంట్లోకి డబ్బులు! – ap government give an opportunity to apply for farmers who did not get annadata sukhibhava scheme funds

.By .10 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Annadata Sukhibhava Payment Status 2025,పీఎం కిసాన్ సాయం వచ్చి, అన్నదాత సుఖీభవ రాలేదా.. ఈ పని చేస్తే అకౌంట్లోకి డబ్బులు! – ap government give an opportunity to apply for farmers who did not get annadata sukhibhava scheme funds
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలోని రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రాని వారి కోసం ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదు. అలాంటి రైతులు సంబంధిత పత్రాలతో రైతు సేవా కేంద్రాలను సందర్శించి.. దరఖాస్తు చేసుకుంటే, అధికారులు వాటిని పరిశీలిస్తారు. అర్హత ఉంటే అర్హుల జాబితాలో చేర్చుతారని అధికారులు చెప్తున్నారు. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.

అన్నదాత సుఖీభవ రాలేదా.. ఈ పుని చేస్తే అకౌంట్లోకి డబ్బులు!
అన్నదాత సుఖీభవ రాలేదా.. ఈ పుని చేస్తే అకౌంట్లోకి డబ్బులు! (ఫోటోలు– Samayam Telugu)
రైతన్నలకు అండగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న నంగతి తెలిసిందే. కేంద్రం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన కింద అర్హులైన రైతులకు ఏటా రూ.20 వేలు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా ఆగస్ట్ నాలుగో తేదీ అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. వారణాసిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ యోజన పథకం కింద అర్హులైన రైతులకు రూ.2000 చొప్పున బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. ఇక అదే రోజున ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధులు విడుదల చేశారు. సుమారుగా 46 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.5000 చొప్పున జమ చేశారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేసినప్పటికీ కొంతమంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ కాలేదు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పథకం కింద సాయం అందలేదు. అలాగే కొంతమంది రైతులకు పీఎం కిసాన్ యోజన కింద రూ.2000 పడినప్పటికీ.. అన్నదాత సుఖీభవ పథకం కింద అందించే రూ.5000 సాయం అందలేదు. దీంతో అలాంటి వారంతా ఆందోళన చెందుతున్నారు. తమకు సాయం అందదేమోననే సందేహంలో ఉన్నారు. అయితే సాంకేతిక సమస్యలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రైతులు సకాలంలో ఈకేవైసీ పూర్తి చేయకపోవటం, అలాగే రైతుల బ్యాంక్ ఖాతాలు యాక్టివ్‌గా లేకపోవటం, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పెండింగ్ ఉండటం వీటికి కారణాలుగా తెలుస్తోంది. అయితే ఇలాంటి రైతులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

ఈకేవైసీ పెండింగ్, బ్యాంక్ అకౌంట్ సమస్యలు, భూమికి సంబంధించిన యజమాని మరణం, భూ హక్కుల బదలాయింపులో సమస్యలు, ఆధార్ కార్డుకు భూమికి అనుసంధానం కాకపోవటం వంటి సమస్యలతో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పొందలేని వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పథకానికి తాము అర్హులమేనని నిరూపించే పత్రాలతో రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి. దరఖాస్తుకు ఆ పత్రాలను జతచేసి అధికారులకు సమర్పించాలి. అధికారులు అర్హతా ప్రమాణాలను పరిశీలించి.. అర్హత ఉంటే లబ్ధిదారుల జాబితాలో చేర్చుతారు. ఆ తర్వాత వారి అకౌంట్లలోకి డబ్బులు జమ కానున్నాయి.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి