Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Password: 76 వేల మంది భారతీయులు ఈ ఒక్క పాస్‌వర్డ్‌నే వాడుతున్నారట.. సెకనులోనే హ్యాక్‌ చేయొచ్చట

10 August 2025

విటమిన్ B12 బెనిఫిట్స్.. బ్రెయిన్ నుంచి బోన్స్ వరకు ఎందుకంత ముఖ్యమంటే..?

10 August 2025

Gold Discovery: జాక్‌పాట్‌ లాంటి వార్త.. దేశంలో బయటపడ్డ లక్షల టన్నుల బంగారపు నిధి

10 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ravindranath Reddy Tirumala,వైఎస్ జగన్ మేనమామపై టీటీడీ చర్యలు.! అసలేం జరిగిందంటే? – ysrcp leader ravindranath reddy comments on tirumala
ఆంధ్రప్రదేశ్

Ravindranath Reddy Tirumala,వైఎస్ జగన్ మేనమామపై టీటీడీ చర్యలు.! అసలేం జరిగిందంటే? – ysrcp leader ravindranath reddy comments on tirumala

.By .10 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ravindranath Reddy Tirumala,వైఎస్ జగన్ మేనమామపై టీటీడీ చర్యలు.! అసలేం జరిగిందంటే? – ysrcp leader ravindranath reddy comments on tirumala
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


YSRCP Ex MLA Ravindranath Reddy Political Comments in Tirumala: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ చర్యలకు సిద్దమవుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేశారని టీటీడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను టీటీడీ విజిలెన్స్ విభాగం పరిశీలిస్తోంది.

వైఎస్ జగన్ మేనమామపై టీటీడీ చర్యలు.! అసలేం జరిగిందంటే?
వైఎస్ జగన్ మేనమామపై టీటీడీ చర్యలు.! అసలేం జరిగిందంటే? (ఫోటోలు– Samayam Telugu)
YSRCP Ex MLA Ravindranath Reddy Political Comments in Tirumala : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీద తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రవీంద్రనాథ్ రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల విలేకర్లతో మాట్లాడుతూ రవీంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు. ఆరోపణలు చేయడం నిషిద్ధం. అయితే నిబంధనలు ఉల్లంఘించి రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తోంది. ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలను తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం పరిశీలిస్తోంది. టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఉల్లంఘించినందుకు రవీంద్రనాథ్ రెడ్డి మీద చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం.

రవీంద్రనాథ్ రెడ్డి ఏమన్నారంటే?

ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని రవీంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చారు. వైఎస్ జగన్ వెంట ఉన్నామని ఈ ఎన్నికల ద్వారా చెప్పడానికి పులివెందుల ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి అరాచకాలకు పాల్పడుతోందని.. వైసీపీ కార్యకర్తలను, పులివెందుల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో పంటలు పండటం లేదని ఆరోపించారు.సూపర్ సిక్స్ పేరుతో దొంగ హామీలు ఇచ్చారని.. వాటిలో ఏ ఒక్కటీ కూడా అమలు చేయడం లేదని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. 2029లో వైఎస్ జగన్ మరోసారి సీఎం కావాలని జనం కోరుకుంటున్నారన్న రవీంద్రనాథ్ రెడ్డి.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ద్వారా జగన్ వెంటే పులివెందుల జనం ఉన్నారనే సంగతి తెలుస్తుందన్నారు.

ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లి ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నారని.. ఓటింగ్ శాతం తగ్గించేందుకు దారుణాలకు పాల్పడుతున్నారని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ ఎక్కడా జరగలేదంటూ రవీంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తలుచుకుని ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నామినేషన్ కూడా వేసేవారు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి