Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Coolie: రజనీయా మజాకా.. రీల్ చేసిన సింగపూర్ పోలీస్‌

10 August 2025

Tollywood: ధనుష్ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..

10 August 2025

Raksha Ka Bandhan: డ్రైవర్లు కేవలం వాహనాలను నడిపేవారు కాదు.. మాటలేమీ చెప్పని మౌన సహోదరులు

10 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Telangana Ministers Janasena Office,తెలుగు రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. జనసేన కేంద్ర కార్యాలయానికి తెలంగాణ మంత్రులు.. ఎందుకెళ్లారంటే? – telangana ministers mallu bhatti vikramarka uttam kumar reddy komatireddy and ponguleti at janasena office mangalagiri
ఆంధ్రప్రదేశ్

Telangana Ministers Janasena Office,తెలుగు రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. జనసేన కేంద్ర కార్యాలయానికి తెలంగాణ మంత్రులు.. ఎందుకెళ్లారంటే? – telangana ministers mallu bhatti vikramarka uttam kumar reddy komatireddy and ponguleti at janasena office mangalagiri

.By .10 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telangana Ministers Janasena Office,తెలుగు రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. జనసేన కేంద్ర కార్యాలయానికి తెలంగాణ మంత్రులు.. ఎందుకెళ్లారంటే? – telangana ministers mallu bhatti vikramarka uttam kumar reddy komatireddy and ponguleti at janasena office mangalagiri
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Telangana Ministers at Janasena Central Office Mangalagiri:తెలుగు రాజకీయాల్లో ఆదివారం ఇంట్రస్టింగ్ ఘటన చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఐదుగురు మంత్రులు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో దిగారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి జనసేన కేంద్ర కార్యాలయం వద్ద కనిపించడం ఆసక్తి రేకెత్తించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగు రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. జనసేన కేంద్ర కార్యాలయానికి తెలంగాణ మంత్రులు.. ఎందుకెళ్లారంటే?
తెలుగు రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. జనసేన కేంద్ర కార్యాలయానికి తెలంగాణ మంత్రులు.. ఎందుకెళ్లారంటే? (ఫోటోలు– Samayam Telugu)
Telangana Ministers at Janasena Office: తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్దకు తెలంగాణ మంత్రులు వెళ్లారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి జనసేన కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్లారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరుఫున ఏపీ ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ వీరికి స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. కొండపల్లి బొమ్మలతో కూడిన జ్ఞాపికలను బహూకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. సముద్రంలో కలిసే గోదావరి వరద జలాలను వాడుకుని రాయలసీమను సస్యశ్యామలం చేస్తామంటూ పోలవరం బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. సుమారుగా 80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు రూపకల్పనకు శ్రీకారం చుట్టుంది. అయితే బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రం నీటి హక్కులకు భంగం కలుగుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టు మీద అభ్యంతరం తెలిపారు. కేంద్ర జలసంఘం వద్ద కూడా దీనిపై తమ అభ్యంతరాలను తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలతో బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేకులు పడ్డాయి.

ఇలా రెండు రాష్ట్రాల మధ్యన రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో తెలంగాణ మంత్రులు ఐదుగురు.. జనసేన కేంద్ర కార్యాలయంలో దిగటం ప్రాధాన్యం సంతరించుకుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరి జనసేన ఆఫీసు ప్రాంగణంలో కనిపించడం ఆసక్తి రేకెత్తించింది.

అయితే వీరంతా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం హెలిప్యాడ్ వాడుకున్నట్లు తెలిసింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులంతా హెలికాప్టర్‌లో వెళ్లగా.. వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా పిడుగు హరిప్రసాద్ జనసేన నేతలతో కలిసి తెలంగాణ మంత్రులకు స్వాగతం పలికారు. వారితో కలిసి ఫోటోలు దిగారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి