Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మహిళలకు శుభవార్త.. ప్రతి ఒక్కరికి రూ.10 వేలు..

4 September 2025

లగ్జరీ కార్ల ప్రియుడు.. రోహిత్‌కు ధీటుగా సంపాదన.. అమిత్ మిశ్రా నెట్‌వర్త్ తెలిస్తే షాకే..

4 September 2025

Bigg Boss Telugu 9: 100కు పైగా సినిమాలు.. సడెన్ గా ఇండస్ట్రీకి దూరం.. ఇప్పుడు బిగ్ బాస్‌లోకి స్టార్ కమెడియన్

4 September 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Janasena Suspends Karri Mahesh Machilipatnam,వివాదంలో మరో నేత.. సస్పెండ్ చేసిన జనసేన పార్టీ.. – janasena party suspends karri mahesh over attack on homeguard allegations in machilipatnam
ఆంధ్రప్రదేశ్

Janasena Suspends Karri Mahesh Machilipatnam,వివాదంలో మరో నేత.. సస్పెండ్ చేసిన జనసేన పార్టీ.. – janasena party suspends karri mahesh over attack on homeguard allegations in machilipatnam

.By .26 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Janasena Suspends Karri Mahesh Machilipatnam,వివాదంలో మరో నేత.. సస్పెండ్ చేసిన జనసేన పార్టీ.. – janasena party suspends karri mahesh over attack on homeguard allegations in machilipatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


జనసేన పార్టీకి చెందిన మరో నేత వివాదంలో చిక్కుకున్నారు. హోంగార్డుపై దాడి చేశారనే ఆరోపణలు రావటంతో జనసేన అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన కర్రి మహేష్ అనే వ్యక్తి.. హోంగార్డు మీద దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో పోలీసులు కర్రి మహేష్ మీద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కర్రి మహేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

janasena
వివాదంలో మరో నేత.. సస్పెండ్ చేసిన జనసేన పార్టీ..(ఫోటోలు– Samayam Telugu)
జనసేన పార్టీ నేతలు ఇటీవలి కాలంలో తరుచూ వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. శ్రీశైలంలో ఫారెస్ట్ సిబ్బందిపై జరిగిన దాడి కేసులో.. జనసేన నేతను పోలీసులు ఏ1గా చేర్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు శ్రీకాళహస్తి జనసేన నేత కోట వినుత కేసు గురించి తెలిసిన విషయమే. డ్రైవర్ హత్య కేసులో కోట వినుతను పోలీసులు అరెస్ట్ చేస్తే.. ఇటీవలే బెయిల్ మీద బయటకు వచ్చారు. తాజాగా మరోచోట జనసేన నేత అత్యుత్సాహం.. ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. డ్యూటీలో ఉన్న ఓ హోంగార్డుపై జనసేన నేత దాడి చేశారు. ఈ ఘటనలో హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభింంచారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఘటన మచిలీపట్నంలో చోటుచేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మోహన్ రావు అనే వ్యక్తి మచిలీ పట్నం పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నారు. అయితే గత ఆదివారం రోజు రాత్రి మోహనరావు మరో కానిస్టేబుల్‌తో కలిసి నైట్ బీట్ నిర్వహించారు. రాత్రి వేళ గస్తీలో భాగంగా ఇద్దరూ కలిసి బందరువిశ్వబ్రాహ్మణుల కాలనీకి వెళ్లారు. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో అదే ప్రాంతంలో ఉంటున్న కర్రి మహేష్‌ అనే జనసేన నేత అక్కడకు వచ్చి హోంగార్డుతో గొడవకు దిగారు. హోంగార్డు మోహనరావును దుర్భాషలాడుతూ అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలో మోహనరావుకు తీవ్ర గాయాలు కాగా.. పక్కనున్న కానిస్టేబుల్‌ వెంటనే అతన్ని మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో బాధితుడు మోహనరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కర్రి మహేష్ మీద121(1), 351(2) బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు పెట్టారు.

మరోవైపు హోంగార్డుపై దాడి చేశారంటూ కర్రి మహేష్‌పై ఆరోపణలు రావటంతో జనసేన పార్టీ అధిష్టానం స్పందించింది. పార్టీ క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించారంటూ కర్రి మహేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో కర్రి మహేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ వెల్లడించారు. కర్రి మహేష్‌ జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని రద్దు చేశామని.. జనసేన పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరంగా ఉంచుతామని సోమవారం వెల్లడించారు.ఈ ఘటనలో పోలీసుల విచారణ తర్వాత.. ఆ వివరాలను అధిష్టానానికి నివేదిస్తామని.. ఆ తర్వాత అధిష్టానం నిర్ణయం ఆధారంగా కర్రి మహేష్ సభ్యత్వంపై పునరాలోచన చేస్తామని బండి రామకృష్ణ తెలిపారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి