హయత్నగర్ పిఎస్ పరిధిలోని పెదఅంబర్పేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో వరుసగా రెండు ఇళ్ళల్లో చోరీలకు పాల్పడ్డారు. అత్యంత భద్రత కలిగిన ఈ గేటెడ్ కమ్యూనిటీలో దొంగలు సెంట్రల్ లాక్ ఉన్న డోర్లను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దొంగలు సుమారు 5 కేజీల వెండి సామాగ్రి, 35 గ్రాముల బంగారం, 60 వేల నగదుతో పాటు విలువైన చీరలను అపహరించినట్లు తెలుస్తోంది. చోరీ దృశ్యాలు కమ్యూనిటీలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bihar Politics: బిహార్ ఎన్నికల ప్రచార రంగంలోకి ప్రధాని మోదీ
ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా
ఒంగోలు పేస్ కాలేజీ సమీపంలో రోడ్డుప్రమాదం
Karur Stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు బీజేపీ ఆగ్రహం
రుషికొండపై ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం