రష్యా, ఉక్రెయిన్ కొట్టుకుంటే.. ఇండియాకు చవకగా ఆయిల్ దొరికినట్లు.. ఇద్దరు వ్యాపారస్తుల మధ్య పోటీ.. ఓ ఊరిలో జనానికి పండగ తెచ్చింది. ఇద్దరు చికెన్ షాపు యజమానులు జనాలను ఆకర్షించేందుకు పోటీపడటంతో కర్నూలు జిల్లా కోడుమూరులో కిలో చికెన్ రూ.100కు చేరింది. దీంతో కోడుమూరుతో పాటుగా ఆ పక్కనే ఉన్న ఊరి జనాలు కూడా పెద్దసంఖ్యలో కోడుమూరు చేరుకున్నారు. ఈ చికెన్ షాపుల వద్ద చికెన్ కొనుగోలు చేసి ఆదివారం రోజున నాన్ వెజ్ పండుగ చేసుకున్నారు.

*ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.1500 కోట్లతో డేటా సెంటర్..
చికెన్ కిలో రూ.100లకే.. అసలు కారణం అదే..
ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర దాదాపుగా రూ.200 వరకూ ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరలో పది రూపాయలు కాస్త అటో ఇటో ఉండొచ్చు. ఇక స్కిన్ లెస్ రేటు అయితే మరో రూ.20 ఎక్కువ ఉండొచ్చు. కానీ కోడుమూరులో మాత్రం ఆదివారం.. కిలో చికెన్ రూ.100లకే దొరికింది. అదేంటీ కోళ్లకు వ్యాధులు, రోగాలు గట్రా సోకయా.. అని డౌటానుమానాలు పెట్టుకోవాల్సిన పనిలేదు. నాణ్యమైన, ఆరోగ్యకరమైన చికెన్.. సరసమైన ధరకే లభ్యమైంది. అయితే ఇందుకు కారణం మాత్రం వేరే ఉంది. ఇద్దరు వ్యాపారస్థుల మధ్య పోటీ కారణంగానే కేజీ చికెన్ వందకు చేరుకుంది.
*నకిలీ మద్యం బాటిళ్లను ఈజీగా కనిపెట్టొచ్చు.. అందుబాటులోకి ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్.. ఎలా పనిచేస్తుందంటే?

కోడుమూరులోని బళ్లారి రోడ్డులో ఈ మధ్యనే ఓ వ్యక్తి చికెన్ షాపు తెరిచాడు. కర్నూలుకు చెందిన ఆ వ్యక్తి కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాడు. దీంతో జనాలను తన చికెన్ షాపు వద్దకు ఆకర్షించేందుకు.. తన వ్యాపారం వృద్ధి చేసుకునేందుకు ఆఫర్ పెట్టాడు. మార్కెట్ ధర కంటే తక్కువకే చికెన్ అమ్మకాలు మొదలుపెట్టాడు. కేజీ చికెన్ రూ.110లు చొప్పున విక్రయిస్తూ వచ్చాడు. దీంతో ఆదివారం రోజున జనం ఆ చికెన్ షాపు వద్దకు క్యూ కట్టారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన పక్కనే ఉన్న మరో చికెన్ షాపు ఓనర్.. తాను కూడా రేటు తగ్గించి చికెన్ విక్రయించడం మొదలుపెట్టాడు. కర్నూలు వ్యాపారి కిలో చికెన్ రూ.110లకు విక్రయిస్తే.. ఇతను మరో పది రూపాయలు తగ్గించి రూ.100కే కిలో చికెన్ అంటూ షాపు ముందు బోర్డు పెట్టాడు. దీంతో ఆ చికెన్ షాపు ముందు కోడుమూరు ప్రజలు బారులు తీరారు.
కిలో చికెన్ రూ.150 అని కక్కుర్తిపడితే.. అమ్మబాబోయ్ అంతే సంగతులు!
*ఏపీకి భారీ గుడ్ న్యూస్.. అక్టోబర్ 14న ఢిల్లీలో ప్రకటన..
ఇక కిలో చికెన్ రూ.100కే దొరుకుతోందనే విషయం తెలిసీ.. కోడుమూరు ప్రజలతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్దసంఖ్యలో బళ్లారి రోడ్డులోని చికెన్ షాపుల వద్దకు చేరుకున్నారు. షాపుల వద్ద చికెన్ కొనుగోలు చేసి ఇలా ఆదివారం నాన్ వెజ్ పండుగ చేసుకున్నారు.