Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Ap High Court Serious On Police,తిరుమల పరకామణి రికార్డ్స్ ఎందుకు సీజ్ చేయలేదు.. నిద్రపోతున్నారా, ఏపీ హైకోర్టు సీరియస్ – andhra pradesh high court serious comments on police over tirumala parakamani case

14 October 2025

మార్కెట్లో పెరిగిపోయిన నకిలీ నోట్లు..! ఫేక్‌ రూ.500, రూ.100 కరెన్సీ నోట్లని ఇలా గుర్తించి.. జాగ్రత్త పడండి!

14 October 2025

Visakhapatnam Vande Bharat Express Trains Depot,ఏపీలో కొత్తగా వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో.. రూ.300 కోట్లతో, ఆ ప్రాంతానికి మహర్దశ! – vande bharat express trains maintenance depot likely proposed in visakhapatnam

14 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tcs Vizag Opening Date,ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చనున్న నవంబర్ నెల.. ఏం జరగనుంది? – tcs campus to start operations in visakhapatnam in november and cognizant ceo to visit same month
ఆంధ్రప్రదేశ్

Tcs Vizag Opening Date,ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చనున్న నవంబర్ నెల.. ఏం జరగనుంది? – tcs campus to start operations in visakhapatnam in november and cognizant ceo to visit same month

.By .13 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tcs Vizag Opening Date,ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చనున్న నవంబర్ నెల.. ఏం జరగనుంది? – tcs campus to start operations in visakhapatnam in november and cognizant ceo to visit same month
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


TCS visakhapatnam operations announcement: నవంబర్ నెల.. ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చేలా నవంబర్ నెలలో అడుగులు పడనున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అన్నింటికంటే ముందుగా టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. నవంబర్ నెలలో విశాఖ వేదికగా టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అలాగే కాగ్నిజెంట్ కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. నవంబర్ నెలలో కాగ్నిజెంట్ సీఈవో విశాఖలో పర్యటించనున్నారు.

AP
ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చనున్న నవంబర్ నెల.. ఏం జరగనుంది?(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో నవంబర్ నెల కీలకంగా మారనుంది. నవ్యా్ంధ్రకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో దిగ్జజ సంస్థల చూపు ఏపీ వైపు మళ్లుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అందులో కొన్ని ప్రాజెక్టులు వేగంగా అడుగులు పడుతున్నాయి కూడా. అయితే నవంబర్ నెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దశ, దిశను మార్చేలా కనిపిస్తోంది. రెండు కీలక ప్రాజెక్టులకు నవంబర్ నెలలో శ్రీకారం చుట్టనున్నారు. విశాఖపట్నంలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అన్నింటికంటే ముుందుగా ఆసక్తి చూపించింది టీసీఎస్.. ఆ తర్వాతనే ఒక్కొక్క కంపెనీ ఏపీవైపు, అందులోనూ విశాఖవైపు దృష్టి సారిస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే నవంబర్ నెలలో టీసీఎస్ తన కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

తొలి అడుగు టీసీఎస్‌దే.. నవంబర్ నుంచి పనులు..

విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో తొలుత ఒప్పందం చేసుకున్నది కూడా టీసీఎస్ కావటం విశేషం. ఇక టీసీఎస్ కోసం రుషికొండ సమీపంలోని ఐటీహిల్స్‌పై భవనాన్ని కూడా ఏపీ ప్రభుత్వం కేటాయించింది. హిల్‌-3లోని మిలీనియం టవర్స్‌ లీజు ప్రాతిపదికన కేటాయించింది. ఈ భవనంలో ఉద్యోగులు పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయి. నవంబర్ నెలలో విశాఖ వేదికగా టీసీఎస్ కార్యకలాపాలు మొదలుపెట్టనుంది. ఈ విషయాన్ని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా తెలిపారు. టీసీఎస్ క్యాంపస్‌లో తొలిదశలో 2 షిఫ్టులలో 2000 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఆ తర్వాత ఉద్యోగుల సంఖ్యను క్రమంగా ఆరు వేలకు పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు తగ్గట్లుగా మిలీనయం టవర్స్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ భవనం నుంచి తాత్కాళికంగా కార్యకలాపాలు సాగిస్తూనే.. టీసీఎస్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. రూ.1,370 కోట్లతో 12000 మందికి ఉపాధి కల్పించనుంది. టీసీఎస్ క్యాంపస్ కోసం ఏపీ ప్రభుత్వం ఐటీహిల్‌-3పై 22 ఎకరాలను కేటాయించింది. ఎకరా 99 పైసలకు చొప్పున కేటాయింపులు చేశారు.

టీసీఎస్ బాటలో కాగ్నిజెంట్..

మరోవైపు టీసీఎస్ బాటలోనే మరో ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టనుంది. రూ.1,582 కోట్లతో విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. కాగ్నిజెంట్ క్యాంపస్ ద్వారా సుమారుగా 8000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్ సంస్థకు కూడా ఎకరా భూమి 99 పైసలకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాపులుప్పాడ వద్ద 21.31 ఎకరాల భూమి కేటాయించింది. మరోవైపు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈవో రవి కుమార్ వచ్చే నవంబర్‌లోనే విశాఖపట్నం పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే ఆయన విశాఖ కాగ్నిజెంట్ క్యాంపస్ ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇవి కాకుండా గూగుల్ డేటా సెంటర్.. రూ.లక్ష కోట్లతో టీసీఎస్ డేటా సెంటర్‌ ఏర్పాటు కానున్నాయి.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి