Andhra Pradesh Cotton Procurement Starts October 21st: ఆంధ్రప్రదేశ్లో పత్తి రైతులకు శుభవార్త. ఈనెల 21 నుంచి సీసీఐ రాష్ట్రవ్యాప్తంగా 30 కేంద్రాల్లో పత్తి కొనుగోలు ప్రారంభించనుంది. రైతులు కపాస్ కిసాన్, సీఎం యాప్ల ద్వారా స్లాట్ బుక్ చేసుకుని సులభంగా అమ్మకాలు జరపవచ్చు. జిన్నింగ్ మిల్లులకు దూది బేల్కు రూ.1440 చెల్లించనుంది. ఈ ఏడాది పత్తికి మద్దతు ధర క్వింటా రూ.8,110 ప్రకటించారు. అంతేకాదు అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
హైలైట్:
- ఏపీలో పత్తి రైతులకు అలర్ట్
- ఈ నెల 21 నుంచి కొనుగోళ్లు
- ఏపీలో 30 కేంద్రాలు ఏర్పాటు

ఈ సీజన్లో పత్తి జిన్నింగ్ మిల్లులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) చెల్లించే ధరలను ఖరారు చేశారు. దూది బేల్కు రూ. 1440 చెల్లించడానికి CCI అంగీకరించింది. జిన్నింగ్ మిల్లుల యజమానులు కూడా దీనికి ఒప్పుకున్నారు. అయితే రాష్ట్రంలో CCI ప్రకటించిన ధరలు రైతులకు గిట్టుబాటు కాకపోయినా సరే. రైతుల కోసమే తాము ఈ ధరలకు అంగీకరించామని జిన్నింగ్ మిల్లుల యజమానులు తెలిపారు. గత ఏడాది క్వింటా పత్తికి రూ.7,521 మద్దతు ధర ప్రకటించిన కేంద్రం, ఈసారి రూ.8,110కు పెంచింది. అంతేకాదు పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 మధ్య మాత్రమే ఉండాలని సీసీఐ నిబంధన విధించింది. అంతేకాదు ఈ ఏడాది నుంచి కిసాన్ యాప్ ద్వారా అన్ని రాష్ట్రాల్లో పత్తి కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తామని సీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.
‘నాలాగే’.. పెమ్మసానిపై చంద్రబాబు ప్రశంసలు
అయితే, రైతులను మోసం చేసి తక్కువ ధరకు, తక్కువ తూకంతో కొనుగోలు చేసే వ్యాపారులు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మార్కెట్ కమిటీల అనుమతి లేకుండా రైతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసినా ఉపేక్షించబోమన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నామని, రైతులు తమ పంట వివరాలను గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించారు. వ్యాపారులు, దళారులు సెస్సు ఆదాయానికి గండి కొట్టి, అక్రమంగా పంట ఉత్పత్తులను బయటి ప్రాంతాలకు తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.