Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Women’s World Cup : మహిళల ప్రపంచ కప్‌లో బురఖా వేసుకుని ఆడుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు?.. వైరల్ అవుతున్న ఫోటో నిజమా? ఫేకా ?

14 October 2025

Vizag Google: విశాఖలో దేశంలోనే తొలి గూగుల్ ఎఐ హబ్.. అందరి చూపు వైజాగ్ వైపే

14 October 2025

Watch: చుక్క పడ్డాకే అసలు సీన్ మొదలైంది.. కాళికా బార్‌లో సినిమా ఫైటింగ్ రియల్ సీన్.. వీడియో

14 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Farmers Cotton Procurement October 21st,ఏపీలో రైతులు రెడీగా ఉండండి.. ఈ నెల 21 నుంచి ప్రారంభం, రూ.8,110 ఇస్తారు – andhra pradesh cottorn procurement likely start from october 21st 2025
ఆంధ్రప్రదేశ్

Ap Farmers Cotton Procurement October 21st,ఏపీలో రైతులు రెడీగా ఉండండి.. ఈ నెల 21 నుంచి ప్రారంభం, రూ.8,110 ఇస్తారు – andhra pradesh cottorn procurement likely start from october 21st 2025

.By .14 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Farmers Cotton Procurement October 21st,ఏపీలో రైతులు రెడీగా ఉండండి.. ఈ నెల 21 నుంచి ప్రారంభం, రూ.8,110 ఇస్తారు – andhra pradesh cottorn procurement likely start from october 21st 2025
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Cotton Procurement Starts October 21st: ఆంధ్రప్రదేశ్‌లో పత్తి రైతులకు శుభవార్త. ఈనెల 21 నుంచి సీసీఐ రాష్ట్రవ్యాప్తంగా 30 కేంద్రాల్లో పత్తి కొనుగోలు ప్రారంభించనుంది. రైతులు కపాస్‌ కిసాన్‌, సీఎం యాప్‌ల ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకుని సులభంగా అమ్మకాలు జరపవచ్చు. జిన్నింగ్‌ మిల్లులకు దూది బేల్‌కు రూ.1440 చెల్లించనుంది. ఈ ఏడాది పత్తికి మద్దతు ధర క్వింటా రూ.8,110 ప్రకటించారు. అంతేకాదు అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

హైలైట్:

  • ఏపీలో పత్తి రైతులకు అలర్ట్
  • ఈ నెల 21 నుంచి కొనుగోళ్లు
  • ఏపీలో 30 కేంద్రాలు ఏర్పాటు
AP Cotton Procurement
ఏపీలో అక్టోబర్ 21 నుంచి పత్తి కొనుగోళ్లు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో పత్తి రైతులకు ముఖ్యమైన గమనిక. ఈనెల 21వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) పత్తి కొనుగోలును ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 30 కేంద్రాలలో ఈ కొనుగోళ్లు జరుగుతాయి. గతంలో మాదిరిగానే జిన్నింగ్‌ మిల్లుల ద్వారానే సీసీఐ పత్తిని సేకరిస్తుంది. ఈ మిల్లుల ఎంపిక ప్రక్రియ టెండర్ల ద్వారా జరుగుతుంది.. ఈ టెండర్లు ఈనెల 10న ముగిశాయి. సీసీఐ బృందం మిల్లులను పరిశీలించి, వాటిలోని సౌకర్యాలను చూశాక ఎంపిక ఖరారు చేస్తుంది. కొనుగోలు కేంద్రాల వివరాలను ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ఏడాది రైతుల నుంచి పత్తి కొనుగోలు కోసం సీసీఐ రెండు యాప్‌లను ఉపయోగిస్తుంది. రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి కపాస్‌ కిసాన్‌ యాప్‌ను, అమ్మకం ప్రక్రియ కోసం ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన సీఎం యాప్‌ను వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ రెండు యాప్‌లను వాడటం ద్వారా రైతులు తమ పత్తిని సులభంగా, వేగంగా అమ్ముకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందని అధికారులు తెలిపారు.

ఈ సీజన్‌లో పత్తి జిన్నింగ్ మిల్లులకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) చెల్లించే ధరలను ఖరారు చేశారు. దూది బేల్‌కు రూ. 1440 చెల్లించడానికి CCI అంగీకరించింది. జిన్నింగ్ మిల్లుల యజమానులు కూడా దీనికి ఒప్పుకున్నారు. అయితే రాష్ట్రంలో CCI ప్రకటించిన ధరలు రైతులకు గిట్టుబాటు కాకపోయినా సరే. రైతుల కోసమే తాము ఈ ధరలకు అంగీకరించామని జిన్నింగ్ మిల్లుల యజమానులు తెలిపారు. గత ఏడాది క్వింటా పత్తికి రూ.7,521 మద్దతు ధర ప్రకటించిన కేంద్రం, ఈసారి రూ.8,110కు పెంచింది. అంతేకాదు పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 మధ్య మాత్రమే ఉండాలని సీసీఐ నిబంధన విధించింది. అంతేకాదు ఈ ఏడాది నుంచి కిసాన్‌ యాప్‌ ద్వారా అన్ని రాష్ట్రాల్లో పత్తి కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తామని సీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘నాలాగే’.. పెమ్మసానిపై చంద్రబాబు ప్రశంసలు

అయితే, రైతులను మోసం చేసి తక్కువ ధరకు, తక్కువ తూకంతో కొనుగోలు చేసే వ్యాపారులు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మార్కెట్ కమిటీల అనుమతి లేకుండా రైతుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసినా ఉపేక్షించబోమన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తున్నామని, రైతులు తమ పంట వివరాలను గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో ముందుగానే నమోదు చేసుకోవాలని సూచించారు. వ్యాపారులు, దళారులు సెస్సు ఆదాయానికి గండి కొట్టి, అక్రమంగా పంట ఉత్పత్తులను బయటి ప్రాంతాలకు తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి