Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

సూర్యాపేట ఇన్‌చార్జ్‌ కోసం కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు.. గాంధీభవన్‌కు తాకిన అలజడి

14 October 2025

పులుల మృత్యుఘోష.. యమపాశంగా మారిన రైల్వే లైన్.. ఎన్ని చనిపోయాయంటే?

14 October 2025

Dhanteras 2025: ధన్ తేరాస్ నాడు ఏ రాశి వారు ఏం కొనాలో తెలుసా? మీకేం కావాలో చూసుకోండి..!

14 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chittoor Smoke Free Village With Solar,ఆ ఊరిలో గొడుగు సాయంతో వంటలు చేస్తున్నారు.. గ్యాస్ ఆదా, ఐడియా భలే ఉంది – poeple cooking with sunlight in a village near madanapalle andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Chittoor Smoke Free Village With Solar,ఆ ఊరిలో గొడుగు సాయంతో వంటలు చేస్తున్నారు.. గ్యాస్ ఆదా, ఐడియా భలే ఉంది – poeple cooking with sunlight in a village near madanapalle andhra pradesh

.By .14 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chittoor Smoke Free Village With Solar,ఆ ఊరిలో గొడుగు సాయంతో వంటలు చేస్తున్నారు.. గ్యాస్ ఆదా, ఐడియా భలే ఉంది – poeple cooking with sunlight in a village near madanapalle andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Bysanivaripalle Smoke Free Village With Solar: అన్నమయ్య జిల్లా బైసానివారిపల్లెలో వినూత్న ప్రయోగం. నెడ్‌క్యాప్ ఆధ్వర్యంలో, గ్యాస్, కట్టెల పొయ్యి లేకుండా కేవలం సూర్యరశ్మితో వంటలు చేస్తున్నారు. ప్రత్యేక గొడుగుల వంటి సెటప్‌తో 35 కుటుంబాలు పొగలేని వంటలు చేసుకుంటూ కాలుష్య రహిత గ్రామానికి బాటలు వేస్తున్నాయి. పిండి వంటలు, చిరుధాన్యాలు, ఉలవలు వంటివి సుమారు 25 నిమిషాల్లో ఉడుకుతున్నాయి. ఈ ఆలోచిన బావుంది అంటూ ప్రశంసలు కూడా వస్తున్నాయి.

హైలైట్:

  • ఏపీలోని ఆ ఊరిలో సూర్యరశ్మి ద్వారా వంటలు
  • ఊరిలోని ఇళ్లపై గొడుగులు ఏర్పాటు చేసి నెడ్‌క్యాప్
  • ఆ గొడుగుపై వంట పాత్ర కోసం ఇనుప చువ్వలు
  • సూర్యరశ్మి సాయంతో 25 నిమిషాల్లోనే వంట పూర్తి
Bysanivaripalle Smoke Free
ఏపీలోని ఊరిలో సూర్యరశ్మి వంటలు(ఫోటోలు– Samayam Telugu)
మనం సాధారణంగా ఇంట్లో వంట చేయాలంటే.. గ్యాస్, ఎలక్ట్రిక్ స్టవ్, కట్టెల పొయ్యి, బొగ్గుల కుంపటో కావాలి. కానీ ఆ ఊరిలో మాత్రం జస్ట్ అలా ఎండలో పాత్రలు పెట్టి వంటలు చేస్తున్నారు. సూర్యరశ్మి ఉంటే చాలు చక్కగా వంట చేస్తామంటున్నారు. కొంతకాలంగా ఆ ఊరిలో వారంతా ఇలాగే సూర్యరశ్మితో వంటలు చేసుకుంటున్నారట. ఈ విధానం ఏదో బావుంది అని ప్రశంసలు కూడా వస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని కురబలకోట మండలం బైసానివారిపల్లెలో వీరంతా ఇలా సూర్యరశ్మి సాయంతో సరికొత్త ప్రయోగం చేస్తున్నారు.నెడ్‌క్యాప్‌ ఆధ్వర్యంలో కాలుష్య రహిత వాతావరణం దిశగా.. ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్యాస్, ఎలక్ట్రిక్ స్టవ్, బొగ్గుల కుంపటి, కట్టెల పొయ్యి వినియోగించకుండా కేవలం సూర్యరశ్మి ద్వారా వంటలు చేసుకునేలా ఆ ఊరి గ్రామ ప్రజల్ని ప్రోత్సహించింది. ఈ మేరకు అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం బైసానివారిపల్లె ను నెడ్‌క్యాప్ ఎంపిక చేసుకుంది. ఈ ప్రాజెక్టును ఆ ఊరిలో అమలు చేసింది. ఈ విధానం ద్వారా పొగ లేని ఊరుగా కూడా బైసానివారిపల్లె గుర్తింపు పొందింది.

బైసానివారిపల్లెలోని దాదాపు 35 కుటుంబాలకు ఇలా నెడ్‌క్యాప్ సూర్యరశ్మి ద్వారా వంట చేసుకునేందుకు ఒక సెటప్ ఏర్పాటు చేసింది. ఆ కుటుంబాలకు గొడుగుల్ని అధికారులు అందజేశారు.. ఇంటిపైన ఏర్పాటు చేసిన ఈ గొడుగు మధ్యలో వంట పాత్రలు ఉంచడానికి వీలుగా ఇనుప చువ్వలతో ఒక సెటప్ ఉంటుంది. పై నుంచి ఎండ వచ్చినప్పుడు గొడుగును సూర్యునికి ఎదురుగా ఉంచి వంటపాత్రను ఇనుప చువ్వలపై పెడతారు.. అప్పుడు పాత్రలోపల ఉండేవి ఉడుకుంది.

AIతో వంటకాలు.. చిల్లీ పన్నీర్ టేస్ట్ చేసిన సీఎం చంద్రబాబు

ఇలా వంట చేయడానికి దాదాపు 25 నిమిషాల సమయం పడుతుంది అంటున్నారు. స్థానికులు పిండి, చిరుధాన్యాలతో చేసే వంటలు ఎక్కువగా చేసుకుంటున్నారు. అంతేకాదు ఉలవలు, వేరుసెనగ కాయలు వంటివి ఉడికిస్తున్నారు. గ్రామంలో ఇలా ఈ గొడుగు వంటి సెటప్ ద్వారా ఈ పొయ్యి పైనే గ్రామస్థులు వంట చేసుకుంటున్నారు. చాలామంది ఈ విధానం ఏదో బావుంది అంటున్నారు.. ఇలా సూర్యరశ్మి ద్వారా వంట చేయడానికి కాస్త సమయం అయితే పడుతుందని చెబుతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి