Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు.. స్ట్రోక్ వచ్చే ముందు శరీరంలో కనిపించే భయానక సంకేతాలివే..

14 October 2025

Tollywood: స్కూల్‏ డ్రెస్‏లో క్యూట్‎గా కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? తెలుగులో క్రేజీ హీరోయిన్..

14 October 2025

IND vs WI: ఒకటి, రెండు కాదు భయ్యో.. ఏకంగా 10 సార్లు.. ఇండియా-వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో 5 భారీ రికార్డులు..

14 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Visakhapatnam It Company Land Allocated,ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ.. మరో ఐటీ కంపెనీ వస్తోంది, ఎకరా రూ.2 కోట్ల చొప్పున భూమి – andhra pradesh government allocated land for it company imaginovate technologies in visakhapatnam
ఆంధ్రప్రదేశ్

Visakhapatnam It Company Land Allocated,ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ.. మరో ఐటీ కంపెనీ వస్తోంది, ఎకరా రూ.2 కోట్ల చొప్పున భూమి – andhra pradesh government allocated land for it company imaginovate technologies in visakhapatnam

.By .14 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Visakhapatnam It Company Land Allocated,ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ.. మరో ఐటీ కంపెనీ వస్తోంది, ఎకరా రూ.2 కోట్ల చొప్పున భూమి – andhra pradesh government allocated land for it company imaginovate technologies in visakhapatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Visakhapatnam Imaginovate Technologies Land Allocated: విశాఖపట్నంలో ఇమాజిన్నోవేట్‌ టెక్‌ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రభుత్వం 4.05 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ సంస్థ రూ.140 కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ క్యాంపస్‌ను నిర్మించనుంది, దీని ద్వారా 2,600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టుతో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మరింత బలపడనుంది. మరోవైపు ఇవాళ ఢిల్లీలో గూగుల్, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖపట్నంలో రూ.87520 కోట్ల పెట్టుబడులతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.

హైలైట్:

  • ఆంధ్రప్రదేశ్‌కు మరో సాఫ్ట్‌వేర్ కంపెనీ వచ్చేస్తోంది
  • విశాఖలో ఇమాజిన్నోవేట్‌ టెక్‌ సొల్యూషన్స్‌ క్యాంపస్
  • 4.05 ఎకరాల భూమి కేటాయింపు.. ఎకరా రూ.2 కోట్లు
Visakhapatnam Imaginovate Technologies
విశాఖపట్నంలో ఇమాజిన్నోవేట్‌ టెక్‌ సొల్యూషన్స్‌కు 4.05 ఎకరాలు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌కు మరో ఐటీ కంపెనీ వస్తోంది. విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం ఇమాజిన్నోవేట్‌ టెక్‌ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ప్రభుత్వం 4.05 ఎకరాల భూమిని కేటాయించింది. ఏపీఐటీ అండ్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌(జీసీసీ) పాలసీ 2024-29 ప్రాతిపదికన భీమిలిలో ఎకరా రూ.2 కోట్ల చొప్పున ఈ భూమిని కేటాయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇమాజిన్నోవేట్‌ టెక్‌ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తమకు బహిరంగ మార్కెట్‌ ధరకు కాకుండా.. పాలసీ ప్రకారం ఎకరా రూ.2 కోట్లకు కేటాయించాలని చేసిన అభ్యర్థనపై సానుకూలంగా ప్రభుత్వం స్పందించింది. ఈ క్యాంపస్ ఏర్పాటుకు సంస్థ రూ.140 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.. దీని ద్వారా 2,600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రతిపాదనలో పేర్కొంది. రాష్ట్ర ఐటీ, జీసీసీ పాలసీ కింద ఈ సంస్థకు ప్రోత్సాహకాలు కూడా అందించనుంది. ఐటీ క్యాంపస్ దగ్గర రోడ్లు, మురుగునీటి కాలువలు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీని ప్రభుత్వం ఆదేశించింది. విశాఖపట్నంలో కేటాయించే భూమిలో ఇమాజిన్నోవేట్‌ టెక్‌ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అత్యాధునిక ఐటీ క్యాంపస్‌ను నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయి.

ఏపీ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు అన్ని విధాలా సహకారం అందిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీఐఐసీ కీలక పాత్ర పోషించనుంది. ఈ పెట్టుబడితో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మరింత బలపడనుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు, నగర ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ విశాఖపట్నంలో ఐటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది.

‘నాలాగే’.. పెమ్మసానిపై చంద్రబాబు ప్రశంసలు

మరోవైపు విశాఖపట్నంలో 1 గిగావాట్‌ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, గూగుల్‌ మధ్య ఢిల్లీలో చారిత్రక ఒప్పందం కుదిరింది. తాజ్‌మాన్‌సింగ్‌ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్, గ్లోబల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బికాస్‌ కోలే, గూగుల్‌ క్లౌడ్‌ ఆసియా ఫసిఫిక్‌ విభాగం అధ్యక్షుడు కరణ్‌ బజ్వాలు పాల్గొన్నారు. విశాఖపట్నాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నగరంగా మార్చేందుకు గూగుల్ భారీ పెట్టుబడి పెట్టింది. సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్లతో ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టును గూగుల్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2028-32 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు అదనంగా సమకూరుతుందని, 1,88,220 ఉద్యోగాలు వస్తాయని అంచనా. గూగుల్ క్లౌడ్ ఆధారిత కార్యక్రమాల వల్ల ఐదేళ్లలో రూ.47,720 కోట్ల ఉత్పాదకత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి