Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Nani- Akhil Akkineni: అక్కినేని అఖిల్ మిస్ అయ్యాడు.. నాని బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఏ సినిమానో తెలుసా?

14 October 2025

ఘోరం.. ప్రైవేటు బస్సులో మంటలు.. 12 మంది సజీవ దహనం, 17 మందికి సీరియస్

14 October 2025

Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత

14 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Ration Distribution,రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇక ఆ కష్టం తీరినట్టే..! – ration distribution through advanced pos machines and no need to stand in queues in andhra pradesh
ఆంధ్రప్రదేశ్

Ap Ration Distribution,రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇక ఆ కష్టం తీరినట్టే..! – ration distribution through advanced pos machines and no need to stand in queues in andhra pradesh

.By .14 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Ration Distribution,రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇక ఆ కష్టం తీరినట్టే..! – ration distribution through advanced pos machines and no need to stand in queues in andhra pradesh
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


రేషన్ కార్డుదారులు రేషన్ బియ్యం కోసం రేషన్ షాపుల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేదు. క్యూలైన్లలో ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా.. ఏపీ ప్రభుత్వం టెక్నాలజీ వాడుతోంది. ఇందులో భాగంగా కొత్త ఈ పోస్ యంత్రాలను రేషన్ డీలర్లకు అందించారు. వైఫై ఆధారంగా పనిచేసే ఈ పోస్ యంత్రాల ద్వారా సిగ్నల్స్ సమస్యకు చెక్ పెట్టింది. గతంలో సెల్ సిగ్నల్స్ సాయంతో ఈ పోస్ యంత్రాలు పనిచేసేవి. సిగ్నల్స్ అందకపోవటంతో రేషన్ సరుకుల పంపిణీ ఆగిపోయేది. దీంతో లబ్ధిదారులు ఎదురుచూడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు వైఫై సాయంతో పనిచేసే యంత్రాలు అందించడంతో సిగ్నల్స్ సమస్యకు చెక్ పడింది.

AP Ration.
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇక ఆ కష్టం తీరినట్టే..(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. టెక్నాలజీ సాయంతో పౌరసేవలు మరింత సులభంగా అందుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతికత ద్వారా ప్రజలు సులభంగా పౌర సేవలు పొందేలా వీలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్, స్మార్ట్ రేషన్ కార్డులు , పోలీస్ శాఖలో డ్రోన్ల వినియోగం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఇక పేద ప్రజలకు అత్యంత కీలకమైన పౌర సరఫరాల శాఖలోనూ ప్రభుత్వం టెక్నాలజీ వినియోగానికి పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువచ్చింది. రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ఇప్పటికే నాలుగు విడతల్లో పంపిణీ చేశారు. ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా.. ఏపీ ప్రజలు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేలా వీలు కల్పించారు.

మరోవైపు రేషన్ వ్యవస్థలోనూ ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వైసీపీ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేశారు. అయితే టీడీపీ కూటమి సర్కారు ఎండీయూ వాహనాలను రద్దు చేసింది. వాటి స్థానంలో పాత పద్ధతే తీసుకువచ్చింది. రేషన్ డీలర్ల ద్వారా రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు. నెలలో 15 రోజుల పాటు రేషన్ దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే దివ్యాంగులు, వృద్ధులకు ముందుగానే ఐదు రోజులపాటు ఇళ్ల వద్దనే రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నారు.

అయితే రేషన్ సరుకుల కోసం లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద వేచి చూడాల్సిన పనిలేకుండా ఏపీ ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేసింది. ఇందులో భాగంగా కొత్త ఈ పోస్ యంత్రాలను తీసుకువచ్చింది.ఈ పోస్ యంత్రాల సాయంతో రేషన్ షాపుల వద్ద జనం ఎదురుచూడాల్సిన అవసరం తప్పనుంది. పాత ఈ – పోస్ యంత్రాలు సెల్ ఫోన్ సిమ్ సాయంతో పనిచేసేవి. దీంతో సిగ్నల్ అందకపోవటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడేవారు. దీంతో రేషన్ సరుకుల సరఫరాలో ఆలస్యం జరిగేది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త వెర్షన్‌తో వైఫై సాయంతో పనిచేసే ఈ పోస్ యంత్రాలను అందించింది. దీంతో సిగ్నల్స్ సమస్యకు చెక్ పడింది. ఆలస్యం లేకుండా రేషన్ సరుకుల పంపిణీ జరుగుతోంది.

కొత్త ఈ పోస్ యంత్రాలు.. ఎలా పనిచేస్తాయంటే..

కొత్త ఈ పోస్ యంత్రాలలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేశారు. అలాగే స్మార్ట్ రేషన్ కార్డులోని క్యూఆర్ కోడ్‌ను ఈ పోస్ యంత్రాలతో స్కాన్ చేసినప్పుడు కార్డులోని వివరాలు మెషీన్‌లో నమోదవుతాయి. అలాగే ఏయే సరుకులు ఎంత మొత్తంలో ఇవ్వాలనే వివరాలు రికార్డవుతాయి. అలాగే ఫింగర్ ప్రింట్ పడకపోతే ఐరిస్ విధానంలోనూ ఇవి పనిచేసేలా డిజైన్ చేశారు. దీంతో రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తప్పుతోందని లబ్ధిదారులు చెప్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి