Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Jupiter Transit: ధన్ తేరస్ రోజున ఈ రాశులపై గురు అనుగ్రహం.. జీవితం స్వర్ణమయం

14 October 2025

Egg: అమ్మ బాబోయ్.. గుడ్డు అంత డేంజరా.. రోజూ తింటే ఏమవుతుందో తెలిస్తే షాకే..

14 October 2025

OTT Movie: ఓటీటీలో ‘దృశ్యం’ దర్శకుడి సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఐఎమ్‌డీబీ టాప్ రేటింగ్ మూవీ

14 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijayawada Metro Tender,మెట్రో రైల్ ప్రాజెక్టులో అప్ డేట్.. మరోసారి పొడిగింపు.. – vijayawada metro rail project tender deadline extends to october 24
ఆంధ్రప్రదేశ్

Vijayawada Metro Tender,మెట్రో రైల్ ప్రాజెక్టులో అప్ డేట్.. మరోసారి పొడిగింపు.. – vijayawada metro rail project tender deadline extends to october 24

.By .14 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijayawada Metro Tender,మెట్రో రైల్ ప్రాజెక్టులో అప్ డేట్.. మరోసారి పొడిగింపు.. – vijayawada metro rail project tender deadline extends to october 24
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విజయవాడ మెట్రోకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు టెండర్ల గడువును ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మరోసారి పొడిగించింది. విజయవాడ మెట్రో టెండర్ల గడువును అక్టోబర్ 24 వరకూ అంటే మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు సంస్థలు అభ్యర్థించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు టెండర్ల గడువును పొడిగించడం ఇది రెండోసారి.

metro
మెట్రో రైల్ ప్రాజెక్టులో అప్ డేట్.. మరోసారి పొడిగింపు..(ఫోటోలు– Samayam Telugu)
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు టెండర్ల గడువును ఏపీ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. టెండర్ల గడువును మరో పది రోజుల పాటు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు సంస్థల విజ్ఞప్తితో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియలో పాల్గొనే కంపెనీలకు ఉపశమనం కలిగింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు టెండర్ల దాఖలు గడువును పొడిగించడం ఇది రెండోసారి. గతంలో అక్టోబరు 14 వరకు పొడిగించారు. ఇవాళ్టితో గడువు పూర్తి కానుండటంతో గడువు పొడిగించాలని పలు సంస్థలు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను కోరినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో కాంట్రాక్టు సంస్థల అభ్యర్థనతో విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు టెండర్ల గడువును మరో పది రోజులు పొడిగిస్తూ ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 24వ తేదీ వరకూ టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. విజయవాడతో పాటుగా విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానించారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలిదశలో 38 కిలోమీటర్ల మేరకు నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశలో 1ఏ కింద గన్నవరం నుంచి పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ వరకూ ఓ కారిడార్ నిర్మించనున్నారు. అలాగే 1బీ కింద పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి పెనమలూరు వరకూ మరో మెట్రో కారిడార్ నిర్మాణం జరగనుంది.

దసరా పండుగ ‘రిటర్న్ గిఫ్ట్’.. కిక్కిరిసిన మెట్రో.. భారీగా ట్రాఫిక్ జామ్‌లు..

విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్ 1 కింద 38.40 కి.మీ. మేర మెట్రో నిర్మాణానికి రూ.11,009 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. భూసేకరణ కోసం రూ.1,152 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వమే భరించనుంది. ఇక విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశలో పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ నుంచి అమరావతి వరకూ 27.75 కి.మీ. మేరకు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల ఫేజ్ 1 పనులను మూడేళ్లలో పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం సీఆర్డీఏ నుంచి రూ. 3,497 కోట్లు నిధులు ఏర్పాటు చేయనుంది. అలాగే ప్రపంచబ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్, జైకా వంటి విదేశీ బ్యాంకుల నుంచి రుణాలను కూడా సమీకరించనున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి