Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

సెల్ఫీ తీయబోతూ.. 18 వేల అడుగుల్లో పట్టు తప్పి

14 October 2025

Jupiter Transit: ధన్ తేరస్ రోజున ఈ రాశులపై గురు అనుగ్రహం.. జీవితం స్వర్ణమయం

14 October 2025

Egg: అమ్మ బాబోయ్.. గుడ్డు అంత డేంజరా.. రోజూ తింటే ఏమవుతుందో తెలిస్తే షాకే..

14 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Amaravati Rajbhavan,అమరావతిలో రాజ్ భవన్.. రూ.212 కోట్లతో నిర్మాణం.. ఉత్తర్వులు జారీ – ap government issues orders for construction of raj bhavan in amaravati at a cost of 212 crore
ఆంధ్రప్రదేశ్

Amaravati Rajbhavan,అమరావతిలో రాజ్ భవన్.. రూ.212 కోట్లతో నిర్మాణం.. ఉత్తర్వులు జారీ – ap government issues orders for construction of raj bhavan in amaravati at a cost of 212 crore

.By .14 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Amaravati Rajbhavan,అమరావతిలో రాజ్ భవన్.. రూ.212 కోట్లతో నిర్మాణం.. ఉత్తర్వులు జారీ – ap government issues orders for construction of raj bhavan in amaravati at a cost of 212 crore
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమరావతిలో గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం నిధులు, పాలనా అనుమతులు ఇస్తూ జీవో జారీ చేసింది. అమరావతిలో 212 కోట్ల రూపాయలతో రాజ్ భవన్ నిర్మించాలని ఇటీవల జరిగిన సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు. తాజాగా సీఎఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 212 కోట్లతో అమరావతిలో రాజ్ భవన్ నిర్మాణం కోసం జీవో జారీ చేశారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో దీనిని నిర్మించనున్నారు.

amaravati.
అమరావతిలో రాజ్ భవన్.. రూ.212 కోట్లతో నిర్మాణం.. ఉత్తర్వులు జారీ(ఫోటోలు– Samayam Telugu)
ఏపీ రాజధాని అమరావతిలో రాజ్‌భవన్ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రూ.212 కోట్లతో అమరావతిలో రాజ్‌భవన్ నిర్మించనున్నారు. రాజ్ భవన్ నిర్మాణం కోసం నిధులు, పాలనా అనుమతులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌గా నిర్మించే ఈ నిర్మాణంలో గవర్నర్ మాన్షన్, ఆఫీస్, దర్బార్ హాల్, రెండు గెస్ట్ హౌసులు, ఆరు సీనియర్ స్టాఫ్, రెండు జూనియర్ స్టాఫ్, 40 సహాయక సిబ్బంది క్వార్టర్స్, 20 రూముల బ్యారెక్స్, 144 బ్యారెక్ అకామడేషన్లు ఏర్పాటు చేయనుంది ఏపీ ప్రభుత్వం . అలాగే కాంపౌండ్‌కు నాలుగు వైపులా సెంట్రీ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు అమరావతిలో రాజ్‌భవన్‌ను రూ.212 కోట్లతో నిర్మించేందుకు ఇటీవలే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.. కృష్ణానది ఒడ్డున రాజ్‌భవన్‌ నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 53వ సీఆర్డీఏ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రభుత్వం నిధులు, పాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది.

అమరావతిలో కీలక నిర్మాణాలు..

మరోవైపు రాజధాని అమరావతి నిర్మా్ణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. అమరావతిలో కీలక ప్రాజెక్టులు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల కోసం ఉమ్మడి కేంద్ర సచివాలయం కూడా నిర్మించనున్నారు. అలాగే అందులో పనిచేసే ఉద్యోగుల కోసం రెసిడెన్షియల్ కాంప్లె్క్స్ నిర్మించనున్నారు. వీటికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం లభించింది. రూ.2,787 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులను చేపట్టనున్నారు. రూ. 1458 కోట్లతో కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌, జనరల్‌ పూల్‌ రెసిడెన్షియల్‌ అకామిడేషన్‌ కోసం రూ.1,329 కోట్లు ఖర్చు చేయనున్నారు. అయితే ఈ రెండు కీలక ప్రాజెక్టులను కూడా కేంద్ర ప్రజాపనుల విభాగం చేపడుతోంది. మరోవైపు 2018లోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నిర్మాణం కోసం 22.53 ఎకరాలు కేటాయించింది. అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ పరిధిలో 5.53 ఎకరాల భూమిని.. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ వెలుపల 17 ఎకరాలు కేటాయించింది. అయితే ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావటంతో ఈ ప్రాజెక్టులు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. 2024 ఏపీ ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో వీటిలో మళ్లీ కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఇటీవల వీటి నిర్మాణం కోసం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు అంగీకారం తెలిపింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి