Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Video: కొత్త కెప్టెన్‌ను తొలిసారి కలిసిన ‘హిట్‌మ్యాన్’.. ఏమన్నాడో తెలుసా?

15 October 2025

ట్రంప్ అమెరికా బెలూన్ పేలింది! టాప్ 10 పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

15 October 2025

ఈ తరానికి కూడా 150 ఏళ్ళు బ్రతికే ఛాన్స్ ఉంది.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

15 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vizag Google Ai Hub Jayaprakash Narayan,విశాఖకు గూగుల్ రావటం మంచిదే, కానీ.. లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ ఇంట్రస్టింట్ ట్వీట్ – loksatta founder jayaprakash narayan reaction on google ai hub in visakhapatnam
ఆంధ్రప్రదేశ్

Vizag Google Ai Hub Jayaprakash Narayan,విశాఖకు గూగుల్ రావటం మంచిదే, కానీ.. లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ ఇంట్రస్టింట్ ట్వీట్ – loksatta founder jayaprakash narayan reaction on google ai hub in visakhapatnam

.By .15 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vizag Google Ai Hub Jayaprakash Narayan,విశాఖకు గూగుల్ రావటం మంచిదే, కానీ.. లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ ఇంట్రస్టింట్ ట్వీట్ – loksatta founder jayaprakash narayan reaction on google ai hub in visakhapatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు కోసం మంగళవారం ఏపీ ప్రభుత్వం, గూగుల్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు కింద విశాఖలో వచ్చే ఐదేళ్లలో గూగుల్ లక్షా31 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దీనిపై వివిధ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే లోక్‌‍సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ దీనిపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం తెలియజేశారు. ఇదో గొప్ప విజయంగా అభివర్ణించిన జయప్రకాష్ నారాయణ.. రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలతో పాటుగా ఆర్థిక అంశాల నిర్వహణపైనా దృష్టి సారించాలని సూచించారు.

Google
విశాఖకు గూగుల్ రావటం మంచిదే, కానీ.. లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ ఇంట్రస్టింట్ ట్వీట్(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి దిశగా మంగళవారం కీలక అడుగులు పడ్డాయి. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఇంతటి చరిత్రాత్మక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే డేటా సెంటర్ ఏర్పాటు వలన పర్యావరణానికి ప్రమాదమనే వాదనలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు మీద ఏ పార్టీ, ఆ పార్టీకి అనుగుణంగా వాదనలు వినిపిస్తోంది. ఈ క్రమంలోనే లోక్‌సత్తా వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ స్పందించారు. ఏపీ ప్రభుత్వం, గూగుల్ సంస్థ ఒప్పందం తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

*గూగుల్ డేటా సెంటర్.. అమరావతిని కాదని.. విశాఖలోనే ఎందుకు?

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక అభినందనలు. గూగుల్ ఏఐ హబ్‌ను విశాఖపట్నానికి తీసుకురావడం గొప్ప విజయం. ఇది భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన దిశగా గొప్ప అడుగు. దీనిని సులభతరం చేసినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. అయితే పెట్టుబడులు, మౌలిక సదుపాయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులపైనా దృష్టి పెట్టాలి. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు.. ఖర్చులను తగ్గించుకోవటంపై దృష్టి పెట్టాలి. “

ప్రతి వారం ఒక గుడ్ న్యూస్ చెబుతాం.. రెడీగా ఉండండి: మంత్రి లోకేష్

“ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు, ఆదాయాలు కూడా తదనుగుణంగా పెరుగుతాయి. అయితే ఖర్చులను కొన్ని సంవత్సరాలు స్తంభింపజేయడం వల్ల పబ్లిక్ డెబిట్ నిర్వహించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం, ఆఫ్ బడ్జెట్ రుణాలు, చెల్లించని బిల్లులను చేర్చినప్పుడు, రుణ-జిఎస్‌డిపి నిష్పత్తి 60 శాతం మించిపోయింది. పెట్టుబడిని ఆకర్షించడంలో, మౌలిక సదుపాయాలను నిర్మించడంలో మాదిరిగానే ఆర్థిక నిర్వహణ, వనరులను వివేకవంతంగా ఉపయోగించడంలో ప్రభుత్వం అదే చైతన్యాన్ని చూపిస్తుందని నేను ఆశిస్తున్నా” అంటూ జయప్రకాష్ నారాయణ ట్వీట్ చేశారు.

మరోవైపు గూగుల్ – ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వచ్చే ఐదేళ్లలో గూగుల్ ఏపీలో రూ.1.31 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుచేయనుంది. ఈ ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం ప్రస్తుతానికి రూ.87,250 కోట్లుగా గూగుల్ ప్రకటించింది. అయితే దీనిని 15 బిలియన్ డాలర్లకు తీసుకెళ్తామని వెల్లడించింది. గూగుల్ ఏఐ హబ్ ద్వారా విశాఖపట్నం నుంచి సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా వంటి 12 దేశాలతో అనుసంధానం చేస్తూ సబ్ సీ కేబుల్ ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు గూగుల్ ఏఐ హబ్ ద్వారా సుమారుగా 1,88,220 ఉద్యోగాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి