Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Actress Neha: 8 నెలలు మంచంపైనే.. నరకం అనుభవించా..! కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ

3 March 2026

కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు.. లాస్ట్ మినిట్‌లో అలా చేశారన్న మహేష్ విట్టా

3 March 2026

వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి..? ఈ సూపర్ టిప్స్ మీకోసం..!

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Yelamanchili Railway Station,ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ.. రూపురేఖలు మారుతున్నాయ్.. కొత్త రైళ్లకు కూడా హాల్ట్.! – yelamanchili railway station development works with 10 crore
ఆంధ్రప్రదేశ్

Yelamanchili Railway Station,ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ.. రూపురేఖలు మారుతున్నాయ్.. కొత్త రైళ్లకు కూడా హాల్ట్.! – yelamanchili railway station development works with 10 crore

.By .7 December 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Yelamanchili Railway Station,ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ.. రూపురేఖలు మారుతున్నాయ్.. కొత్త రైళ్లకు కూడా హాల్ట్.! – yelamanchili railway station development works with 10 crore
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రాష్ట్రంలో పలు రైల్వేస్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే అనకాపల్లిలోని ఎలమంచిలి రైల్వే స్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. పది కోట్లతో రైల్వేస్టేషన్‌లో అభివృద్ధి పనులు చేపట్టారు. మధ్యలో వివిధ కారణాలతో ఆగిన పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. మరోవైపు ఎలమంచిలి రైల్వేస్టేషన్‌లో కొత్త రైళ్లకు హాల్ట్ ఇవ్వాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి.

Yelamanichili
ఎలమంచిలి రైల్వేస్టేషన్(ఫోటోలు– Samayam Telugu)
కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీలో రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద పలు రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వేస్టేషన్‌‌లోనూ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రూ.10 కోట్లతో ఎలమంచిలి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. రెండేళ్ల కిందట పనులు ప్రారంభం కాగా.. ఏడాదిన్నర తర్వాత వివిధ కారణాలతో ఆగిపోయాయి. తాజాగా మళ్లీ తిరిగి పనులను ప్రారంభించారు. ప్లాట్ ఫాం పనులను మధ్యలోనే నిలిపివేయటంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఇటీవల రైల్వే ఉన్నతాధికారులు ఎలమంచిలి రైల్వేస్టేషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా నెలరోజుల్లో ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలతో పనులు మళ్లీ ప్రారంభించారు. ఎలమంచిలి రైల్వేస్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను దాదాపు 80 శాతం వరకూ పూర్తి చేశారు. అలాగే రైల్వే ప్రయాణికుల విశ్రాంతి భవనం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటుగా ప్రయాణికులకు తాగునీటి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాంలు ఆధునికీకరిస్తున్నారు. ప్లాట్‌ఫాం పొడవునా షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో ఒకటి, రెండు ప్లాట్‌ఫాంల మధ్యలో కొత్త ఫుట్ పాత్ వంతెన నిర్మిస్తున్నారు. ఈ రెండు ప్లాట్‌ఫాం పనులు పూర్తైన తర్వాత..మూడో నంబరు ప్లాట్‌ఫాం పనులను చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు ఎలమంచిలి రైల్వే స్టేషన్ మీదుగా ఇప్పటికే ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. దీంతో పలు రైళ్లకు ఇక్కడ స్టాపింగ్ కల్పించారు. అలాగే కొత్త రైళ్ల హాల్ట్‌కు కూడా ఆలోచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే అధికారుల వద్ద ఉన్నాయి. భువనేశ్వర్‌-బెంగళూర్‌ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో నిలపాలనే డిమాండ్‌ చాలాకాలంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో స్టాపింగ్ ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొత్తంగా అభివృద్ధి పనులు పూర్తైన తర్వాత ఎలమంచిలి రైల్వేస్టేషన్ కొత్త రూపు సంతరించుకోవటంతో పాటుగా కొత్త రైళ్లకు హాల్ట్‌ కూడా ఇవ్వనుంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి