Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

లేఆఫ్ దెబ్బ.. 3 ఈఎంఐలు బకాయి.. 60 రోజుల్లో రూ.1.2 కోట్ల ఇల్లు వేలం వేసిన బ్యాంక్!

4 March 2026

Telangana: కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..

4 March 2026

వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. రుచితో పాటు క్యాన్సర్‎ను కూడా తరిమికొడుతుంది

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ips Pv Sunil Kumar,వైఎస్ రాజారెడ్డి మంచి ఇంగ్లీష్ మాట్లాడుతారు.. పీవీ సునీల్ కుమార్ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు.. – pv sunil kumar about ys raja reddy in pulivendula
ఆంధ్రప్రదేశ్

Ips Pv Sunil Kumar,వైఎస్ రాజారెడ్డి మంచి ఇంగ్లీష్ మాట్లాడుతారు.. పీవీ సునీల్ కుమార్ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు.. – pv sunil kumar about ys raja reddy in pulivendula

.By .16 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ips Pv Sunil Kumar,వైఎస్ రాజారెడ్డి మంచి ఇంగ్లీష్ మాట్లాడుతారు.. పీవీ సునీల్ కుమార్ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు.. – pv sunil kumar about ys raja reddy in pulivendula
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ వైఎస్ రాజారెడ్డి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన పీవీ సునీల్ కుమార్ రాజారెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజారెడ్డి చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతారని అన్నారు. అలాగే ఆయన వద్ద తప్పును తప్పని చెప్పే మంచి నీతి ఉందన్నారు. అప్పట్లో జరిగిన పలు విషయాలను ఈ సందర్భంగా పీవీ సునీల్ కుమార్ పంచుకున్నారు.

pv sunil kumar
ఐపీఎస్ ఆఫీసర్ పీవీ సునీల్ కుమార్(ఫోటోలు– Samayam Telugu)
సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పీవీ సునీల్ కుమార్.. గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పీవీ సునీల్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే రఘురామ, పీవీ సునీల్ కుమార్ మధ్య ఇప్పటికీ వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఓ యూట్యూబ్ ఛానెల్‍‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీవీ సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మొదట పోస్టింగ్ వచ్చిన పులివెందుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాత.. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాన్న వైఎస్ రాజారెడ్డి గురించి పీవీ సునీల్ కుమార్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

తనకు ఏఎస్పీగా కడప జిల్లా పులివెందులలో తొలిసారిగా పోస్టింగ్ వచ్చినట్లు పీవీ సునీల్ కుమార్ తెలిపారు. ఏదో సాధించాలనే ఉద్దేశంతో తాను పోలీస్ వృత్తిలోకి రాలేదని.. ఉద్యోగం చేయడానికి వచ్చానన్నారు. చిన్నప్పటి నుంచి హత్యలు అంటే తెలియదని.. సడన్‌గా కడపకు వచ్చేసరికి ఇంత చిన్న కారణాలకు కూడా చంపేసుకుంటారా అని అనిపించిందన్నారు. పులివెందుల ప్రాంతంలో వైఎస్ కుటుంబం చాలా పవర్‌ ఫుల్‌గా ఉండేదన్న పీవీ సునీల్ కుమార్.. ప్రజల పంచాయతీలను కూడా వారే తీర్చేసేవారన్నారు.

అయితే ఉమేష్ చంద్ర గారు తనను పులివెందులకు తీసుకెళ్లారని.. అక్కడ ఎలా ఉంటుందో తనకు తెలియదని అన్నారు. ఉమేష్ చంద్ర టీమ్ కావటంతో.. తనను యాంటీ వైఎస్ కుటుంబంగా చూసేవారని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన గురించి మాట్లాడారని అన్నారు. పులివెందులలో రెండేళ్లు పనిచేశానని.. పంచాయతీ ఎన్నికలను ఒక్క బైపోల్ కూడా లేకుండా నిర్వహించామన్నారు. ఉమేష్ చంద్ర, తాను ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో ఇబ్బంది పడ్డారని అన్నారు.

ఈ క్రమంలోనే వైఎస్ రాజారెడ్డి గురించి పీవీ సునీల్ కుమార్ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజారెడ్డి మంచి ఇంగ్లీష్ మాట్లాడుతారని పీవీ సునీల్ కుమార్ అన్నారు. రెండు మూడుసార్లు ఆయనను కలిశానని.. బాగా మాట్లాడుతారని అన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. రాజారెడ్డి వద్ద తప్పు చేస్తే తప్పని చెప్పే నీతి ఉందన్నారు. ఓసారి పేకాడుతూ వారి మనుషులు దొరికారని.. ఆ తర్వాత వారంతా వెళ్లి ఆయన వద్ద చెప్తే.. పేకాడితే అరెస్ట్ చేయక ముద్దుపెట్టుకుంటారా అని అన్నారని గుర్తు చేసుకున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి