Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Virosh: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్.. హాజరవుతున్న అతిథులు

4 March 2026

భోజనం చేసిన కాసేపటికే మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా? ఇది ఈ వ్యాధికి సంకేతం..

4 March 2026

Tollywood: హోలీ సెలబ్రేషన్స్‌లో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pocso Case On Man Who Hurled Stones On Ys Jagan,జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు అరెస్ట్.. బాలికతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లాడు – police arrest man under pocso case for marrying minor who hurled stones on ys jagan
ఆంధ్రప్రదేశ్

Pocso Case On Man Who Hurled Stones On Ys Jagan,జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు అరెస్ట్.. బాలికతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లాడు – police arrest man under pocso case for marrying minor who hurled stones on ys jagan

.By .18 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pocso Case On Man Who Hurled Stones On Ys Jagan,జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు అరెస్ట్.. బాలికతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లాడు – police arrest man under pocso case for marrying minor who hurled stones on ys jagan
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మాజీ సీఎం జగన్‌పై దాడి చేసిన వేముల సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈసారి పాత కేసులో కాదు, మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. ఇంట్లోంచి వెళ్లిపోయి, బాలికను పెళ్లి చేసుకున్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. బాలిక మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

stone attcak
జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీష్‌పై పోక్సో కేసు(ఫోటోలు– Samayam Telugu)
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన యువకుడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడిని అరెస్ట్ చేసింది పాత కేసులో కాదు. మైనర్ బాలికను ప్రేమించి.. పెళ్లి చేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. బాలిక మైనర్ కావడంతో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాలికను వివాహం చేసుకోవడానికి కన్నా ముందు.. తనను ప్రేమిస్తున్నాను అని నిందితుడు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మందలించారు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తల్లిదండ్రులు.. పది రోజుల పాటు గాలించి.. అతడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడంతో.. తాజాగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

గతంలో మాజీ ముఖ్యమంతరి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గులకరాయితో దాడి చేసిన కేసులో నిందితుడైన వేముల సతీష్‌కుమార్‌ని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన వేముల సతీష్‌కుమార్‌ గత ఏడాది జులై కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించింది. జులై 17న రాత్రి ఇంట్లో పడుకున్న అతడు తర్వాత రోజు ఉదయానికి కనిపించలేదు. జగన్‌పై దాడి కేసులోస నిందితుడు కావడంతో.. అతడు కనిపించకుండా పోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది.

కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించగా.. అతడు ఓ బాలికను ప్రేమించాడని.. కానీ సతీష్ తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకారం తెలపలేదని.. దీంతో అతడు ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడైంది. పైగా అతడు తన మొబైల్ ఫోన్ వెంట తీసుకెళ్లలేదు. దీంతో సతీష్ ఆచూకీ కనుగోవడం కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

ఇంట్లో నుంచి వెల్లిపోయిన సతీష్ కొన్ని రోజులకు తండ్రికి కాల్ చేసి.. వేరే వ్యక్తి యూపీఐ నంబర్‌కి రూ.1500 వేయమన్న సంగతి పోలీసులకు తెలిసింది. దీని ఆధారంగా దర్యాప్తు చేసి.. సతీష్ తిరుపతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈక్రమంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించి వారి సాయంతో నిఘా ఉంచి 10 రోజుల తరువాత అతనిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.

తాజాగా సతీష్ బాలికను పెళ్లి చేసుకోవడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాలిక మైనర్ కావడంతో సతీష్‌‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అతడిని అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో హాజరుపర్చడంతో కోర్టు రిమాండ్‌ విధించింది.

పిల్లి ధ‌ర‌ణి

రచయిత గురించిపిల్లి ధ‌ర‌ణిధరణి పిల్లి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందిస్తుంటారు. ఆమెకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్థానిక వార్తలు, తెలంగాణ ఎన్నికల అప్డేట్స్, ప్రత్యేక కథనాలు రాశారు. ధరణి ఎస్ఎస్‌జే నుంచి మల్టీ మీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు.… ఇంకా చదవండి