అత్యాశకు పోయిన ఓ వ్యక్తి అడ్డంగా మోసపోయిన ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. 33 లక్షల రూపాయలు ఇస్తే బదులుగా 50 లక్షల రూపాయలను బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామంటూ గంగాప్రసాద్ అనే వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. దీనిపై గతేడాది జనవరి నెలలో గంగాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి ఎనిమిదిన్నర లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

*ఇన్కం ట్యాక్స్ ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తానని.. ర్యాపిడో డ్రైవర్కు టోకరా..
గంగాప్రసాద్ అనే వ్యక్తి ప్రొద్దుటూరులోని గోకుల్నగర్లో నివశిస్తున్నారు. సుమారుగా ఏడాది కిందట ఓ ముఠా ఆయనను సంప్రదించింది. 33 లక్షల రూపాయలు ఇస్తే అందుకు బదులుగా రూ.50 లక్షలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పారు. దీంతో గంగా ప్రసాద్లో అత్యాశ మొదలైంది. 33 లక్షలకు 50 లక్షలు వస్తాయనే ఆశతో.. 33 లక్షల రూపాయలను ఓ బ్యాగులో నింపి వారి వద్దకు తీసుకెళ్లారు. గంగా ప్రసాద్ నుంచి సొమ్ము తీసుకున్న ముఠా.. ఆయన బ్యాంక్ ఖాతాలో రూ.50 లక్షలు జమ చేయలేదు. దీంతో గంగాప్రసాద్ వారిని గట్టిగా నిలదీశారు. దీంతో మీ డబ్బు మీరు తీసుకెళ్లమంటూ ఆ ముఠా సభ్యులు.. గంగా ప్రసాద్కు డబ్బులు ఉన్న బ్యాగ్ తిరిగి ఇచ్చేశారు.
*120 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ప్రభుత్వ పాఠశాల.. ట్రాక్ రికార్డు మామూలుగా లేదుగా..
దీంతో బ్యాగ్ తీసుకుని ఇంటికి చేరుకున్న గంగాప్రసాద్.. ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ చూస్తే.. పైన మామూలు నోట్లు, కింద తెల్లటి పేపర్లు దర్శనమిచ్చాయి. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. ముఠాసభ్యులు పై వరుసలో మంచినోట్లు, కింది వరుసలో తెల్లటి పేపర్లు ఉంచిన అదే రంగు బ్యాగును గంగాప్రసాద్కు ఇచ్చి బురిడీ కొట్టించారు. దీంతో మోసపోయిన సంగతి గ్రహించిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై 2025 జనవరి ఏడో తేదీ కేసు నమోదు చేశారు.తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్న ప్రొద్దుటూరు పోలీసులు.. వారి నుంచి రూ.8.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.


