Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND Vs PAK: వచ్చాడయ్యో పోటుగాడు.! ఈసారి టీమిండియాపై గెలుపు పక్కా..

11 February 2026

IRCTC Tourism : హైదరాబాద్ టు అరుణాచలం! శివరాత్రి వేళ ఐఆర్‌సీటీసీ అదిరిపోయే గిఫ్ట్.. తక్కువ ధరకే జ్యోతిర్లింగాల దర్శనం!

11 February 2026

2027 సంక్రాంతికి ఆ నలుగురు.. వాళ్లకు చుక్కలే ఇక..

11 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»50 Lakhs For Rs 33 Lakhs,33 లక్షలిస్తే అకౌంట్లోకి రూ.50 లక్షలు.. అడగ్గానే డబ్బులు వెనక్కి ఇచ్చేశారు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్.. – proddatur police arrest gang that cheated by offering 50 lakhs for rs 33 lakhs
ఆంధ్రప్రదేశ్

50 Lakhs For Rs 33 Lakhs,33 లక్షలిస్తే అకౌంట్లోకి రూ.50 లక్షలు.. అడగ్గానే డబ్బులు వెనక్కి ఇచ్చేశారు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్.. – proddatur police arrest gang that cheated by offering 50 lakhs for rs 33 lakhs

.By .11 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
50 Lakhs For Rs 33 Lakhs,33 లక్షలిస్తే అకౌంట్లోకి రూ.50 లక్షలు.. అడగ్గానే డబ్బులు వెనక్కి ఇచ్చేశారు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్.. – proddatur police arrest gang that cheated by offering 50 lakhs for rs 33 lakhs
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అత్యాశకు పోయిన ఓ వ్యక్తి అడ్డంగా మోసపోయిన ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. 33 లక్షల రూపాయలు ఇస్తే బదులుగా 50 లక్షల రూపాయలను బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామంటూ గంగాప్రసాద్ అనే వ్యక్తిని ఓ ముఠా మోసం చేసింది. దీనిపై గతేడాది జనవరి నెలలో గంగాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి ఎనిమిదిన్నర లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

Proddatur
33 లక్షలు 50 లక్షలు ఇస్తామని బురిడీ(ఫోటోలు– Samayam Telugu)
ఈ ప్రపంచంలో మోసపోయేవాడు ఉన్నన్ని రోజులు మోసం చేసేవాడు పుట్టుకొస్తూనే ఉంటాడు.. ఓ ఫేమస్ తెలుగు సినిమాలో డైలాగ్ ఇది. ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. ఆకలికి మించి తిండి, అవసరానికి మించి సంపాదన, అడగకుండానే ఇచ్చే సలహా, అత్యాశ.. ఇవన్నీ హానికరమని పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. కానీ వింటేగా.. అలాంటి ఘటనే వైఎస్సార్ కడప జిల్లాలో జరిగింది. అది కూడా ఇటీవల కాదు.. ఎప్పుడో ఏడాది కిందట జరిగింది. తాజాగా ఆ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

*ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తానని.. ర్యాపిడో డ్రైవర్‌కు టోకరా..

గంగాప్రసాద్ అనే వ్యక్తి ప్రొద్దుటూరులోని గోకుల్‌నగర్‌‌లో నివశిస్తున్నారు. సుమారుగా ఏడాది కిందట ఓ ముఠా ఆయనను సంప్రదించింది. 33 లక్షల రూపాయలు ఇస్తే అందుకు బదులుగా రూ.50 లక్షలు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పారు. దీంతో గంగా ప్రసాద్‌లో అత్యాశ మొదలైంది. 33 లక్షలకు 50 లక్షలు వస్తాయనే ఆశతో.. 33 లక్షల రూపాయలను ఓ బ్యాగులో నింపి వారి వద్దకు తీసుకెళ్లారు. గంగా ప్రసాద్ నుంచి సొమ్ము తీసుకున్న ముఠా.. ఆయన బ్యాంక్ ఖాతాలో రూ.50 లక్షలు జమ చేయలేదు. దీంతో గంగాప్రసాద్ వారిని గట్టిగా నిలదీశారు. దీంతో మీ డబ్బు మీరు తీసుకెళ్లమంటూ ఆ ముఠా సభ్యులు.. గంగా ప్రసాద్‌కు డబ్బులు ఉన్న బ్యాగ్ తిరిగి ఇచ్చేశారు.

*120 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ప్రభుత్వ పాఠశాల.. ట్రాక్ రికార్డు మామూలుగా లేదుగా..

దీంతో బ్యాగ్ తీసుకుని ఇంటికి చేరుకున్న గంగాప్రసాద్.. ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ చూస్తే.. పైన మామూలు నోట్లు, కింద తెల్లటి పేపర్లు దర్శనమిచ్చాయి. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. ముఠాసభ్యులు పై వరుసలో మంచినోట్లు, కింది వరుసలో తెల్లటి పేపర్లు ఉంచిన అదే రంగు బ్యాగును గంగాప్రసాద్‌కు ఇచ్చి బురిడీ కొట్టించారు. దీంతో మోసపోయిన సంగతి గ్రహించిన బాధితుడు.. పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై 2025 జనవరి ఏడో తేదీ కేసు నమోదు చేశారు.తాజాగా నిందితులను అదుపులోకి తీసుకున్న ప్రొద్దుటూరు పోలీసులు.. వారి నుంచి రూ.8.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి