Another Pt Warrant Issued Against Ambati Rambabu,అంబటి రాంబాబుకు షాక్.. బెయిల్ వచ్చింది, విడుదలవుతారని సంబరపడేలోపు.. జైలు బయట రెడీగా ఉన్నారు – another pt warrant on against ex minister ambati rambabu
Another Pt Warrant On Against Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లిలో నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు పీటీ వారెంట్ వేశారు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో అంబటి వసూళ్లు చేశారని ఆరోపణలతో కేసు నమోదైంది. బెయిల్పై అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలవుతారని అనుకుంటున్న వేళ మరో కేసు నమోదైంది.
హైలైట్:
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్
మరో పీటీ వారెంట్ జారీ చేసిన గుంటూరు కోర్టు
బెయిల్పై విడుదలవుతారనుకునే లోపు ట్విస్ట్
అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్(ఫోటోలు– Samayam Telugu)
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబును వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి. బెయిల్ వచ్చిందని ఆనందపడే లోపు మరో సమస్య వచ్చి పడింది. అంబటిపై మరో కేసులో తాజాగా మరో పీటీ వారెంట్ జారీ అయ్యింది. గత ప్రభుత్వ హయాంలో రాంబాబు మంత్రిగా పనిచేశారు.. అయితే ఆయన ప్రాతినిధ్యం వహించిన సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారని కేసు నమోదైంది. అయితే ఈ కేసులో తాజాగా గుంటూరులోని కోర్టు బుధవారం పీటీ వారెంట్ జారీ చేసి ఈ నెల 18లోగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. వాస్తవానికి అంబటిపై గుంటూరులో నమోదైన కేసులో బుధవారం బెయిల్ రాగా.. అంబటి అనుచరులు సంబరాలు చేశారు. అయితే ఇంతలోనే మరో పీటీ వారెంట్ రావడంతో డీలపడ్డారు. అంబటి రాంబాబు మంత్రి హోదాలో సత్తెనపల్లిలో 2023 జనవరిలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అయితే నియోజకవర్గం పరిధిలో వాలంటీర్లతో పింఛన్ లబ్ధిదారుల నుంచి రూ.200 చొప్పున తీసుకుని రెండు లాటరీ టికెట్లు ఇచ్చారు. సంక్రాంతి రోజు లాటరీ తీసి బహుమతుల్ని పంపిణీ చేశారు. ఇలా లాటరీలు తీయడం చట్టవిరుద్ధమని జనసేన పార్టీ నేత గాదె వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించడంతో.. రాంబాబుతోపాటు మరికొందరిపై సత్తెనపల్లి టౌన్ పోలీసులు.. 2023 జనవరి 16న కేసు నమోదు చేశారు. ఆ కేసులోనే తాజాగా పీటీ వారెంట్ జారీ అయ్యింది. ఈ నెల 18లోగా ఆయన్ను కోర్టులో హాజరుపరుస్తారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించన కేసులో అంబటికి బెయిల్వ చ్చేసింది. అలాగే పట్టాభిపురం పోలీసులపై దౌర్జన్యం చేశారనే కేసులో రిమాండ్ విధించగా.. ఆ కేసులో బుధవారం బెయిల్ వచ్చేసింది. ఆ బెయిల్ పత్రాలను తీసుకుని లాయర్లు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఇంతలో సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల కేసులో పీటీ వారెంట్తో పోలీసులు జైలు దగ్గరకు వెళ్లారు.. ఈ క్రమంలో అంబటి రాంబాబు విడుదల మళ్లీ వాయిదా పడింది. అంబటి రాంబాబుపై 35 వరకు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఆయన ఈ కేసుల్ని క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వరుసగా పీటీ వారెంట్లు తలనొప్పిగా మారాయి.. ఆయన విడుదల వాయిదా పడింది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి