Dagadarthi Airport Ols Drone Survey,ఏపీలోని ఆ జిల్లాలో కొత్త ఎయిర్పోర్ట్.. డ్రోన్ ఓఎల్ఎస్ సర్వే పూర్తి, కీలక అప్డేట్ – airport authority team conducted ols survey in dagadarthi airport lands in nellore district
Nellore Airport Drone Ols Survey In Lands: నెల్లూరు జిల్లా దగదర్తిలో కొత్తగా ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భూ సేకరణ చేసిన అధికారులు.. తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ రంగంలోకి దిగింది. దగదర్తి విమానాశ్రయ భూముల్లో డ్రోన్ సాయంతో ఓఎల్ఎస్ సర్వే చేసింది. ఈ మేరకు ఈ సర్వే రిపోర్ట్ పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎయిర్పోర్టులపై ఫోకస్ పెట్టింది.. కేంద్రం సాయంతో ఈ పనుల్ని వేగవంతం చేసింది. తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్పోర్ట్కు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ అథారిటీ టీమ్ విమానాశ్రయానికి సంబంధించిన భూముల్లో ఓఎల్ఎస్ సర్వే చేసింది.. ఈ భూముల్ని డ్రోన్ ద్వారా పరిశీలించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ టీమ్ దగదర్తి విమానాశ్రయానికి సంబంధించి.. గతేడాది ఫిబ్రవరిలో భూముల్ని పరిశీలించింది. అయితే ఈ భూములకు సంబంధించి కొన్ని ఇబ్బందుల్ని ఆ టీమ్ గుర్తించింది. అప్పుడే ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్ఫేసెస్ సర్వే (ఓఎల్ఎస్) చేస్తామని తెలిపింది.. ఆ తర్వాత ఓ రిపోర్ట్ ఇస్తామని చెప్పింది. ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి వచ్చిన ఆదేశాలతో డ్రోన్ సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టీమ్కు స్థానికంగా ఉండే అధికారులు అవసరమైన సాయం చేస్తున్నారు. ఈ ఓఎల్ఎస్ సర్వేలో భాగంగా విమానాశ్రయాలు, వాటి పరిసర ప్రాంతాలను పరిశీలిస్తారు. అసలు ఆ ప్రాంతం విమానాల రాకపోకోలకు సురక్షితమేనా, కాదా క్లారిటీకి వస్తారు. ఈ సర్వే తర్వాత.. విమానాశ్రయం భూముల్లో గుర్తించిన అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులు ఓ నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఎయిర్పోర్ట్ అథారిటీ టీమ్ భూముల్ని పరిశీలించడానికి వచ్చిన సమయంలో.. ప్రధానంగా మూడు అంశాలను గుర్తించినట్లు తెలుస్తోంది.
దగదర్తి విమానాశ్రయం ప్రతిపాదించిన ప్రాంతంలో పడమర వైపు కొండ ప్రాంతం ఉంది. అంతేకాదు ఉత్తరం వైపున ఉన్న చెరువుతో పాటుగా భూముల్లోని దగదర్తి- ముంగమూరు కాలువలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మూడు అంశాలు అడ్డంకిగా మారుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకుని.. ప్రస్తుతం సర్వే చేస్తున్న ఎయిర్పోర్ట్ అథారిటీ టీమ్ ఈ మూడు అంశాలను గుర్తించనుంది. అనంతరం ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులకు ఓ రిపోర్ట్ అందజేయనున్నారు.ఈ మూడు సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఓ నిర్ణయానికి వస్తారు. దగదర్తి ఎయిర్పోర్ట్ ను ఎన్నో ఏళ్ల క్రితమే ప్రతిపాదించారు.. కానీ ఆ దిశగా అడుగులుపడలేదు. కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఎయిర్పోర్ట్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.. దగదర్తి ఎయిర్పోర్ట్ కోసం కూడా ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు ఆ కసరత్తు కొనసాగుతోంది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి