నందమూరి బాలకృష్ణ పెద్ద మనసు.. సొంత డబ్బులు రూ.84 లక్షలు ఖర్చు, ప్రజల కోసం – mla nandamuri balakrishna spends rs 84 lakhs own money for water plants to hindupur people
Hindupur Mla Nandamuri Balakrishna Spends Rs 84 Lakhs For People: నందమూరి బాలయ్య ప్రజల కోసం మంచి నమసుతో ఆలోచించారు. ఎమ్మెల్యే కోటాలో నిధులతో పాటుగా సొంత డబ్బులు ఖర్చు చేసి గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. దీని కోసం ఆయన సొంత డబ్బులు రూ.84 లక్షలు ఖర్చు చేశారు. బాలయ్య సహకారంతో ప్రస్తుతం గ్రామాల్లో వాటర్ ప్లాంట్ల ద్వారా తాగునీరు ప్రజలకు అందుతోంది.
హైలైట్:
హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య పెద్ద మనసు
ప్రజల కోసం సొంత డబ్బులు రూ.84 లక్షలు
గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు
బాలయ్య సొంత డబ్బు రూ.84 లక్షలు(ఫోటోలు– Samayam Telugu)
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పెద్ద మనసు చాటుకున్నారు. నియోజకవర్గం పరిధిలో ప్రజల తాగునీటికి ఇబ్బంది లేకుండా కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో నిధులతో పాటుగా సొంత డబ్బులతో నియోజకవర్గం పరిధిలో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలకు మంచినీరు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు సొంత డబ్బు రూ.84 లక్షల వరకు ఖర్చు చేశారట.. గ్రామాలకు శుద్ధజలం అందేలా చూశారు. నందమూరి బాలయ్య హిందూపురం నియోజకవర్గం పరిధిలో తాగునీటి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత బాలయ్య మరిన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యాలు కల్పించడంపై దృష్టిపెట్టారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, కాలనీల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాంట్ కోసం రూ.10 లక్షలు ఖర్చవుతోంది. ఎమ్మెల్యే కోటాలో రూ.6 లక్షలు.. మిగిలిన రూ.4లక్షలు తన సొంత డబ్బులు కేటాయించారు. ఆయా గ్రామాల్లో ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. తాగునీటి కష్టాలు తీరడంతో వారంత ఆనందంగా ఉన్నారు.
2019 నుంచి 2024 మధ్య టీడీపీ అధికారంలో లేదు.. హిందూపురం నుంచి రెండోసారి గెలిచిన ఆ సమయంలో కూడా సేవా కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలు, కాలనీలు, వార్డుల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తన సొంత డబ్బు రూ.10లక్షలు కేటాయించి వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన గ్రామాల్లో రూ.5కే 25 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తున్నారు. గతంలో వీరంతా వ్యవసాయ బోర్ల దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకని తాగేవారు. ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్లు అందుబాటులోకి రావడంతో ఆ సమస్య పరిష్కారం అయ్యింది. వాటర్ ప్లాంట్లు మాత్రమే కాదు.. నందమూరి బాలయ్య హిందూపురంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ స్కూల్స్కు కంప్యూటర్లు అందజేశారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన పరికరాలను కూడా అందజేసిన సంగతి తెలిసిందే.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి