Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

MLA అరవ శ్రీధర్ – వీణ ఎపిసోడ్ లో కీలక పరిణామం

13 February 2026

Botsa Satyanarayana: కూటమి వచ్చాక.. ఒక్క కొత్త పెన్షనూ లేదు

13 February 2026

Hindu Belief: ఇతరుల చెప్పులు, దుస్తులు ధరించడం అరిష్టమా? ఇది తప్పక తెలుసుకోండి..!

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ntr Bharosa Pension Scheme New Applications,ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్లకు దరఖాస్తులు, మంత్రి కీలక ప్రకటన – ap minister kondapalli srinivas respond on ntr bharosa pension scheme new applications
ఆంధ్రప్రదేశ్

Ntr Bharosa Pension Scheme New Applications,ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్లకు దరఖాస్తులు, మంత్రి కీలక ప్రకటన – ap minister kondapalli srinivas respond on ntr bharosa pension scheme new applications

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ntr Bharosa Pension Scheme New Applications,ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్లకు దరఖాస్తులు, మంత్రి కీలక ప్రకటన – ap minister kondapalli srinivas respond on ntr bharosa pension scheme new applications
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Ntr Bharosa New Pensions: ఏపీలో కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే వృద్ధాప్య, వితంతు కొత్త పింఛన్లు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందించామని.. త్వరలోనే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. అప్పుడు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పింఛన్ కూడా తొలగించలేదన్నారు మంత్రి.

హైలైట్:

  • ఏపీలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు
  • మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన
  • ఒక్క పింఛన్ కూడా తొలగించలేదన్నమంత్రి
Ntr Bharosa Pension
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. శాసనమండలి సమావేశంలో పింఛన్ల అంశంపై చర్చ జరిగింది. 2024లో పింఛన్లు పొందుతున్నవారి లబ్ధిదారులు 66.34 లక్షల మంది ఉంటే.. ఇప్పుడు దాదాపుగా 5 లక్షల పింఛన్లు తగ్గించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో ఒక్క పింఛన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన స్పౌజ్ కేటగిరి (భర్త చనిపోయిన భార్యకు) పింఛన్ విధానాన్ని తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని గుర్తు చేశారు. వృద్ధాప్య పింఛను వస్తున్న భర్త చనిపోయిన మరుసటి నెలలోనే భార్యకు పింఛను ఇస్తున్నామన్నారు. మొత్తం 2.5 లక్షల మంది లబ్ధిపొందుతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ 20 నెలల్లో 4.70 లక్షల మంది చనిపోయారని.. వారందరి పింఛన్లు తొలగించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అంతకాదు ఎవరైనా ఒక నెలలో పింఛన్ తీసుకోలేకపోతే.. ఆ మరుసటి నెలలో రెండు నెలలు కలిపి తీసుకునే వెసులుబాటు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 6 అంచెల విధాన (6 స్టెప్‌ వాలిడేషన్‌ )తో పింఛన్లు తొలగించిందన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. 8 లక్షల పింఛన్లను మరోసారి పరిశీలిస్తున్నామన్నారు.

ఇప్పటి వరకు 1.40 లక్షల మంది అనర్హుల్ని గుర్తించి నోటీసులు జారీ చేశామన్నారు. అయినా వారందరికి పింఛన్లు కొనసాగిస్తున్నామన్నారు. మరోసారి పరిశీలన కార్యక్రమం చేపట్టామని. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు కొత్త పింఛన్లు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందించామన్నారు. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు త్వరలోనే అవకాశం కల్పిస్తామన్నారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని భావించింది.. కానీ కొన్ని సమస్యల కారణంగా ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం దివ్యాంగ పింఛన్లలో అనర్హుల ఏరివేతపై ఫోకస్ పెట్టారు.. ఆ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ కూడా పింఛన్ల అంశాన్ని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న వృద్ధులు, వితంతువులకు ఒక్క కొత్త పింఛనైనా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి దీనికి సమాధానం లేదన్నారు. తల్లికి వందనం పథకం కింద రూ.15వేలు ఇప్పటికి కొందరు విద్యార్థులకు అందలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు భారీగా ఉన్నాయన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి