A Low Pressure Likely To Form Over Bay Of Bengal,బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు – rain prediction for andhra pradesh due to a low pressure likely to form over bay of bengal
A Low Pressure likely To Form Over South Bay of Bengal: బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఈ నెలలోనే రెండు అల్పపీడనాలకు అవకాశం ఉంది అంటున్నారు. ఈ ప్రభావంతో దక్షణాది రాష్ట్రాల్లో వర్షాలు పడతాయంటున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా వానలు కురుస్తాయని అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఏపీలో చలి తీవ్రత కొనసాగుతోంది.. మరో రెండు రోజుల్లో తీవ్రత తగ్గుతుందని చెబుతున్నారు.
హైలైట్:
బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలకు ఛాన్స్
ఈ నెలలోనే రెండు ఏర్పడతాయని అంచనాలు
చలి తీవ్రత కూడా రెండు రోజుల్లో తగ్గుతుందట
ఏపీకి రెయిన్ అలర్ట్(ఫోటోలు– Samayam Telugu)
ఈ నెలలో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. వాతావరణ పరిస్థితులు అల్పపీడనాలు ఏర్పడేందుకు అనుకూలంగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఈ నెల 15నాటికి అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఈ నెల 19 తర్వాత ఉపరితల ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తమిళనాడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వానలకు ఛాన్స్ ఉందుంటున్నారు. శని, ఆదివారాల్లో చలి తీవ్రత పెరుగుతుందంటున్నారు.. ఆ తర్వాత చలి తీవ్రత తగ్గిపోతుందంటున్నారు.మరోవైపు ఏపీలో కొన్ని రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో 30 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత తగ్గకముందే ఎండలు మండిపోతున్నాయి. ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో ఏకంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు పెరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత రెండు, మూడు రోజులుగా దక్షిణ కోస్తాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఉత్తర కోస్తాలో అయితే గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు తక్కువ నమోదవుతున్నాయి. అయితే రాత్రిళ్లు మాత్రం చలి తీవ్రత కొనసాగుతోంది. రాత్రి చలి, పగలు ఎండలతో జనాలు అల్లాడిపోతున్నారు.
ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఇంత తీవ్రంగా ఉంటే.. మార్చిలో పరిస్థితి ఎలా ఉంటుందోననే భయం మొదలైంది.. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత పెరుగుతాయా అంటూ చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు.. జనాలు సమ్మర్ హీట్కు రెడీగా ఉండాలేమో..
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి