Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Hindu Philosophy: మనిషి తప్పించుకోలేని మూడు కర్మలు.. వీటి గురించి తెలుసా..?

13 February 2026

Railway Koduru Woman Another Video On Mla Sridhar,జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌ మరో వీడియో.. విడుదల చేసిన రైల్వే కోడూరు మహిళ – railway koduru woman request to janasena party chief pawan kalyan

13 February 2026

మేడం సార్ మేడం అంతే..! కుర్రాళ్లను కవ్విస్తున్న పూజిత పొన్నాడ

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Chinnamandem Tahsildar Narasimhulu Suspended,ఏపీలో తహసీల్దారుపై ప్రభుత్వం వేటు.. 2020లో చేసిన తప్పుకు ఇప్పుడు చర్యలు – andhra pradesh ccla special cs g jayalakshmi issued orders suspending chinnamandem tahsildar narasimhulu
ఆంధ్రప్రదేశ్

Chinnamandem Tahsildar Narasimhulu Suspended,ఏపీలో తహసీల్దారుపై ప్రభుత్వం వేటు.. 2020లో చేసిన తప్పుకు ఇప్పుడు చర్యలు – andhra pradesh ccla special cs g jayalakshmi issued orders suspending chinnamandem tahsildar narasimhulu

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chinnamandem Tahsildar Narasimhulu Suspended,ఏపీలో తహసీల్దారుపై ప్రభుత్వం వేటు.. 2020లో చేసిన తప్పుకు ఇప్పుడు చర్యలు – andhra pradesh ccla special cs g jayalakshmi issued orders suspending chinnamandem tahsildar narasimhulu
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Chinnamandem Tahsildar Suspended: ఏపీ ప్రభుత్వం తసహీల్దారుపై చర్యలు తీసుకుంది. ఏకంగా సీసీఎల్‌ఏ స్పెషల్ సీఎస్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2020లో భూముల వ్యవహారంలో ఆయనపై విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా భూముల్ని మ్యుటేషన్ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారని తేలింది. ఈ క్రమంలో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లకూడాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

హైలైట్:

  • ఏపీలో తహసీల్దారుపై చర్యలు
  • సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
  • 2020లో భూముల మ్యుటేషన్
Chinnamandem Tahsildar
చిన్నమండెం తహసీల్దారు సస్పెండ్(ఫోటోలు– Samayam Telugu)
అన్నమయ్య జిల్లా చిన్నమండెం తహసీల్దార్‌పై వేటు పడింది.. భూముల మ్యుటషన్‌కు సంబంధించి నిబంధనల్ని ఉల్లంఘించారని తేలడంతో చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు తహసీల్దార్ నరసింహులును సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పెషల్‌ సీఎస్‌ (సీసీఎల్‌ఏ) జి జయలక్ష్మి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నరసింహులు 2020లో సంబేపల్లె తహసీల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ నేతల కుటుంబ సభ్యుల పేరుతో గయాళి భూములను మ్యుటేషన్‌ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దేవపట్లలో 30 ఎకరాల భూములను ఎలాంటి ఆధారం లేకుండానే అసైన్‌మెంట్, డీకేటీ, రైతువారీ పట్టాగా మ్యుటేషన్‌ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. ఈ 30 ఎకరాల భూములు సర్వే నంబరు 1253, 1254, 1256, 1257లో ఉన్నాయి. స్థానికుల ఈ భూముల అంశంపై ఫిర్యాదు చేయడంతో.. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ తహసీల్దార్ పాత్రపై సమగ్రంగా విచారణ జరిపారు. ఈ మేరకు సీసీఎల్‌ఏకి నివేదికను కూడా అందజేశారు. తహసీల్దారు నరసింహులు నిబంధనలు, రెవెన్యూ చట్టాన్ని అతిక్రమించి మ్యుటేషన్లు చేశారని తేలింది. దీంతో తాజాగా ఆయన్ను సస్పెండ్‌ చేశారు.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ వదిలి ఎక్కడికీ వెళ్లకూడదని ఉత్తర్వుల్లో తెలిపారు. తహసీల్దారును సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రస్తుతం చిన్నమండెం తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్నారు. 2020లో జరిగిన భూములకు సంబంధించిన వ్యవహరాల్లో ఆయన్ను ఇప్పుడు సస్పెండ్ చేశారు.

33 లక్షలిస్తే అకౌంట్లోకి రూ.50 లక్షలు.. అడగ్గానే డబ్బులు వెనక్కి ఇచ్చేశారు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్..

మరోవైపు కడప జిల్లా సిద్దవటం మండలం పెద్దపల్లెలో భూ కబ్జాలు, వివాదాలు పెరిగాయనే విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఖాళీ స్థలాలు కనిపస్తే చాలు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాలు, ఆక్రమణలు చేస్తున్నారు. సిద్దవటం మండలం ఉప్పరపల్లెలో సోమశిల నిర్వాసితులు పునరావాసం ఏర్పాటు చేసుకున్నారు. అయతే అక్కడ చాలా ఏళ్లుగా స్థలాలు ఖాళీగా ఉండటంతో.. కొందరు దౌర్జన్యంగా ప్రవేశించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే నిర్వాసితులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. అయితే ఈ అంశంపై తహసీల్దారు స్పందించారు. అధికారుల్ని పంపించి పరీశీలించి.. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి