Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Science Secrets: ఈ పండు మనిషి మాంసాన్ని తినేయగలదు! ఈ జ్యుసీ ఫ్రూట్ వెనుక ఉన్న షాకింగ్ ఫాక్ట్ ఇదే!

13 February 2026

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు స్టెప్పులు అదరగొట్టేశాడుగా..

13 February 2026

ఆ డైరెక్టర్ పని రాక్షసుడు.. సినిమా అంటే పిచ్చి.. మహేష్ ప్రాణాలతోనే రిస్క్ చేశాడు.. సినిమాటోగ్రాఫర్ కామెంట్స్..

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vizag Pocso Court Teacher To 20 Years,ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకుని.. ఆరేళ్లు కాపురం.. 20 ఏళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు – pocso court sentences a man to 20 years in prison for subjugating girl in visakhapatnam
ఆంధ్రప్రదేశ్

Vizag Pocso Court Teacher To 20 Years,ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకుని.. ఆరేళ్లు కాపురం.. 20 ఏళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు – pocso court sentences a man to 20 years in prison for subjugating girl in visakhapatnam

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vizag Pocso Court Teacher To 20 Years,ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకుని.. ఆరేళ్లు కాపురం.. 20 ఏళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు – pocso court sentences a man to 20 years in prison for subjugating girl in visakhapatnam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకున్న ఓ ఉపాధ్యాయుడికి విశాఖ పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. 2015లో ఈ ఘటన జరిగింది. అప్పట్లో బాలికతో కలిసి రాజస్థాన్ వెళ్లిపోయిన తిరుపతిరావును.. 2021లో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికి వీరికి ఇద్దరు పిల్లలు. ఈ కేసును విచారించిన పోక్సో న్యాయస్థానం నేరం రుజువు కావటంతో తిరుపతిరావుకు జైలు శిక్షతో పాటుగా 71 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చింది.

Visakhapatnam
విశాఖపట్నం పోక్సో కోర్టు ఉపాధ్యాయుడు(ఫోటోలు– Samayam Telugu)
ఆయనది పవిత్రమైన, బాధ్యతాయుతమైన వృత్తి. తరగతి గదిలో రేపటి సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయ జీవితం. పిల్లలకు పాఠాలు బోధిస్తూ, మంచీ చెడ్డలు నేర్పాల్సిన మాస్టారు తను. కానీ అతని బుద్ధి పెడదోవ పట్టింది. సభ్య సమాజం తలదించుకునే ఘటనకు పాల్పడేలా పురిగొల్పింది. చివరకు మాస్టారుగా సంఘంలో గౌరవప్రదమైన జీవితం గడపాల్సిన అతను.. కారాగారంలో, నాలుగు గోడల మధ్య ఊచలు లెక్కపెట్టాల్సి వస్తోంది. విశాఖపట్నం పోక్సో కోర్టు అతనికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటుగా 71 వేల రూపాయలు జరిమానా విధించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

శ్రీకాకుళం జిల్లా, హిరమండలంలోని కొల్లివలసకు చెందిన తిరుపతిరావు.. చోడవరంలోని ఓ స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. తిరుపతిరావుకు అప్పటికే పెళ్లైంది. అయితే తాను పనిచేసే స్కూలు ఉండే ప్రాంతంలో ఓ ఎనిమిదో తరగతి బాలికతో తిరుపతిరావు పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో ఆమెను మభ్యపెట్టాడు. ఇంటి నుంచి 5 తులాల బంగారం, 50 వేలు నగదు తెప్పించేలా ఆమెను పురిగొల్పాడు. డబ్బూ, నగలు తీసుకుని రాగానే 2015 మే 25వ తేదీ.. అంటే సుమారుగా పదేళ్ల కిందట బాలికను తీసుకుని తిరుపతిరావు రాజస్థాన్ వెళ్లిపోయారు.

అయితే కూతురు కనిపించకపోవటంతో ఆ బాలిక తల్లిదండ్రులు కంగారుపడిపోయారు. చుట్టుపక్కల తెలిసిన ప్రాంతాలన్నీ గాలించారు. ఎక్కడా జాడ తెలియకపోవటంతో.. చివరకు చోడవరం పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ చోడవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే 2021లో తిరుపతిరావు, బాలిక రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తి్ంచారు. రాజస్థాన్‌లో తిరుపతిరావును అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఆరేళ్లపాటు పోలీసులకు చిక్కకుండా రాజస్థాన్‌లో బాలికతో పాటు ఉండిపోయారు తిరుపతిరావు. ఈ క్రమంలోనే వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. తిరుపతిరావు, బాలిక, ఇద్దరు పిల్లలను 2021లో పోలీసులు విశాఖపట్నం తీసుకువచ్చారు. కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ కేసు పూర్వాపరాలు విచారించిన విశాఖపట్నం పోక్సో కోర్టు నేరం రుజువు కావటంతో తిరుపతిరావుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 71 వేలు జరిమానా విధిస్తూ విశాఖ పోక్సో న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. జరిమానాలో రూ. 70 వేలు బాధితురాలికి పరిహారంగా అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి