Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

New Banking Rules: మారిన బ్యాంకింగ్ రూల్స్.. ఆర్బీఐ సంచలన నిర్ణయం.. 7 గంటల తర్వాత ఇవన్నీ బంద్..

13 February 2026

Allu Sirish: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. సంప్రదాయ బద్ధంగా అల్లు శిరీష్ హల్దీ వేడుక.. వీడియో ఇదిగో

13 February 2026

Actress : చీరకట్టులో స్టన్నింగ్ ఫోజులతో గ్లామర్ బ్యూటీ.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్.. ఎవరంటే..

13 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Dubby Dry Chillies Price,ఈ రైతు పంట పండింది.. క్వింటాల్ మిరప రూ.87,786.. సన్మానం చేసిన అధికారులు – anantapur farmer gets record price for dubby dry chillies in byadagi agricultural market
ఆంధ్రప్రదేశ్

Dubby Dry Chillies Price,ఈ రైతు పంట పండింది.. క్వింటాల్ మిరప రూ.87,786.. సన్మానం చేసిన అధికారులు – anantapur farmer gets record price for dubby dry chillies in byadagi agricultural market

.By .13 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Dubby Dry Chillies Price,ఈ రైతు పంట పండింది.. క్వింటాల్ మిరప రూ.87,786.. సన్మానం చేసిన అధికారులు – anantapur farmer gets record price for dubby dry chillies in byadagi agricultural market
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అనంతపురం జిల్లాలో ఓ మిరప రైతు పంట పండింది. వడ్రవన్నూరుకు చెందిన తిప్పేస్వామి అనే మిరప రైతు డబ్బీ డ్రై మిరపను పండించారు. ఈ మిరప పంటను కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్ తరలించగా.. మార్కెట్లో గురువారం రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ మిర్చి ఏకంగా రూ.87,786 పలికింది. దీంతో రైతును మార్కెట్ అధికారులు, వ్యాపారులు, తోటి రైతులు సన్మానించారు. పూలమాలలు వేసి, స్వీట్లు తినిపించారు.

Dubby Dry Chillies
డబ్బీ డ్రై మిరపకు రికార్డు ధర,(ఫోటోలు– Samayam Telugu)
అనంతపురం జిల్లాకు చెందిన ఓ మిరప రైతు పంట పండింది. రాయదుర్గం మండలంలోని వడ్రవన్నూరుకు చెందిన తిప్పేస్వామి అనే రైతు పండించిన మిరపకు రికార్డు ధర లభించింది. తిప్పేస్వామి పండించిన డబ్బీ డ్రై మిరప.. రికార్డు స్థాయిలో క్వింటాల్‌ ధర రూ.87,786 పలికింది. కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఉన్న బ్యాడిగి వ్యవసాయ మార్కెట్‌లో తిప్పేస్వామి పండించిన డబ్బీ డ్రై మిరపకాయలు .. ఈ రికార్డు ధర పలికాయి. దీంతో తోటి రైతులు, మార్కెట్‌ అధికారులు, వ్యాపారులు తిప్పేస్వామికి సన్మానం చేశారు. నాణ్యమైన మిరప పండించారంటూ పూలమాలలు వేసి, స్వీట్లు తినిపించారు. వడ్రవన్నూరు రైతులు సుమారు 2 టన్నుల మిరపను బ్యాడిగి మార్కెట్‌కు తరలించారు. మంచి ధర పలకటంతో మిరప రైతులు సంబరాలు చేసుకున్నారు.

*సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోవా బన్ అంశం.. వ్యాపారికి మద్దతుగా పొలిటికల్ లీడర్లు..

మరోవైపు గత రెండేళ్లుగా మిరప రేట్లు చతికిలపడ్డాయి. ఇటీవల మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో మిరప రైతులు సంతోషంలో ఉన్నారు. మిరపలో రకాన్ని అనుసరించి రెండేళ్లతో పోలిస్తే ఈ సారి నాణ్యత ప్రకారం ఒక్కో రకం మిరప రూ.7000 నుంచి రూ.8000 వరకూ పెరిగింది. దీంతో రైతులు ఆశగా ఉన్నారు. మిర్చి ధరలు నేలచూపులు చూడటంతో రెండు ఏళ్లుగా రైతులు నష్టపోయారు. దీంతో ఈసారి మిరప సాగుకు చాలా మంది రైతులు ఆసక్తి చూపించలేదు. దీంతో ఉత్పత్తి తగ్గింది. దీనికి తోడు మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌‌లలోనూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. దీంతో మిరప పంట దిగుబడి మరింత తగ్గింది. దీంతో ఈసారి మిరపకు డిమాండ్ పెరుగుతుందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.

*అరుణాచలం తరహాలో అక్కడా ప్రతి నెల గిరి ప్రదక్షిణ.!

డబ్బీ డ్రై మిరపకాయలకు ఎందుకింత డిమాండ్..

మరోవైపు డబ్బీ డ్రై మిరపకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని కర్ణాటకలోని బ్యాతగిరి ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. నాణ్యమైన, మంచి రంగును కలిగి ఉంటాయి. తక్కువ కారం, ఎక్కువ సువాసన ఉండటంతో డబ్బీ డ్రై మిరపకాయలకు డిమాండ్ ఎక్కువ. డబ్బీ డ్రై మిరపకాయల పొడిని సాంబార్, పచ్చళ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వీటిలో కూడా ఏ, ఏప్లస్ గ్రేడ్ అనే రెండు రకాలు ఉంటాయి. సాంబార్, మసాలా పొడులు, చట్నీలలో ఎక్కువగా ఈ మిరపకాయల పొడిని ఉపయోగిస్తుంటారు. సాధారణ మిరపకాయలతో పోలిస్తే ముదురు ఎరుపు రంగంలో కాస్త లావుగా ఉండటంతో పాటుగా డబ్బా ఆకారంలో ఉండటంతో వీటికి ఆ పేరు వచ్చింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి