Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

విశ్వంభరలో ఆ సీక్వెన్స్.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే!

15 February 2026

సినిమా సెట్‌లో ఆ హీరోని నిజంగానే కొట్టా..! షాకింగ్ విషయం చెప్పిన నటుడు

15 February 2026

ఐఎమ్‌డీబీలో 9.4 రేటింగ్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న లవ్ స్టోరీ.. క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్

15 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Bill Gates Ap Visit,Bill Gates in AP: రేపు (ఫిబ్రవరి 16) ఏపీకి బిల్ గేట్స్.. ఆ ప్రాజెక్టుపైనా ప్రధానంగా చర్చ.. – microsoft cofounder bill gates will visit andhra pradesh on february 16 and review sanjeevani project
ఆంధ్రప్రదేశ్

Bill Gates Ap Visit,Bill Gates in AP: రేపు (ఫిబ్రవరి 16) ఏపీకి బిల్ గేట్స్.. ఆ ప్రాజెక్టుపైనా ప్రధానంగా చర్చ.. – microsoft cofounder bill gates will visit andhra pradesh on february 16 and review sanjeevani project

.By .15 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Bill Gates Ap Visit,Bill Gates in AP: రేపు (ఫిబ్రవరి 16) ఏపీకి బిల్ గేట్స్.. ఆ ప్రాజెక్టుపైనా ప్రధానంగా చర్చ.. – microsoft cofounder bill gates will visit andhra pradesh on february 16 and review sanjeevani project
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్.. బిల్ గేట్స్ బృందంతో భేటీ కానున్నారు. ఈ భేటీలో సంజీవని ప్రాజెక్టు గురించి ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది. సంజీవని ప్రాజెక్టును.. ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ సహకారం చేపడుతోంది. ఈ నేపథ్యంలో సంజీవని ప్రాజెక్టుతో పాటుగా ఇతర అంశాలపైనా బిల్ గేట్స్ బృందం.. ఏపీ ప్రభుత్వంతో చర్చించనున్నట్లు సమాచారం.

Bill gates
ఆంధ్రప్రదేశ్ బిల్ గేట్స్ పర్యటన(ఫోటోలు– Samayam Telugu)
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ ఛైర్మన్ బిల్‌ గేట్స్ రేపు ( ఫిబ్రవరి 16) ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ పరస్పర సహకారం చేపట్టిన ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అలాగే మరిన్ని అంశాలపై పరస్పర సహకారం విస్తరించుకునే విషయాలపై చర్చిస్తారు. ఏపీ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లతో భేటీ కానున్నారు. ఏపీ ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ సహకారం సంజీవని ప్రాజెక్టు చేపడుతోంది. ఈ అంశం మీద ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో టెక్నాలజీ ఆధారిత డయాగ్నస్టిక్ సేవలు, మెడ్ టెక్ కార్యక్రమాలపైనా చర్చించనున్నట్లు తెలిసింది.

మరోవైపు బిల్ గేట్స్ ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ స్టేట్ సెంటర్ కూడా సందర్శిస్తారు, పాలనలో టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారనే అంశాన్ని పరిశీలిస్తారు. ఈ సందర్భంగా రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్స్ పనితీరు, డేటా డ్రైవన్ మానిటరింగ్ మెకానిజం గురించి చంద్రబాబు, ఇతర అధికారులు బిల్ గేట్స్‌కు వివరిస్తారు. అనంతరం స్వర్ణాంధ్ర విజన్ 2047 సంస్కరణపైనా చర్చిస్తారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కింద ప్రజారోగ్యం, వ్యవసాయ రంగం, విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణల గురించి బిల్ గేట్స్‌కు వివరిస్తారు. అనంతరం ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని కూడా బిల్ గేట్స్ బృందం పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా వ్యవసాయంలో డ్రోన్స్ వినియోగం, ఏఐ పరికరాల ఉపయోగాన్ని పరిశీలించనున్నట్లు తెలిసింది.

ఏంటీ సంజీవని ప్రాజెక్టు..

ఆరోగ్య రంగంలో విప్లవాత్మక సంస్కరణగా ఏపీ ప్రభుత్వం సంజీవని పథకాన్ని రూపొందించింది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, మాతా శిశుసంరక్షణ, వ్యాక్సినేషన్ వంటి సేవలు అందించే ఆలోచనలో ఉన్నారు. సంజీవని ప్రాజెక్టు కింద డిజిటల్ హెల్త్ కార్డుల జారీ ఉంటుంది. ఈ డిజిటల్ హెల్త్ కార్డులలో పౌరులకు సంబంధించిన వైద్యపరీక్షలు, చికిత్సల వివరాలతో పాటుగా, డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్లు, ల్యాబ్ నివేదికలు, వ్యాక్సినేషన్ వివరాలు నమోదవుతాయి. అలాగే రెండున్నర లక్షల వరకూ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో సంజీవని ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అక్కడ సత్ఫలితాలు రావటంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి