Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Curry Leaves: సామాన్యులకు మరో షాక్.. పెరిగిన కరివేపాకు ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?

16 February 2026

Baba Vanga: ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుందో తెలుసా..? డేట్ చెప్పేసిన బాబా వంగా..!

16 February 2026

మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా..? ఈ తప్పు చేశారంటే డబ్బు రావడం కాదు.. ఉన్నది కూడా పోతుంది!

16 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Kalisetti Appalanaidu Chennai Padma,చెన్నై పద్మది గొప్ప మనసు.. రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్తా: టీడీపీ ఎంపీ – vizianagaram mp kalisetty appalanaidu says he will soon take chennai based sanitation worker padma to president draupadi murmu
ఆంధ్రప్రదేశ్

Kalisetti Appalanaidu Chennai Padma,చెన్నై పద్మది గొప్ప మనసు.. రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్తా: టీడీపీ ఎంపీ – vizianagaram mp kalisetty appalanaidu says he will soon take chennai based sanitation worker padma to president draupadi murmu

.By .16 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kalisetti Appalanaidu Chennai Padma,చెన్నై పద్మది గొప్ప మనసు.. రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్తా: టీడీపీ ఎంపీ – vizianagaram mp kalisetty appalanaidu says he will soon take chennai based sanitation worker padma to president draupadi murmu
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Vizianagaram TDP MP Kalisetti Appalanaidu On Chennai Sanitation Worker Padama: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెన్నైకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరకు తీసుకెళ్తానన్నారు. పద్మకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలంటూ ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు. అంతేకాదు ఇటీవల పద్మతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.. ఆమె నిజాయితీని అభినందించారు. ఆమెకు ఇటీవల ఓ బంగారం ఉన్న బ్యాగ్ దొరికింది.. ఆమె ఆ బ్యాగ్‌ను జాగ్రత్తగా యజమానికి అందేలా చూశారు.

హైలైట్:

  • విజయనగరం ఎంపీ అప్పల నాయుడు కామెంట్స్
  • చెన్నై పద్మను రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళుతా
  • ఆమె నిజాయితీకి జాతీయ అవార్డు కూడా ఇవ్వాలి
Chennai Sanitation Worker Padma
చెన్నై పారిశుద్ధ్య కార్మికురాలు పద్మ(ఫోటోలు– Samayam Telugu)
చెన్నైకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళతానన్నారు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు . తమిళనాడు రాజధాని చెన్నైలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న పద్మకు గత నెలలో రూ.45 లక్షల విలువ చేసే బంగారం ఉన్న బ్యాగు దొరికింది. ఆమె బంగారాన్ని చూసి షాకయ్యారు.. వెంటనే నిజాయితీగా ఆ బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది.. ఆ తర్వాత యజమానికి అప్పగించారు. పద్మ నిజాయితీని అందరూ మెచ్చుకున్నారు. పద్మను సీఎం స్టాలిన్, చెన్నై మేయర్, నటుడు రజినీకాంత్ ఘనంగా సత్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. పద్మకు జాతీయస్థాయిలో గుర్తింపు ఇవ్వాలని రాష్ట్రపతిని కోరారు. ఆమె నిజాయితీకి కేంద్రం ఏదైనా ప్రత్యేక అవార్డుకు సిఫార్స్ చేయాలని కోరారు. అంతేకాదు తాను పద్మను త్వరలోనే రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళతానని కూడా చెప్పారు. అంతేకాదు అప్పలనాయుడు ఇటీవల పద్మతో స్వయంగా వీడియో కాల్‌లో మాట్లాడారు. ‘చెత్తలో దొరికిన సుమారు 20 సవర్ల బంగారం, కిలో వెండి నగలను క్షణం ఆలస్యం చేయకుండా పోలీసులకు అప్పగించిన శుభ్రత కార్మికుడు శ్రీ దురై గారి నిజాయితీ నిజంగా అభినందనీయం. సమాజంలో ఇంకా విలువలు, నీతి జీవిస్తున్నాయనే గొప్ప సందేశాన్ని ఆయన ఇచ్చారు. ఈ ప్రేరణాత్మక ఘటనపై వెంటనే గౌరవ ప్రధానమంత్రి గారికి లేఖ రాసి, శ్రీ దురై గారి నిజాయితీకి తగిన గుర్తింపు ఇవ్వాలని, అవసరమైతే వైద్య సహాయం మరియు ఆర్థిక పరమైన మద్దతు అందించాలని వినతిపత్రం పంపించాను. నిజాయితీగా పనిచేసే ప్రతి సాధారణ పౌరుడి వెనుక ప్రభుత్వం నిలబడాలి అనే నా నమ్మకం. శ్రీ దురై గారి వంటి వ్యక్తులు మన దేశ గర్వకారణం’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు.

‘కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే విజన్ డాక్యుమెంట్. రైతులకు అండగా వ్యవసాయం, సాగునీటి రంగాలకు పెద్దపీట వేసిందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించింది. విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి రంగాల్లో స్పష్టమైన ప్రణాళికలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే బడ్జెట్ ఇదే’ అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రశంసించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి