Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆదివాసీల అమృతం.. ఇప్పపువ్వు లడ్డూ ఇంట్లో ఎలా చేయాలంటే?

16 February 2026

IND vs PAK: వచ్చాడయ్యా పెద్ద పోటుగాడు..! ఆఫ్రిదికి అధికారం ఉంటేనట..

16 February 2026

Omelet Recipe: రొటీన్ ఆమ్లెట్ బోర్‌ కొడుతుందా.. ఇలా ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ ఇదే తింటారు?

16 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Srikalahasti Women Devotee Death,శ్రీకాళహస్తి ఆలయంలో మహిళ మృతి.. ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ.. అసలేం జరిగిందంటే? – ap government fact checking department clarity on woman death in srikalahasti temple
ఆంధ్రప్రదేశ్

Srikalahasti Women Devotee Death,శ్రీకాళహస్తి ఆలయంలో మహిళ మృతి.. ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ.. అసలేం జరిగిందంటే? – ap government fact checking department clarity on woman death in srikalahasti temple

.By .16 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో ఓ మహిళ చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఆలయ క్యూలైన్‌లో వేచి ఉండి అస్వస్థతకు గురై మణెమ్మ అనే మహిళ చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం స్పందించింది. అసలు ఏం జరిగిందనే దానిపై క్లారిటీ ఇచ్చింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనలో 108 సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం లేదని తెలిపింది.

Srikalahasti
శ్రీకాళహస్తి ఆలయంలో మహిళ మృతి.. ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ.(ఫోటోలు– Samayam Telugu)
శ్రీకాళహస్తి ఆలయంలో అస్వస్థతకు గురై ఓ భక్తురాలు మరణించారనే వార్తలపై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. అసలు ఏం జరిగిందనే దానిపై వివరాలు వెల్లడించింది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి ఆలయానికి సైతం భక్తులు తరలి వచ్చారు. అయితే శ్రీకాళహస్తి ఆలయం క్యూలైన్‌లో ఎక్కువసేపు వేచి ఉండటంతో ఓ భక్తురాలు అస్వస్థతకు గురయ్యారని.. సమాచారం అందించినప్పటికీ సకాలంలో అంబులెన్స్ రాకపోవటంతో మహిళ చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు జరిగిన సంగతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేసింది.

“మహా శివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలోని క్యూలైన్‌లో దర్శనం కోసం ఎక్కువ సేపు వేచి ఉండటంతో, ఒక మహిళ అస్వస్థతకు గురయ్యారని.. 108 సకాలంలో రాకపోవటంతో ఆ మహిళ చనిపోయారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి.. ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం వద్ద ఒక మహిళ అచేతనంగా పడిపోయి ఉన్నారని సమాచారం అందింది. దీంతో డ్యూటీ డాక్టర్ తక్షణమే అక్కడకు చేరుకుని ఆ మహిళకు సీపీఆర్ చేశారు. అయితే ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో 108లో మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో సత్వర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.” అని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం వెల్లడించింది.

చనిపోయిన మహిళను తిరుపతి జిల్లా చిట్టమూరుకు చెందిన కన్నెబోయిన మణెమ్మ w/o రాజేంద్రగా గుర్తించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి వైద్యుల నిర్లక్ష్యం, 108 సిబ్బంది నిర్లక్ష్యం లేదని ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం క్లారిటీ ఇచ్చింది. దేవాలయం వద్ద క్యూలైన్‌లో వేచి ఉండే సామాన్య భక్తులకు 30 నిమిషాలలోనే దర్శనం చేసుకొనే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారని వివరించింది. భక్తులను భయభ్రాంతులకు గురిచేసేలా తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని.. అలాంటి వాటిని నమ్మవద్దని ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం విజ్ఞప్తి చేసింది. మరోవైపు శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. అభిషేకాలు, అర్చనలతో శివాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి