Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

లక్షల కోట్లకు అధిపతి అయిన ఎలాన్‌ మస్క్‌ చేతిలో ఎంత నగదు ఉందో తెలుసా? షాక్‌ అయ్యే విషయం!

17 February 2026

Vijay- Rashmika: విజయ్-రష్మికల పెళ్లి వేడుక! ముఖ్య అతిథులు వీరే! స్పెషల్ అట్రాక్షన్‌గా ఆ స్టార్ సెలబ్రిటీ

17 February 2026

Banana Side Effects: అరటిపండు అమృతం కాదు.. కొంపముంచే విషం! ఎప్పుడు తింటే ప్రాణాంతకమో తెలుసా?

17 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Annamayya Girl Rape And Murder,మదనపల్లె బాలిక కేసు: చిన్నారిపై అఘాయిత్యం.. నీటి డ్రమ్ములో ముంచి హత్య.. డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడి.. – dig koya praveen on madanapalle seven years girl murder case in annamaiya district
ఆంధ్రప్రదేశ్

Annamayya Girl Rape And Murder,మదనపల్లె బాలిక కేసు: చిన్నారిపై అఘాయిత్యం.. నీటి డ్రమ్ములో ముంచి హత్య.. డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడి.. – dig koya praveen on madanapalle seven years girl murder case in annamaiya district

.By .17 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Annamayya Girl Rape And Murder,మదనపల్లె బాలిక కేసు: చిన్నారిపై అఘాయిత్యం.. నీటి డ్రమ్ములో ముంచి హత్య.. డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడి.. – dig koya praveen on madanapalle seven years girl murder case in annamaiya district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అన్నమయ్య జిల్లా మదనపల్లె బాలిక హత్య కేసులో డీఐజీ కోయ ప్రవీణ్ కీలక వివరాలు వెల్లడించారు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. అనంతరం విలేకర్లతో మాట్లాడిన కోయ ప్రవీణ్.. బాలికపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. నీటిలో ముంచడం వల్లనే చనిపోయినట్లు తెలిసిందని వివరించారు. నిందితుడు పరారీలో ఉన్నాడని.. వీలైనంత త్వరగా పట్టుకుంటామన్నారు. కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

koya praveen
మదనపల్లె బాలిక హత్య కేసు(ఫోటోలు– Samayam Telugu)
అన్నమయ్య జిల్లా మదనపల్లె ఏడేళ్ల బాలిక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆగంతకుడు బాలికను అతిదారుణంగా లైంగికంగా వేధించి.. వాటర్ డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. అత్యాచారం చేసి, నీళ్ల డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైనట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరగా నిందితుణ్ని అదుపులోకి తీసుకుని.. కోర్టు ద్వారా కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిందితుడి మీద గతంలోనూ కేసు ఉన్నట్లు, లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నట్లు డీఐజీ తెలిపారు. పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

మరోవైపు మదనపల్లె బాలిక కేసుపై సీఎం చంద్రబాబు కూడా స్పందించిన సంగతి తెలిసిందే. బాలిక తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు.. వారికి ధైర్యం చెప్పారు. కారకులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా చిన్నారి తల్లిదండ్రులను ఫోన్‌లో పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని.. కారణమైన వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. న్యాయం చేస్తామని బాలిక కుటుంబానికి తెలిపారు.

కనిపించకుండాపోయిన బాలిక పొరుగింటి డ్రమ్ములో.. సైకో యువకుడు అలా ఎందుకు చేశాడు?

మహిళా మంత్రులు తీవ్ర ఆగ్రహం

మరోవైపు ఈ ఘటనపై మంత్రి సంధ్యారాణి కూడా స్పందించారు. ఇది సాధారణ నేరం కాదన్న మంత్రి సంధ్యారాణి.. చిన్నారిపై జరిగిన దాడి, సమాజ గౌరవంపై జరిగిన దాడి అని అన్నారు దోషులు ఎవరైనా, ఎంతటి వారైనా కఠిన శిక్ష అనుభవించక తప్పదని.. మహిళలు, బాలికల భద్రతపై రాజీ పడబోమని అన్నారు. మదనపల్లె బాలిక హత్య కేసులో సమాజానికి గట్టి సందేశం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. మరోవైపు ఏడేళ్ల బాలిక సోమవారం అదృశ్యం కాగా.. ఎదురుగా ఉండే కులవర్ధన్‌ అనే వ్యక్తి ఇంట్లో మృతదేహం గుర్తించారు. బాలికపై అత్యాచారం జరిగిందని.. ఆపై హత్య చేసినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి