22 ఏళ్లకే అకాల మరణం పాలైన నటి ప్రత్యూష కేసు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా మిగిలింది. అందమైన నవ్వు, చక్కని నటనతో తెలుగు, తమిళ చిత్రసీమల్లో బిజీగా ఉన్న ప్రత్యూష, 2002లో సిద్ధార్థ్ రెడ్డితో కలిసి ఆసుపత్రి పాలైంది. సిద్ధార్థ్ రెడ్డి కోలుకోగా, ప్రత్యూష మరణించింది. ఇది ఆత్మహత్యాయత్నమా, మరేదైనా జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె తల్లి సరోజినీ రెడ్డి 23 ఏళ్లుగా తన కూతురికి న్యాయం జరగాలని పోరాడుతున్నారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశారని సరోజినీ రెడ్డి ఆరోపిస్తున్నారు. రాజకీయ నేతల ప్రమేయంతో కేసును తొక్కిపెట్టారనే వాదనలు కూడా ఉన్నాయి. ప్రత్యూష మరణం వెనుక ఉన్న అసలు నిజాలు వెలుగులోకి రావాలని ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉనికిలో లేని కేసులా? AI మాయాజాలంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. హైవే పై ఎగసిపడిన అగ్నికీలలు
CM Revanth Reddy: అధికారుల పనితీరుపై రేవంత్ రెడ్డి సీరియస్! క్లాస్ పీకిన సీఏం
ప్రాణం తీసిన గ్రైండర్.. ఈ తప్పులు అస్సలు చేయకండి
Banana: బనానా షేక్ మంచిదా.. అరటి పండ్లు బెస్టా.. నిపుణులేమంటున్నారు ??

