Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Ap Birth Death Registration Rules 2026,ఏపీలో కొత్త నిబంధన అమలు.. 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి, వివరాలివే – andhra pradesh government new rules for birth and death certificate registration

18 February 2026

PAK vs NAM: వర్షం కారణంగా పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయితే.. సూపర్ 8 చేరే జట్టు ఏది?

18 February 2026

Snake v/s Mongoose: నాగుపాము కాటు కూడా పనికిరాదు! ఈ జీవి DNAలో దాగిన రహస్యం బయటపడింది..? తెలిస్తే..

18 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Madanapalle Girl Murder Case Accused Suicide,మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు ఆత్యహత్య.. చెరువులో మృతదేహం – madanapalle 7 years girl murder case accused dead body found in a pond
ఆంధ్రప్రదేశ్

Madanapalle Girl Murder Case Accused Suicide,మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు ఆత్యహత్య.. చెరువులో మృతదేహం – madanapalle 7 years girl murder case accused dead body found in a pond

.By .18 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Madanapalle Girl Murder Case Accused Suicide,మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు ఆత్యహత్య.. చెరువులో మృతదేహం – madanapalle 7 years girl murder case accused dead body found in a pond
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Madanapalle Girl Murder Case Accused Died In Pond: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల బాలికను హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని కురబాలకోట మండలం కనసానివారిపల్లి చెరువులో గుర్తించారు. ముదివేడు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కులవర్ధన్ నిన్నటి నుంచి పరారీలో ఉన్నాడు.. చివరికి శవమై తేలాడు.

హైలైట్:

  • మదనపల్లె బాలిక హత్యకేసు నిందితుడి ఆత్మహత్య
  • చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్న కులవర్ధన్
  • కనసానివారిపల్లి చెరువులో నిందితుడి మృతదేహం
Madanapalle Girl Murder Case
మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతి(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కురబల కోట మండలం కనసానివారిపల్లి దగ్గర చెరువులో నిందితుడి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలిక కనిపించకుండా పోయింది. పోలీసులు పాప కోసం మూడు రోజులుగా గాలిస్తుండగా.. పొరుగింట్లోనే చిన్నారి మృతదేహం లభించడం కలకలం రేపింది. బాలికను దారుణంగా చంపి డ్రమ్ములో దాచాడు పొరుగింటి యువకుడు. బాలికకు మాయమాటలు చెప్పి, చాక్లెట్ ఆశజూపి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. మదనపల్లి పట్టణ శివార్లలోని నీరుగట్టువారిపల్లిలోని కాట్లాటపల్లి రోడ్డులో నివసిస్తున్న దంపతుల ఏడేళ్ల కుమార్తె సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయింది. చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు బాలిక కనిపించకుండా పోయిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే నివసించే కులవర్దన్ అనే యువకుడు బాలికను తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. బాలికను గొంతు నులుమి హత్య చేసి.. మృతదేహాన్ని డ్రమ్‌లో కుక్కాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నారు. నిందితుడు గతంలోనూ ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు అంటున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రుల కన్నీరుమున్నీరయ్యారు.

కులవర్ధన్ తల్లితో కలిసి ఆ ఇంట్లో నివాసం ఉంటున్నాడు.. ఆమె ఓ స్కూల్‌లో ఆయాగా పనిచేస్తున్నారు. కులవర్ధన్ ఖాళీగా ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. అతడికి గంజాయి, మద్యం అలవాట్లు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అతడు ఒకరిపై కొడవలి తీసుకుని దాడి చేయగా.. కేసు కూడా నమోదైంది. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేశారు. కులవర్ధన్ బాధిత మహిళల్ని బెదిరించడంతో వారు కేసులు వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పలు సందర్భాల్లో అతడిని పోలీసులు హెచ్చరించారు. కులవర్ధన్ ఇంటి దగ్గర స్థానికులు ఆందోళనకు దిగారు.. అతడ్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.. అయితే పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు. .

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు.. వెంటనే నిందితుడ్ని పట్టుకోవాలని పోలీసులకు ఆదేశించారు. అలాగే బాలిక తండ్రితో హోంమంత్రి వంగలపూడి అనిత ఫోన్‌లో మాట్లాడారు. అలాగే రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ మదనపల్లెకి స్వయంగా వెళ్లారు.. అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. అయితే ఈ ఘటన తర్వాత కులవర్ధన్ పరారయ్యాడు.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.. ఈ క్రమంలో అతడి మృతదేహాన్ని చెరువులో గుర్తించారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి