Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అమ్మాయిల్లో కొందరే ఎందుకు తెల్లగా ఉంటారో తెలుసా? దాని వెనుక సీక్రెట్ ఇదే

18 February 2026

Shoe Hacks: షూ విప్పగానే కంపు కొడుతోందా?.. ఆ భయంకరమైన వాసనను తరిమికొట్టే బ్రహ్మాస్త్రం ఇదే!

18 February 2026

Chapati Vs Rice: అన్నం లేదా చపాతీ.. రాత్రి ఏం తింటే మంచిది..

18 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Mulapet Port Update On Trail Run,ఏపీలో మూడు జిల్లాలకు దశ తిరిగింది.. కొత్త పోర్టు ట్రయల్ రన్‌కు రెడీ – andhra pradesh government focus on mulapeta port trial run likely in april 2026
ఆంధ్రప్రదేశ్

Mulapet Port Update On Trail Run,ఏపీలో మూడు జిల్లాలకు దశ తిరిగింది.. కొత్త పోర్టు ట్రయల్ రన్‌కు రెడీ – andhra pradesh government focus on mulapeta port trial run likely in april 2026

.By .18 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Mulapet Port Update On Trail Run,ఏపీలో మూడు జిల్లాలకు దశ తిరిగింది.. కొత్త పోర్టు ట్రయల్ రన్‌కు రెడీ – andhra pradesh government focus on mulapeta port trial run likely in april 2026
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Mulapet Port Trail Run In April: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పోర్టుల పనులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు కీలకమైన మూలపేట పోర్టు పనులు ఏకంగా 75శాతం పనులు పూర్తి చేశారు. ఏప్రిల్ నెలలో ట్రయల్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన 25శాతం పనుల్ని కూడా ఈ ఏడాది నవంంబర్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ పోర్టుకు అనుబంధంగా ఇండస్ట్రియల్ క్లస్టర్ కూడా ఏర్పాటు కాబోతోంది.

హైలైట్:

  • ఏపీలో కొత్త పోర్టులకు సంబంధించిన పనులు వేగవంతం
  • మూలపేట పోర్టు పనులు కూడా 75శాతం పూర్తి చేశారు
  • ఈ ఏప్రిల్‌లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు కసరత్తు
Mulapet Port
మూలపేట పోర్టు ట్రయల్ రన్(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పోర్టులకు సంబంధించిన పనుల్ని వేగవంతం చేసింది. మచిలీపట్నంతో పాటుగా మూలపేట పోర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నెలకు ఒకసారి పోర్టుకు సంబంధించిన పనులపై సమీక్ష చేస్తున్నారు. పోర్టుకు సంబంధించిన పనులు 75శాతం వరకు పూర్తి చేశారు.. వీటిలో ముఖ్యమైన జనరల్ కార్గో బెర్తులతో పాటుగా నార్త్, సౌత్ వాటర్స్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. అలాగే పోర్టుకు సంబంధించిన మిగిలిన 25శాతం పనులు కూడా ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు.మూలపేట పోర్టును తొలిదశలో రూ.4,361 కోట్లతో 1500 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఈ నిధుల్లో పోర్టుకు సంబంధించిన ఇంటర్నల్ పనుల కోసం కేటాయించిన రూ.2,981 కోట్లలో.. రూ.1,887 కోట్లు ఖర్చు చేశారు. భూసేకరణ, నిర్వాసిత కాలనీకి మిగిలిన నిధుల్ని ఖర్చు చేశారు. పోర్టు పనుల్లో ఏకంగా 32 లక్షల టన్నుల రాయిని బ్రేక్ వాటర్స్ పనుల కోసం ఉపయోగించారు. అలల్ని కూడా తట్టుకునేలా ఈ నిర్మాణం చేశారు. సౌత్‌ బ్రేక్‌ వాటర్‌కు 2,450 మీటర్లు.. నార్త్‌ బ్రేక్‌ వాటర్‌ 580 మీటర్ల పొడవున వేవ్‌వాల్‌ నిర్మాణం పూర్తయ్యింది. పోర్టులో షిప్‌లు ఆగేందుకు వీలుగా 270 మీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పుతో మూడు జనరల్ బెర్తుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.. వీటిలో రెండు బెర్తుల పనులు పూర్తికిగా.. మరో బెర్త్ పనులు ఈ ఏప్రిల్‌కు పూర్తవుతుందంటున్నారు. అలాగే కోల్ బెర్త్ నిర్మాణ పనులు కూడా 50శాతం పూర్తి చేశారు.

మరోవైపు మూలపేట పోర్టుకు రోడ్డు, రైలు కనెక్ట్ చేసే పనులు జరుగుతున్నాయి.. పోర్టుకు సంబంధించిన తాగునీరు, విద్యుత్తు పనులు కూడా చేస్తున్నారు. పోర్టుకు కోల్‌కతా- చెన్నై నేషనల్ హైవే 16కు కనెక్ట్ చేసేందుకు 12.85 కిమీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మూలపేట పోర్టుకు రైల్వే కనెక్టివిటీ కోసం చెన్నై-హౌరా రైల్వే లైన్‌ను.. సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం దగ్గర నుంచి కనెక్ట్ చేస్తున్నారు. మొత్తం 7.8 కిలోమీటర్ల పనులు జరుగుతున్నాయి. పోర్టుకు నీటి సరఫరా కోసం గొట్టా బ్యారేజీ నుంచి పోర్టు వరకు 50 కిలో మీటర్ల పొడువున పైప్‌లైన్ పనులు చేస్తున్నారు. పోర్టుకు విద్యుత్ సరఫరా కోసం టెక్కలి మండలం రావివలస సబ్‌స్టేషన్‌ నుంచి స్తంభాల ఏర్పాటు చేయనున్నారు.

మూలపేట పోర్టుకు అనుసంధానంగా భారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ పోర్టు పూర్తి చేస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు ఎంతో ఉపయోగం. లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయంటున్నారు. ఇప్పుడిప్పుడు పలువురు పారిశ్రామికవేత్తలో పోర్టుకు సమీపంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పోర్టుకు అనుబంధంగా 10వేల ఎకరాలను గుర్తించి.. మూలపేటను ఇండస్ట్రయిల్ క్లస్టర్‌గా మార్చబోతోంది. అధికారులు వీలైనన్ని ఎక్కువ భూముల్ని గుర్తించే పనిలో ఉన్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి