Andhra Pradesh Birth Death Registration New Rules: ఏపీ ప్రభుత్వం జనన, మరణాల నమోదుకు సంబంధించిన నిబంధనల్ని మార్చేసింది. ఇకపై 21 రోజుల్లోగా జనన, మరణాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సిందే. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 21 రోజుల్లోపు నమోదు చేసుకోకపోతే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.. అపరాధ రుసుముతో పాటుగా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏపీ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
హైలైట్:
- ఏపీలో జనన, మరణాల నమోదుకు కొత్త రూల్స్
- ఇకపై 21 రోజుల్లోగా నమోదు చేసుకోవాల్సిందే
- ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నర్సింగ్ అడ్మిషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు కొత్త విద్యా సంవత్సరం (2026-27) నుంచి నీట్-యూజీ పరీక్షను అర్హత పరీక్షగా పరిగణిస్తారు. ఈ అర్హతతోనే కన్వీనర్, మేనేజ్మెంట్ కోటాలో సీట్ల భర్తీకి పరిగణలోకి తీసుకావాలని నిర్ణయించారు. అడ్మిషన్లకు సంబంధించి కుటుంబ సంక్షేమశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అడ్మిషన్ల కోసం అవసరమైన సరవణల కోసం ప్రతిపాదనలు పంపాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని ఆదేశించారు. గత మూడేళ్లుగా ఏపీ ఈఏపీసెట్, ఏపీ ఎన్సెట్ ఆధారంగా ప్రవేశాలు నిర్వహించిన సీట్లు మిగిలిపోయాయి. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటు ఏపీలో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నారు. విద్యార్థులు హాల్టికెట్లను వెబ్సైట్తో పాటుగా లీప్ యాప్, మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు వారి వివరాలను సరిచేసుకుని.. ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే సవరణ చేసేందుకు అవకాశం కూడా కల్పిస్తామని అధికారులు తెలిపారు. తప్పులు ఉన్నాయని ఎవరికీ ఆందోళన అవసరం లేదు అన్నారు. మార్కుల జాబితాలు జారీ చేసేంతవరకు తప్పుల్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.


