Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అమ్మాయిల్లో కొందరే ఎందుకు తెల్లగా ఉంటారో తెలుసా? దాని వెనుక సీక్రెట్ ఇదే

18 February 2026

Shoe Hacks: షూ విప్పగానే కంపు కొడుతోందా?.. ఆ భయంకరమైన వాసనను తరిమికొట్టే బ్రహ్మాస్త్రం ఇదే!

18 February 2026

Chapati Vs Rice: అన్నం లేదా చపాతీ.. రాత్రి ఏం తింటే మంచిది..

18 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Birth Death Registration Rules 2026,ఏపీలో కొత్త నిబంధన అమలు.. 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి, వివరాలివే – andhra pradesh government new rules for birth and death certificate registration
ఆంధ్రప్రదేశ్

Ap Birth Death Registration Rules 2026,ఏపీలో కొత్త నిబంధన అమలు.. 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి, వివరాలివే – andhra pradesh government new rules for birth and death certificate registration

.By .18 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Birth Death Registration Rules 2026,ఏపీలో కొత్త నిబంధన అమలు.. 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి, వివరాలివే – andhra pradesh government new rules for birth and death certificate registration
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Birth Death Registration New Rules: ఏపీ ప్రభుత్వం జనన, మరణాల నమోదుకు సంబంధించిన నిబంధనల్ని మార్చేసింది. ఇకపై 21 రోజుల్లోగా జనన, మరణాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సిందే. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 21 రోజుల్లోపు నమోదు చేసుకోకపోతే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.. అపరాధ రుసుముతో పాటుగా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏపీ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ప్రభుత్వం సూచిస్తోంది.

హైలైట్:

  • ఏపీలో జనన, మరణాల నమోదుకు కొత్త రూల్స్
  • ఇకపై 21 రోజుల్లోగా నమోదు చేసుకోవాల్సిందే
  • ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
AP Birth Death Registration
ఏపీలో 21 రోజుల్లో జనన మరణాల నమోదు తప్పనిసరి(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. రాష్ట్రంలో జనన, మరణాల నమోదుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై 21 రోజుల్లో జనన, మరణాలను నమోదును తప్పనిసరి చేస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధన ప్రకారం.. పుట్టిన/మరణించిన తేదీ నుంచి 21-30 రోజుల్లోపు నమోదు చేసుకుంటే.. రూ.25 అపరాధ రుసుము చెల్లిస్తే సరిపోతుంది. అదే 30 రోజుల నుంచి ఏడాదిలోపు నమోదు చేయాలనుకుంటే నిబంధనలు వేరేగా ఉన్నాయి. రూ.250 అపరాధ రుసుము చెల్లించి.. జిల్లా రిజిస్ట్రార్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. బిడ్డ పుట్టిన సమయంలో కొందరు పేర్లు నమోదు చేసుకోరు.. అలాంటి వాళ్లు ఏడాది (12 నెలలోపు)లోపు ఉచితంగా పేరు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఒకవేళ ఏడాది దాటితే రూ.250 అపరాధ రుసుము చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఏడాది దాటిన తర్వాత జనన/మరణాల నమోదు చేయాలంటే.. కచ్చితంగా ఏడాది దాటితే జిల్లా మేజిస్ట్రేట్‌ లేదా ఆర్డీవో నుంచి ఆదేశాలు కావాల్సిందే. అలాగే ఆలస్యం చేసినందుకు రూ.500 అపరాధ రుసుము చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ ప్రజలు ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త నిబంధనల్ని గమనించి.. జనన, మరణాలను మూడు వారాల్లోగా నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నర్సింగ్ అడ్మిషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలకు కొత్త విద్యా సంవత్సరం (2026-27) నుంచి నీట్‌-యూజీ పరీక్షను అర్హత పరీక్షగా పరిగణిస్తారు. ఈ అర్హతతోనే కన్వీనర్, మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్ల భర్తీకి పరిగణలోకి తీసుకావాలని నిర్ణయించారు. అడ్మిషన్లకు సంబంధించి కుటుంబ సంక్షేమశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అడ్మిషన్ల కోసం అవసరమైన సరవణల కోసం ప్రతిపాదనలు పంపాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని ఆదేశించారు. గత మూడేళ్లుగా ఏపీ ఈఏపీసెట్, ఏపీ ఎన్‌సెట్ ఆధారంగా ప్రవేశాలు నిర్వహించిన సీట్లు మిగిలిపోయాయి. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇటు ఏపీలో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నారు. విద్యార్థులు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌తో పాటుగా లీప్ యాప్, మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు వారి వివరాలను సరిచేసుకుని.. ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే సవరణ చేసేందుకు అవకాశం కూడా కల్పిస్తామని అధికారులు తెలిపారు. తప్పులు ఉన్నాయని ఎవరికీ ఆందోళన అవసరం లేదు అన్నారు. మార్కుల జాబితాలు జారీ చేసేంతవరకు తప్పుల్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి