Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

సొంత కరెన్సీ లేదు.. ఎయిర్‌‌పోర్ట్ అసలే లేదు..! ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం గురించి తెలుసా

18 February 2026

Telangana: 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో కీలకంగా మారనున్న లైఫ్ సైన్సెస్ రంగం!

18 February 2026

వీసా అవసరం లేదు.. పాస్‌పోర్ట్ ఉంటే చాలు! భారతీయులకు తక్కువ బడ్జెట్‌లోనే అదిరిపోయే విదేశీ పర్యటనలు

18 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Chappal Stands,తిరుమల: సత్ఫలితాలు ఇస్తున్న టీటీడీ ఆలోచన.. శ్రీవారి భక్తులకు తప్పిన ఇబ్బందులు.. – qr code based smart footwear tracking system in tirumala
ఆంధ్రప్రదేశ్

Tirumala Chappal Stands,తిరుమల: సత్ఫలితాలు ఇస్తున్న టీటీడీ ఆలోచన.. శ్రీవారి భక్తులకు తప్పిన ఇబ్బందులు.. – qr code based smart footwear tracking system in tirumala

.By .18 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Chappal Stands,తిరుమల: సత్ఫలితాలు ఇస్తున్న టీటీడీ ఆలోచన.. శ్రీవారి భక్తులకు తప్పిన ఇబ్బందులు.. – qr code based smart footwear tracking system in tirumala
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమలలో భక్తుల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన స్మార్ట్ ఫుట్‌వేర్ ట్రాకింగ్ సిస్టమ్ మంచి ఫలితాలను ఇస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఎన్ని లావాదేవీలు జరిగాయనే వివరాలను టీటీడీ వెల్లడించింది. ఈ వ్యవస్థ ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించటంతో పాటుగా తిరుమలలో పరిశుభ్రతను మెరుగుపరుస్తున్నామని తెలిపింది. రాబోయే రోజులలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

Tirumala Chappal stand
తిరుమలలో చెప్పుల స్టాండ్లు(ఫోటోలు– Samayam Telugu)
శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ఆలోచన సత్ఫలితాలు ఇస్తోంది. భక్తుల సౌకర్యం కోసం తిరుమలలో టీటీడీ క్యూఆర్ కోడ్ ఆధారిత పాద రక్షల ట్రాకింగ్ అండ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యవస్థ ఇప్పుడు భక్తులకు మంచి ఫలితాలను అందిస్తోంది. అధునాతన టెక్నాలజీ సాయంతో పనిచేసే ఈ విధానం ద్వారా శ్రీవారి భక్తులు తమ పాదరక్షలను సులభంగా డిపాజిట్ చేయటంతో పాటుగా, తిరిగి వేగంగా పొందగలుగుతున్నారు. మరోవైపు 2025 సెప్టెంబర్ నుంచి ఈ విధానం అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి 2026 ఫిబ్రవరి 15వ తేదీ వరకూ మొత్తం 8,45,816 పాదరక్షల డిపాజిట్–డెలివరీ లావాదేవీలు ఈ విధానం ద్వారా నిర్వహించారు. భక్తుల నుంచి స్వీకరించిన 4,24,047 పాదరక్షల్లో, 4,21,769 తిరిగి అందజేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి భక్తులకు ఈ విధానం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందని టీటీడీ చెప్తోంది. గతంలో తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో పాదరక్షలు ఎక్కడికక్కడే ఉంటూ భక్తులకు ఇబ్బందులు కలిగించేవి. ఈ నేపథ్యంలోనే ఆ సమస్యలకు పరిష్కారంగా టీటీడీ ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ సహకారంతో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానం అమలు కాకముందు పాద రక్షలు కనిపించకుండా పోవటం వంటి సమస్యలతో భక్తులు ఇబ్బందులు పడేవారు. అయితే ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి సమస్యలు పూర్తిగా తొలగిపోయాయని భక్తులు చెప్తున్నారు.

భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో అవసరం మేరకు భవిష్యత్తులో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసే విషయంపై టీటీడీ అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. అలాగే సిబ్బంది సంఖ్యను పెంచడం ద్వారా ఈ వ్యవస్థను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే బేడి ఆంజనేయస్వామి ఆలయం, కల్యాణకట్ట, ఏటీసీ సర్కిల్ వద్ద అదనంగా మూడు కేంద్రాలు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉండే మాడ వీధుల్లో పాద రక్షలు ధరించడం నిషిద్ధం. ఈ నేపథ్యంలో భక్తులు తప్పనిసరిగా ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ చెప్తోంది. ఈ వ్యవస్థ వల్ల తిరుమలలో పరిశుభ్రత మరింత మెరుగవ్వటమే కాకుండా.. భక్తులకు సౌకర్యమైన, ఆహ్లాదకరమైన దర్శన అనుభవం అందించవచ్చని భావిస్తోంది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి