Guntur Wife Kills Husband On Tv Volume Dispute,టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను చంపేసిన భార్య.. ఈమె పాత స్టోరీ తెలిసి మైండ్ బ్లాంక్! – wife kills husband after dispute on tv volume in mangalagiri guntur district
Wife Kills Husband On TV Volume Dispute In Mangalagiri Guntur District: గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది. భర్తను భార్య కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. టీవీ సౌండ్ తగ్గించమని చెప్పినందుకు భార్య భర్తను చంపేసింది. వీరిద్దరు 8 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. అయితే ఈ మహిళకు గతంలోనే వివాహమైంది.. ఆమె గురించి కీలక విషయాలు తెలిశాయి.
హైలైట్:
గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం
భర్తను అతి దారుణంగా చంపేసిన భార్య
టీవీ సౌండ్ తగ్గించమన్నుందుకే హత్య
టీవీ సౌండ్ తగ్గించమన్న భర్తను చంపిన భార్య(ఫోటోలు– Samayam Telugu)
టీవీ సౌండ్ తగ్గించే విషయంలో మొదలైన చిన్న గొడవ హత్యకు దారి తీసింది. భార్య భర్తను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు ప్రాథమికంగా చెబుతున్న వివరాల ప్రకారం.. మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. క్రాంతి అనే యువతికి అహ్మద్ 8 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట కొంతకాలంగా మంగళగిరి టిడ్కో ఇళ్లలో బీ-16 బ్లాకులో నివాసం ఉంటున్నారు. అహ్మద్ రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నాడు.. గురువారం ఇంటికి వచ్చాడు. అయితే ఆ సమయంలో భార్య క్రాంతి సౌండ్ పెంచి టీవీ చూస్తోంది. ఇంట్లో టీవీ సౌండ్ ఎక్కువగా ఉండటంతో అహ్మద్.. తగ్గించమని అహ్మద్ భార్య క్రాంతికి సూచించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిది. ఇంతలో అహ్మద్ భార్యపై చేయిచేసుకున్నాడు. ఇద్దరి మధ్య వివాదం ముదిరింది.. ఆ కోపంలో క్రాంతి అక్కడే ఉన్న ఉల్లిపాయలు కోసే కత్తి తీసుకుని భర్త అహ్మద్ను పొడిచింది. అయితే కొందరు స్థానికులు గమనించి అహ్మద్ను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. అహ్మద్ అప్పటికే చనిపోయాడు. మృతుడి తల్లి మహాబీ పోలీసులకు ఫిర్యాదు చేడయంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అహ్మద్ మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఏసీ మెకానిక్గా పనిచేస్తున్న అహ్మద్కు ఏడాదిన్నర క్రితం క్రాంతితో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.. ఆమెకు గతంలోనే వివాహమైందట.. ఆమె భర్త జైలులో ఉన్నాడట. అహ్మద్తో పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. 8 నెలల క్రితం అహ్మద్, క్రాంతిలు పెళ్లు చేసుకుని మంగళగిరి టిడ్కో ఇళ్లలో బీ-16 బ్లాకులో ఉంటున్నారు. ఇంతలో టీవీ సౌండ్ విషయంలో మొదలైన గొడవలో అహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి