Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Watermelon: ఏంటీ పుచ్చకాయను ఉప్పుతో తింటున్నారా? అయితే ఆ సమస్యలకు ఆహ్వానం పలికినట్టే!

20 February 2026

రెండేళ్ల మేనల్లుడి గొంతు కోసి చంపి, శవాన్ని ఒళ్లో పెట్టుకుని కూర్చొన్న మహిళ..!

20 February 2026

Brain Health: చిన్న వయసులో మతి మరుపుకు చెక్.. ఇవి తింటే మీ మెదడు పాదరసంలా పరిగెడుతుంది…

20 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Single Man Commission On Tirumala Laddu,Tirumala laddu Row:: లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం.. రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు.. – ap government appoints retired ias dinesh kumar single man inquiry commission on tirumala laddu adulteration ghee case
ఆంధ్రప్రదేశ్

Ap Single Man Commission On Tirumala Laddu,Tirumala laddu Row:: లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం.. రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు.. – ap government appoints retired ias dinesh kumar single man inquiry commission on tirumala laddu adulteration ghee case

.By .20 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Single Man Commission On Tirumala Laddu,Tirumala laddu Row:: లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం.. రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు.. – ap government appoints retired ias dinesh kumar single man inquiry commission on tirumala laddu adulteration ghee case
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్‌ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై అధ్యయనం జరిపి.. 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ శుక్రవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు.

tirumala laddu
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై అధ్యయనం జరిపి 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని దినేష్ కుమార్‌ను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పరిపాలన లోపాలు, టెండర్లపై సమగ్ర పరిశీలన చేసి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించనుంది.

ఏకసభ్య కమిషన్ ఏర్పాటుపై వైసీపీ రియాక్షన్

మరోవైపు తిరుమల లడ్డూ అంశంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడంపై వైసీపీ స్పందించింది. ఈ విషయంపై వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయంపై భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై చంద్రబాబుకు నమ్మకం లేదని భూమన విమర్శించారు. సీబీఐ సిట్ నివేదిక తమకు అనుకూలంగా రాలేదు కనుకే.. ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు కుట్రలను తిరుమల శ్రీవారు బయటపెట్టారంటూ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై సీబీఐ సిట్ నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా అధికార, విపక్షాల మధ్యన మాటలయుద్ధం జరుగుతోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక చెప్పిందంటూ వైసీపీ చెప్తుండగా.. కల్తీ జరిగినట్లు నివేదిక ద్వారా స్పష్టమైందని ప్రభుత్వం వాదన. ఈ నేపథ్యంలోనే ఇటీవల విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన కూటమి పార్టీలు.. ఈ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విలేకర్ల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తిరుమల లడ్డూలో కల్తీకి సంబంధించి అసలు దోషులను గుర్తిస్తామన్న చంద్రబాబు.. సీబీఐ సిట్ తమకు పంపిన నివేదికపై ఏకసభ్య కమిషన్ ద్వారా అధ్యయనం జరుపుతామని ఇటీవల ప్రకటించారు.

ఈ క్రమంలోనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. 45 రోజుల్లోగా సీబీఐ నివేదికతో పాటుగా ఇతర అంశాలపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి