Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vangalapudi Anitha: మంత్రి మనసు దోచిన బజ్జీలు.. నేరుగా వెళ్లి ఆమె ఏం చేశారో చూడండి!

21 February 2026

హోలీ తర్వాత వీరికి ఊహించని అదృష్టం.. వీరికి రాజయోగమే!

21 February 2026

Andhra News: వామ్మో ఇదేంది భయ్యా ఇంతుంది.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్!

21 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Konaseema Sinking Down,కోనసీమ జిల్లా: ఏటా కిందకు కుంగుతున్న భూమి.. 10 మి.మీ. నుంచి 20 మి.మీ.. వరకూ.! – ambedkar konaseema is sinking by 10 mm to 20 mm every year gv sundar raises concerns
ఆంధ్రప్రదేశ్

Konaseema Sinking Down,కోనసీమ జిల్లా: ఏటా కిందకు కుంగుతున్న భూమి.. 10 మి.మీ. నుంచి 20 మి.మీ.. వరకూ.! – ambedkar konaseema is sinking by 10 mm to 20 mm every year gv sundar raises concerns

.By .21 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Konaseema Sinking Down,కోనసీమ జిల్లా: ఏటా కిందకు కుంగుతున్న భూమి.. 10 మి.మీ. నుంచి 20 మి.మీ.. వరకూ.! – ambedkar konaseema is sinking by 10 mm to 20 mm every year gv sundar raises concerns
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏటా కిందకు కుంగుతోందనే అనుమానాలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ అనుమానాలపై శాస్త్రీయ అధ్యయనం జరపాలని గతంలో ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా గోదావరి జిల్లాలకు చెందిన జీవీ సుందర్ అనే వ్యక్తి చేసిన వీడియోతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది. కోనసీమ జిల్లా ఏటా 10 నుంచి 20 మిమీ కిందకు కుంగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Konaseema
కోనసీమ జిల్లా: ఏటా కిందకు కుంగుతున్న భూమి..(ఫోటోలు– Samayam Telugu)
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతి ఏటా కిందకు కుంగిపోతోందా.. ప్రతీ సంవత్సరం సముద్రమట్టం కంటే 10 నుంచి 20 మిల్లీమీటర్లు దిగువకు కుంగుతోందా.. ఈ అనుమానాలు ఇప్పుడు మరోసారి మొదలయ్యాయి. గోదావరి జిల్లాలకు చెందిన జి.వి. సుందర్ అనే వ్యక్తి చేసిన వీడియోతో ఈ ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ మొదలయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వీడియోలో అంబేద్కర్ కోనసీమ జిల్లావాసులు ఉప్పు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని జీవీ సుందర్ చెప్పుకొచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో నాలుగు నియోజకవర్గాలలో ఈ సమస్య ఉందని వివరించారు.

“రాజోలు, పి, గన్నవరం. ముమ్మిడివరం, అమలాపురంలోని ప్రజలు ఉప్పు నీటితో ఇబ్బందులు పడుతున్నారు. చుట్టూ గోదావరి నది.. గోదావరి మధ్యలో డెల్టా ప్రాంతం.. దేవుడు ఫ్రెష్ వాటర్ ఇచ్చినప్పటికీ తాగడానికి ఉపయోగం లేకుండా పోతోంది. బోరు వేస్తే 20 అడుగులకే నీరు పడుతుంది. కానీ అంతకంటే లోతుకు వెళ్తే ఎందుకూ పనిచేయని ఉప్పు నీరు వస్తోంది. ఇందుకు రెండే కారణాలు. ఒకటి అక్రమంగా నిర్మించిన ఆక్వా చెరువులు, రెండోది గ్యాస్ డ్రిల్లింగ్. కొంతమంది అధికారులు లంచాలు తీసుకుని ఆక్వా చెరువులకు అనుమతులు ఇస్తున్నారు. దీంతో ఇష్టానుసారం ఆక్వా చెరువులు వెలుస్తున్నాయి. ఆక్వా చెరువుల వద్ద ఉప్పు నీరు పెడతారు. డెల్టా ప్రాంతం కావటంతో ఈ ఉప్పునీరంతా కింద ఉన్న మంచినీటితో కలిసి భూగర్భ జలాల రుచి మారిపోతోంది.” అని జీవీ సుందర్ వివరించారు.

” కోనసీమ ప్రాంతంలో గ్యాస్ నిల్వలు అత్యధికం. ఈ గ్యాస్ వలన దేశానికి చాలా లాభం ఉంది కానీ.. అదే గ్యాస్ వలన కోనసీమ ప్రాంతానికి నష్టం జరుగుతోంది. కోనసీమ ప్రాంతం ప్రతీ సంవత్సరం సముద్రమట్టం కంటే 10 నుంచి 20 మిల్లీమీటర్ల కిందకు వెళ్తోంది. భూగర్భంలో ఉన్న గ్యాస్ నిక్షేపాలను వెలికి తీసిన తర్వాత.. రూల్ ప్రకారం తాజా నీరు ఎక్కించాల్సి ఉంటుంది. అలా కాకుండా గ్యాస్ నిల్వలు బయటకు తీసివేసి.. నీరు నింపకుండా వదిలేయటం వలన కోనసీమ ప్రాంతం ఏటా సముద్ర మట్టం కంటే 10 మి.మీ.. నుంచి 20 మి.మీ దిగువకు వెళ్తోంది. ఫలితంగా సముద్రపు నీరు బ్యాక్ వాటర్లలోకి వచ్చి కోనసీమ జిల్లాలోని భూగర్భజలాలు ఉప్పునీరుగా మారుతున్నాయి. ఈ నీటితో పంటలకు, తాగడానికి ఉపయోగం ఉండదు.” అని జీవీ సుందర్ వివరించారు. వియత్నాంలోని మెకాంగ్‌లోనూ ఇలాంటి సమస్యే వేధిస్తోందన్న ఆయన.. ప్రభుత్వం వెంటనే సెలైనిటీసెస్ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. ఇబ్బంది వచ్చిన తర్వాత బాధపడేకంటే ముందుగానే అప్రమత్తం కావడం మంచిదంటున్నారు. కేంద్రం నుంచి నిధులు సమకూర్చుకుని సెలైనిటీసెస్ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు గతేడాది జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ సైతం ఇదే తరహా అనుమానం వ్యక్తం చేశారు. గ్యాస్ నిక్షేపాల తవ్వకాల మూలంగా కోనసీమ జిల్లాలో భూమి కుంగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని.. దీనిపై సాంకేతిక అధ్యయనం చేయాలని వరప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా మరోసారి ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి