Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Malaika Arora: మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఆ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్! ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

24 February 2026

NEET పరీక్ష రాయాలని ఒత్తిడి.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికిన సొంత కొడుకు!

24 February 2026

Saturn Transit: శక్తివంతమైన శని సంచారం.. ఐశ్వర్యం, అదృష్టం.. 5 నెలలపాటు ఈ రాశులకు తిరుగులేదు..!

24 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Nris Return Safely From Iran,ఇరాన్‌లో ఉన్న తెలుగువారు స్వస్థలాలకు చేరుకోవాలి.. ఏపీ మంత్రి సూచన – ap minister kondapalli srinivas urges andhra pradesh nris in iran to return safely amid unrest and protests
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Nris Return Safely From Iran,ఇరాన్‌లో ఉన్న తెలుగువారు స్వస్థలాలకు చేరుకోవాలి.. ఏపీ మంత్రి సూచన – ap minister kondapalli srinivas urges andhra pradesh nris in iran to return safely amid unrest and protests

.By .24 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Nris Return Safely From Iran,ఇరాన్‌లో ఉన్న తెలుగువారు స్వస్థలాలకు చేరుకోవాలి.. ఏపీ మంత్రి సూచన – ap minister kondapalli srinivas urges andhra pradesh nris in iran to return safely amid unrest and protests
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhras In Iran Urged To Return Safely: ఇరాన్‌లో పరిస్థితుల దృష్ట్యా అక్కడి ప్రవాసాంధ్రులు స్వస్థలాలకు వచ్చేయాలని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఇరాన్‌లో ఉన్నవారంతా వెంటనే వచ్చేయాలని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే కేంద్రం కూడా భారతీయులు స్వదేశాలకు వచ్చేయాలని అడ్వైజరీని జారీ చేశారు. ఈ మేరకు హెల్ప్‌లైన్‌ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • ఇరాన్‌లో ప్రవాసాంధ్రులకు అలర్ట్
  • స్వదేశాలకు వచ్చేయాలని సూచన
  • ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Andhra Pradesh Nris In Iran
(ఫోటోలు– Samayam Telugu)
ఇరాన్‌లో ఉన్న రాష్ట్ర విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రవాసాంధ్రులు వెంటనే స్వస్థలాలకు చేరుకోవాలని సూచించారు ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే సూచనల్ని కూడా పాటించాలని ఇరాన్‌లో ఉన్న ప్రవాసాంధ్రులకు సూచించారు. ప్రవాసాంధ్రులు ఇరాన్‌లో అందుబాటులో ఉన్న ప్రయాణమార్గాల ద్వారా వీలైనంత త్వరగా స్వస్థాలకు చేరుకోవాలి అన్నారు. ఇరాన్‌లో ప్రవాసాంధ్రులు పాస్‌పోర్టులు, ఐడీ కార్డులు, మిగిలిన ఇమ్మిగ్రేషన్‌ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఇరాన్‌లో ప్రస్తుతం నిరసనలు జరుగుతున్నాయని.. ఆ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇరాన్‌లోని ప్రవాసాంధ్రులు అక్కడి భారత రాయబారి కార్యాలయంతో, ఏపీఎన్‌ఆర్‌టీతో సంప్రదించాలన్నారు. అలాగే ఇరాన్‌లో సాయం కోసం ఏపీఎన్‌ఆర్‌టీ సహాయ కేంద్రం నంబర్‌ +918500027678ను సంప్రదించాలని సూచించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.కేంద్రం కూడా ఇరాన్‌లో ఉన్న భారతీయులంతా స్వదేశానికి వచ్చేయాలని సూచిస్తోంది. ఇరాన్‌లో భారతీయులు 10వేలమందికిపైగా ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే ఇండియన్స్ నిరసననలు జరిగే ప్రాంతానికి వెళ్లొద్దని సూచించారు. భారత పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అంతేకాదు అమెరికా ఇరాన్‌పై ఎప్పుడైనా దాడి చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయంటున్నారు. ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. విద్యార్థులు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇరాన్‌పై అమెరికా దాడి చేయనుందనే ప్రచారంతో ఈ ప్రదర్శనలు జరుగుతున్నాయి. భారతీయులందరూ ఇరాన్‌లోని రాయబార కార్యాలయంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. భారతీయులు ఇరాన్ వీడి ఇండియాకు రావాలని.. విమానాలు సహా అందుబాటులో ఉన్న ఏదైనా రవాణా సౌకర్యాలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ దగ్గర తమ వివరాలు నమోదు చేయించుకోని వారు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కూడా సూచించారు.

అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం కింది నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
+98 912 810 9115
+98 912 810 9109
+98 912 810 9102
+98 993 217 9359
ఈమెయిల్: cons.tehran@mea.gov.in
తెలుగువారితో పాటుగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి