Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood : తెలుగులో చేసిన రెండు సినిమాలు ప్లాప్.. అయినా కోటి వసూలు చేస్తున్న హీరోయిన్..

24 February 2026

ఇక్కడ ఇచ్చే నూనే సర్వరోగ నివారణి అంట.. ఏ వ్యాధి అయిన ఇట్టే నయం.. ఆ ప్రత్యేకత ఏమిటంటే..?

24 February 2026

Holi Alert: ఎంజాయ్ చేయండి కానీ.. హోళీ నాడు ఈ రంగుల జోలికి మాత్రం వెళ్లొద్దు..!

24 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Normal Deliveries In Visakhapatnam Government Victoria Hospital,ప్రభుత్వ ఆస్పత్రి సాధారణ ప్రసవాలకు కేరాఫ్ అడ్రస్.. ISO ధ్రువీకరణ పత్రం – more normal deliveries in visakhapatnam government victoria hospital
ఆంధ్రప్రదేశ్

Normal Deliveries In Visakhapatnam Government Victoria Hospital,ప్రభుత్వ ఆస్పత్రి సాధారణ ప్రసవాలకు కేరాఫ్ అడ్రస్.. ISO ధ్రువీకరణ పత్రం – more normal deliveries in visakhapatnam government victoria hospital

.By .24 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Normal Deliveries In Visakhapatnam Government Victoria Hospital,ప్రభుత్వ ఆస్పత్రి సాధారణ ప్రసవాలకు కేరాఫ్ అడ్రస్.. ISO ధ్రువీకరణ పత్రం – more normal deliveries in visakhapatnam government victoria hospital
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Visakhapatnam Government Victoria Hospital Normal Deliveries: సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలామంది ఆలోచిస్తారు. అయితే విశాఖపట్నంలోని విక్టోరియా ఆస్పత్రిలో మాత్రం నాణ్యమైన సేవలు అందిస్తున్నారు. ఆ ఆస్పత్రిలో సాదారణ ప్రసవాలుఎక్కువ అవుతున్నాయి. గతేడాది ఏకంగా 3,214 మంది శిశువుల సాధారణ ప్రసవంలో జన్మించారు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఘోషాసుపత్రి సేవలకు ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రం కూడా అందించారు. ఏపీ నుంచి మాత్రమే కాదు ఒడిశా నుంచి కూడా వైద్యం కోసం వస్తున్నారు.

హైలైట్:

  • విశాఖపట్నంలో ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి
  • ఇక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు
  • ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారు
Vizag Government Victoria Hospital
విశాఖపట్నం ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి(ఫోటోలు– Samayam Telugu)
విశాఖపట్నంలోని ఆ ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే సాధారణ ప్రసవానికి డాక్టర్లు ప్రాధాన్యం ఇస్తారు. ఒకే ఏడాదిలో ఏకంగా 3వేలమందికిపైగా సాధారణ ప్రసవాలు చేశారు. పేద, మధ్యతరగతి వారికి విశాఖపట్నంలోని ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి వరంలా మారింది. అక్కడ డాక్టర్లు సాధారణ ప్రసవం కోసం ప్రయత్నిస్తారు.. ఒకవేళ వీలుకాకపోతేనే సిజేరియన్ చేస్తారు. ఇటీవల కాలంలో ఈ ఆస్పత్రికి వెళ్లేందుకు గర్భిణిలు ఆసక్తి చూపిస్తున్నారట. ఈ ఆస్పత్రికి వచ్చేవారికి అందించే సేవలు, భద్రత, నిర్వహణ వంటి అంశాల్లో ప్రమాణాలు పాటిస్తున్నారు. అందుకే విశాఖపట్నంలోని ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రికి ఇటీవల హైదరాబాద్‌కు చెందిన హెచ్‌వైఎం అంతర్జాతీయ సంస్థ ఐఎస్‌వో ధ్రువీకరణ పత్రం అందించింది. విశాఖపట్నంలోని ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రిలో మొత్తం 250 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రికి సంబంధించి నలుగురు డాక్టర్లు, ఏయూ మెడికల్ కాలేజీ నుంచి నలుగురు ప్రొఫెసర్లు, మరో అసోసియేట్ ప్రొఫెసర్, 9మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అక్కడికి వచ్చే వారికి సేవలు అందిస్తున్నారు. విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటుగా పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి కూడా గర్భిణులు ప్రసవం కోసం విక్టోరియా ఆస్పత్రికి వస్తుంటారు. ఈ ఆస్పత్రికి హైరిస్క్‌ ఉన్న గర్భిణులను కూడా తీసుకొస్తుంటారు.

విశాఖపట్నంలోని విక్టోరియా ఆస్పత్రిలో లాప్రోస్కోపిక్‌ సర్జరీల కోసం అత్యాధునిక సామాగ్రిని ప్రభుత్వం, దాతలు కలిసి అందించారు. కొన్ని సందర్భాల్లో హైరిస్క్ కేసులు ఉంటాయి.. వీరు ప్రసవం అనంతరం ఇంటికి వెళ్లినా సరే.. మళ్లీ మామూలు స్థితికి వచ్చే వారకు స్థానికంగా ఉండ సీహెచ్‌సీ, పీహెచ్‌సీ వైద్యులు, ఆశా కార్యకర్తల ద్వారా పర్యవేక్షణ కూడా చేస్తారు. ఈ ఆస్పత్రిలో రోజుకు సుమారు 220 వరకు ఓపీలు నమోదవుతున్నాయి.. వీటిలో సర్జరీలు, ప్రసవాలు కూడా ఉంటాయి. ఈ ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు ఉండటంతో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. గతేడాది సాధారణ ప్రసవాలు 3,214 ఉంటే.. సిజేరియన్‌‌లు 2123 ఉన్నాయట.

రూ.1.25 లక్షల విలువైన ఇంజెక్షన్లు పూర్తిగా ఉచితం.. ప్రాణాంతకమైన వ్యాధికి ట్రీట్మెంట్ ఫ్రీ

విక్టోరియా ఆస్పత్రిలో కొత్తగా మదర్, ఛైల్డ్ బ్లాక్ నిర్మాణం చేపట్టాలని.. ప్రస్తుతం ఆస్పత్రిలో ఎనస్తీషియా, పిల్లల వైద్యులు ఒక్కొక్కరే ఉండటంతో.. వారిని నియమించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. త్వరలోనే వీరిని నియమిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విక్టోరియా ఆస్పత్రిలో నవజాత శిశువులకు స్పెషల్‌ న్యూబార్న్‌ కేర్‌ యూనిట్‌ ద్వారా వైద్యం అందిస్తున్నారు. అంతేకాదు పసిపిల్లలకు ఇన్‌ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు. ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే చాలామంది ఆలోచిస్తారు.. కానీ విశాఖపట్నంలో ఉన్న విక్టోరియా ఆస్పత్రికి ఎక్కువమంది గర్భిణిలు వెళుతున్నారట. ఈ ఆస్పత్రికి ఐఎస్‌వో సర్టిఫికేట్ కూడా రావడం మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి